జైపూర్, నేటి ధాత్రి :
గురువారం రోజున జైపూర్ మండల పరిషత్ కార్యాలయాన్ని మంచిర్యాల జిల్లా పరిషత్ సిఈఓ గణపతి సందర్శించారు.ఈ పర్యటనలో భాగంగా జైపూర్ ఎంపీడీవో సత్యనారాయణ మరియు సూపర్ఇండెంట్ కుమారస్వామి ద్వారా కార్యాలయం నిర్వహణ తీరును గురించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా జైపూర్ మండల పరిధిలోని గ్రామాలలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనుల తీరును గురించి, త్రాగునీటి సదుపాయాల గురించి, పారిశుద్ధ్య కార్యక్రమాల పనితీరు గురించి మొదలగు అంశాలను గురించి అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా సీఈఓ గణపతిని ఎంపీడీవో మరియు సిబ్బంది కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు.