జనసేన పార్టీ బీమా పత్రాలు క్రియాశీల సభ్యత్వ కిట్లు పంపిణీ

జనసేన పార్టీ బీమా పత్రాలు క్రియాశీల సభ్యత్వ కిట్లు పంపిణీ

సిద్దిపేట నేటి ధాత్రి*

ఉమ్మడి మెదక్ జిల్లా జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆదేశాల మేరకు జనసేన పార్టీ రాష్ర్ట యూత్ సెక్రటరీ మరియు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి పవన్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు భీమా పత్రాలు మరియు సభ్యత్వ కిట్లు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా లోని అన్ని నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు.ఈ సందర్భంగా దాసరి పవన్ మాట్లాడుతూ దేశ చరిత్రలో ఏ పార్టీ కార్యకర్తల కోసం ప్రవేశపెట్టని ప్రమాద బీమా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం చేసుకున్న వారి కోసం కేవలం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎంతో గొప్పగా ఆలోచించి అయిదు లక్షల ప్రమాద బీమా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని జనసేన పార్టీ రానున్న రోజులలో పార్టీని.పార్టీ ఆశయాలను గ్రామగ్రామాన ప్రతి గడప గడపకు పార్టీని తీసుకెళ్లి బలోపేతం చేయాలన్నారు.తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి కల్పించాలని అలాగే లక్ష ఉద్యోగాలు ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని.అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ కేటాయించాలని.అర్హులైన నిరు పేదలందరికీ తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం స్పందించని పక్షంలో జనసేన పార్టీ పక్షాన పోరాడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బండిపల్లి కృష్ణ.భాను చందర్ గౌడ్ 

దేవరాజ్.మహేష్.హైమదు.

 విజయ్.నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *