11వ మహాసభను జయప్రదం చేయండి .

11వ మహాసభను జయప్రదం చేయండి

మందమర్రి నేటి ధాత్రి :

 

 

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మందమర్రి 11వ మహాసభను జయప్రదం చేయండి..
ఈనెల 18వ తేదీన భారత కమ్యూనిస్టు పార్టీ మందమర్రి పట్టణ 11వ మహాసభను విజయవంతం చేయాలని ఈరోజు స్థానిక ఏఐటీయూసీ కార్యాలయంలో విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి.. కామెర దుర్గారాజ్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భీమనాధుని సుదర్శన్ సిపిఐ జిల్లా సమితి సభ్యులు శైలేంద్ర సత్యనారాయణ మాట్లాడుతూ . దున్నేవాడికే భూమిని అను నినాదంతో పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పించడంలో ముఖ్యపాత్ర పోషించిన ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ.. మందమర్రి ప్రాంతంలో నాడు దొరల భూస్వాములు వారి అనుచరులు గుండాలు ప్రజలను కట్టు బానిసలుగా చేసి చిత్రహింసల గురి చేసినటువంటి సమయంలో కామ్రేడ్ టి వి అబ్రహం
దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసి పేదలకు భూములు పంచిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీకి ఉంది. ఈ కార్యక్రమంలో బండారి రాజేశం బియ్యాల పద్మ ఆంటోని దినేష్. ఆర్ జనార్ధన్. ఉప్పులేటి తిరుపతి.. సుంకర శ్రీనివాస్ నరసయ్య తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version