రజతోత్సవ సభను విజయవంతం చేసిన మాజీ ఎమ్మెల్యే.

రజతోత్సవ సభను విజయవంతం చేసిన మాజీ ఎమ్మెల్యే పెద్దికి సన్మానం.

ఉద్యమ సారధిని సన్మానించిన మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి.

నల్లబెల్లి  నేటి ధాత్రి:

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కృషిచేసి రథసారధి కేసీఆర్ అడుగుజాడలో నడుస్తూ వెన్నుదన్నుగా నిలిచి తెలంగాణ ప్రజల గొంతును కేంద్ర ప్రభుత్వాలపై పోరాడిన వ్యక్తి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అని ఆయన అన్నారు. ఉద్యమ పార్టీగా పుట్టి రాజకీయ పార్టీగా అవతరించి దేశ రాజకీయాలను శాసించే శక్తిగా ఎదిగిన భారత రాష్ట్ర సమితి పార్టీ 25వ వసంతాల రజతోత్సవ సభను తన భుజస్కందాలపై మోస్తూ సభను విజయవంతం చేయడంలో తన మార్కు చూపించిన పెద్దికి మండల పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా శాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కక్కర్ల శ్రీనివాస్ గౌడ్, నాయకులు గందే శ్రీనివాసులు గుప్తా, మామిండ్ల మోహన్ రెడ్డి, ఊరటి అమరేందర్ రెడ్డి, భగీరథ, రాజు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version