నిరుపేద కుటుంబానికి చేయూత..

నిరుపేద కుటుంబానికి చేయూత

నేటిదాత్రి :హన్మకొండ

ఇటీవల కాలంలో బండారి లక్ష్మి ముదిరాజ్ అనారోగ్య రీత్యా మరణించిన నేపథ్యంలో
పిఆర్ ముదిరాజ్ సేవా సమితి తాళ్ళ రవీందర్, సింగారపు రామకృష్ణ ఆధ్వర్యంలో గ్రామ కుల పెద్దలు దండు నర్సయ్య, దండు రవి, దండు రాజు సమక్షంలో బాధిత కుటుంబానికి 10,000 పదివేల రూపాయలు క్వింటల్ బియ్యం అందజేశారు.

అనంతరం సంఘం నేతలు వార్డు మెంబరు మేక సుమలత రాజు, గంగరబోయిన నిరంజన్ లు సంయుక్తంగా మాట్లాడుతూ, కూలి పనికి వెళ్లి వచ్చి కట్టుకున్న భార్య లక్ష్మి తన కళ్ళ ముందు చనిపోతుంటే చూసి నిస్సహాయ స్థితిలో ఉన్న కొమురయ్య పరిస్థితి, కుటుంబ దయనీయ ఆర్థిక స్థితిని అర్థం చేసుకొని

పిఆర్ ముదిరాజ్ సేవా సమితి పెద్దలు సిద్దిపేట మాజీ కౌన్సిలర్ పెసరు రాజన్న
గ్రామ వాస్తవ్యులు కె ఎస్ ఆర్ అభ్యాస్ విద్యాసంస్థ చైర్మన్ నరహరి రాజేందర్ రెడ్డి కుల ప్రముఖులు, దాతల సహకారంతో బాధిత కుటుంబానికి సాయం చేయడం చాలా గర్వకారణమని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం వల్ల ముదిరాజ్ జాతి ఐక్యతకు దోహదపడతాయని, ముదిరాజు బిడ్డలు దానం చేసే స్థాయికి ఎదగాలని కోరారు.

ఈ కార్యక్రమంలో
పిఆర్ ముదిరాజ్ సేవా సమితి సేవకులు ముద్రబోయిన రమేష్
దండు రవి, మత్స్య సహకార సంఘం అధ్యక్షులు దండు నర్సయ్య, కార్యదర్శి దండు రాజు, డైరెక్టర్ మేక అనిల్, మేక సుమలత రాజు;
గౌరవ సలహాదారులు గాలిబు సంపత్, గంగరబోయిన నిరంజన్ వాడకట్టు కుల బంధువులు కుమ్మరికుంట్ల రాంబాబు, భూమ సంపత్, పొన్నం, కోమ్మయ్య, దండు రాజేందర్ , రాములు కుమ్మరికుంట్ల చంటి యువజన నాయకులు గంగరబోయిన నవీన్, దండు ఉదయ్ కిరణ్, సందీప్, దండు రమేష్, సాంబయ్య, దండు బాలయ్య, దండు చిరంజీవి ముదిరాజ్; బండారి లక్ష్మి కుటుంబ సభ్యులు కొమురయ్య, కూతురు ఎలా స్వాతి, సంధ్యరాణి, సిరి చందన, రిక్విత మణికుమార్ పాల్గొన్నారు.

2వ రోజుకు చేరిన రంగంపేట భద్రకాళి దేవస్థాన నిరసన

2వ, రోజుకు చేరిన రంగంపేట భద్రకాళి దేవస్థాన నిరసన కార్యక్రమం

హన్మకొండ, నేటిధాత్రి:

11వ, డివిజన్ పరిధిలోని భద్రకాళి దేవస్థానాన్ని అనుకోని ఉన్న చెరబండరాజు నగర్ గుడిసెల్లో గత 23 సంవత్సరాల క్రితం నుండి నివసిస్తున్న దళితులను నేడు భద్రకాళీ మాడ వీధుల నిర్మాణాల పేరట అన్యాయంగా ఎలాంటి ఆశ్రయం మరియు జీవన ఉపాధి కల్పించకుండా అధికార కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చి వేసే కుట్రలను తిప్పికొట్టాలని డిమాండ్ చేస్తూ
ఈరోజు బిఆర్ఎస్ పార్టీ 5వ,డివిజన్ అధ్యక్షులు బొల్లేపెల్లి పున్నం చందర్ ఆధ్వర్యంలో,
కాలని వాసులను కలుపుకొని, చెరబండరాజు నగర్ గుడిసెల్లో ఉన్న దళితుల ఆరాధ్య దైవమైన డా,,బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి, గుడిసె వాసులకు న్యాయం జరగాలని మాల మహానాడు కుల సంఘ నాయకుల మద్దతు కూడా ప్రకటించి అలాగే అన్ని దళిత వర్గాల ప్రజలు కదలి వచ్చి గుడిసె వాసులకు న్యాయం జరిగేంత వరకు అండగా నిలవాలని పిలుపునివ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నాయకులు
పండుగ సాగర్, మూల ప్రభాకర్, దాసరి సమ్మన్న, విశాల్, ప్రభాకర్ మరియు చెరబండరాజు నగర్ వాసులు మొదలైన పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version