అతివగం కారణంగా బోల్తా పడ్డ బోలోరో ఒకరికి గాయాలు…

అతివగం కారణంగా బోల్తా పడ్డ బోలోరో ఒకరికి గాయాలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ హైవే సంగారెడ్డి మెయిన్ రోడ్డులో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.అతివేగమే దీనికి కారణమని చెబుతున్నారు.స్కూటర్ నడుపుతున్న షాక్, బొలెరో కారును అధిగమించడానికి ప్రయత్నించాగా.బొలెరో కారు బోల్తా పడింది, ఒక ట్రాన్స్‌జెండర్ వ్యక్తికి గాయమైంది, అతని చేయి తెగిపోయింది.అతన్ని వెంటనే ఆసుపత్రిలో చేర్చారు.స్కూటర్ నడుపుతున్న వ్యక్తి పరారీలో ఉన్నట్లు సమాచారం.

ఓదెల మల్లికార్జున దేవస్థానంలో రోడ్డు భద్రత అవగాహన

ఓదెల మల్లికార్జున స్వామి దేవస్థానం లో రోడ్డు భద్రత అవగాహన సదస్సు నిర్వహించిన పోత్కపల్లి పోలీస్..

ఓదెల( పెద్దపల్లి జిల్లా) నేటి ధాత్రి

ఓదెల మండలం పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఓదెల మల్లన్న దేవాలయంలో పోత్కపల్లి పోలీస్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోత్కపల్లి పోలీస్ మాట్లాడుతూ,ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, కార్లలో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ ధరించాలి.రాంగ్ రూట్ లో డ్రైవింగ్ చేయకూడదు.ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ గా వాహనం నడపడం వలన రోడ్డు ప్రమాదాలు జరిగి మరణాలు మరణాలు సంభావిస్తాయి.ట్రాఫిక్ కి సంబంధించిన నియమ నిబంధనలు పాటించాలి.రోడ్డుకు అడ్డంగా అటు ఇటు కాకుండా పార్కింగ్ ఏరియాలో మాత్రమే వాహనాలు పార్కు చేయాలి.ఎప్పుడైనా రోడ్డు ప్రమాదం జరుగుతే డయల్ 112 కాల్ చేసి రోడ్డు ప్రమాదం సంబంధించిన సమాచారం ఇవ్వాలి.సిగ్నల్ జంప్ చేయడం వలన రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి.రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను సమీపంలోని ఆసుపత్రులకు వీలందనైనంత త్వరగా తరలించాలి అని సూచించారు.

నెక్కొండలో రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం

రోడ్ సేఫ్టీ పాటిస్తేనే ప్రమాదాల నివారణ

#నెక్కొండ, నేటి ధాత్రి:

 

రోడ్ సేఫ్టీ వార్షికోత్సవాల్లో భాగంగా నెక్కొండ మండలంలో వాహనదారులకు, ఆటో డ్రైవర్లకు,అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఏసీపీ పి. రవీందర్ రెడ్డి, నెక్కొండ సీ ఐ సన్నాయిల శ్రీనివాస్, ఎస్సై మహేందర్,మోటార్ వెహికల్ సబ్ ఇన్‌స్పెక్టర్ నరేందర్, నెక్కొండ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సమావేశానికి నెక్కొండ మండలానికి చెందిన ఆటో డ్రైవర్లు, జీప్ డ్రైవర్లు, స్కూల్ బస్సుల డ్రైవర్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏసీపీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలు మానవ తప్పిదాల వల్లే ఎక్కువగా జరుగుతున్నాయని, మద్యం సేవించి వాహనాలు నడపడం, ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్ వంటి అలవాట్లను పూర్తిగా విడిచిపెట్టాలని సూచించారు. ప్రతి వాహనదారుడు లైసెన్స్, వాహన బీమా తప్పనిసరిగా కలిగి ఉండాలని, అధిక ప్రయాణికులతో వాహనాలు నడపరాదని తెలిపారు.
రోడ్ సేఫ్టీని పాటించడం చట్టబద్ధమైన బాధ్యత మాత్రమే కాకుండా, మన కుటుంబాల భద్రతకు కూడా కీలకమని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ నియమాలను గౌరవిస్తేనే ప్రమాద రహిత సమాజం సాధ్యమని ఆయన పిలుపునిచ్చారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version