అంతర్జాతీయ వేదికపై భారత పతాకం రెపరెపలు…

అంతర్జాతీయ వేదికపై భారత పతాకం రెపరెపలు
* అబుదాబిలో ఓపెన్ మాస్టర్స్ క్రీడల్లో రెండు బంగారు పతకాలు
* 3000 మీటర్లు, 1500 మీటర్ల పరుగుల్లో సత్తా చాటిన డాక్టర్ కొలన్ జగజ్జీవన్ రెడ్డి

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి 

ప్రపంచ దేశాల మధ్య జరుగుతున్న ప్రతిష్ఠాత్మక క్రీడా పోటీల్లో నిలబడటం ఒక్కటే పెద్ద సవాలు కాగా, అందులోనే రెండు విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించడం అరుదైన ఘనతగా నిలుస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబిలో ఎమిరేట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓపెన్ మాస్టర్స్ గేమ్స్–2026లో భారతదేశానికి చెందిన అంతర్జాతీయ అథ్లెట్ డాక్టర్ కొలన్ జగజ్జీవన్ రెడ్డి 3000 మీటర్లు, 1500 మీటర్ల పరుగుపందాల్లో మొదటి స్థానంలో నిలిచి రెండు బంగారు పతకాలను కైవసం చేసుకున్నారు. ఫిబ్రవరి 6న ప్రారంభమైన ఈ క్రీడా మహోత్సవంలో 148 దేశాలకు చెందిన సుమారు 27 వేల మంది క్రీడాకారులు పాల్గొనగా, తీవ్ర పోటీ మధ్య ఆయన ప్రదర్శించిన పట్టుదల, స్థైర్యం ప్రత్యేకంగా నిలిచింది. • గత విజయాల జాడలోనే కొత్త రికార్డు: ఇప్పటికే 2024లో అమెరికాలో జరిగిన అంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీల్లో బంగారు పతకం సాధించిన ఆయన, అదే ఆత్మవిశ్వాసంతో అబుదాబి వేదికపై మరోసారి ప్రతిభ చాటుతూ దేశానికి కీర్తి తీసుకువచ్చారు. • దేశ గౌరవమే లక్ష్యం: భారత పతాకం ఎగురవేయడం ప్రతి క్రీడాకారుడి కల కాగా, స్వర్ణ పతకాలతో దేశానికి గౌరవం తేవడం గర్వకారణమని డాక్టర్ జగజ్జీవన్ రెడ్డి పేర్కొన్నారు; రాబోయే రోజుల్లో జరిగే అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని మరిన్ని విజయాలు సాధించి దేశ ప్రతిష్ఠను మరింత పెంచాలనే లక్ష్యంతో సిద్ధమవుతున్నట్లు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version