హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 169వ వారం అన్నదానం

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 169వ వారం అన్నదానం….

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 169వ అన్నదాన కార్యక్రమం శనివారం గంగారంలోని హోప్ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో హోప్ సభ్యులతో పాటు చైర్మన్ కొండ విజయ్కుమార్, కొండా ప్రియాంక పాల్గొని ప్రజలకు అన్న ప్రసాదాలు వడ్డించారు. ఈ వారం అన్నదాన కార్యక్రమానికి సుమారు 2900 మంది పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. హోప్ చైర్మన్ విజయ్కుమార్ అభిమానూలు అన్నదాన కార్యక్రమంలొ పాల్గొన్నారు.

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి శనివారం చేపడుతున్న అన్నదానం కార్యక్రమం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. నిత్యం పనులు చేసుకుంటూ జీవనం గడిపే తమకు ప్రతి వారం ఉచిత భోజనం అందజేయడం పట్ల హోప్ ఫౌండేషన్ చైర్మెన్ కొండ విజయ్ కుమార్ కు ప్రత్యేక దన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హోప్ సభ్యులు అపర్ణ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version