కాన్కూర్ లో టీజీ ఎఫ్ డీసీ ఆధ్వర్యంలో జల సంరక్షణ చర్యలు…

కాన్కూర్ లో టీజీ ఎఫ్ డీసీ ఆధ్వర్యంలో జల సంరక్షణ చర్యలు

జైపూర్, నేటి ధాత్రి :

 

జైపూర్ మండలంలోని కాన్కూర్ అటవీ ప్రాంతంలో తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ(టీజీ ఎఫ్ డీసీ ) ఆధ్వర్యంలో సోమవారం జల సంరక్షణ చర్యలు చేపట్టారు.టీజీ ఎఫ్ డీసీ కి చెందిన నీలగిరి ప్లాంటేషన్ మధ్యలో ఉన్న వాగులో రెండు చోట్ల నీటి ఊటలను గుర్తించి ఉపాధి హామీ కూలీల సహాయంతో నీరు నిల్వ ఉండే విధంగా పూడిక తొలగించి అడ్డుకట్టలు వేయడం జరిగింది.ఈ సందర్భంగా టీజీ ఎఫ్ డీసీ మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్ మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో, ప్లాంటేషన్ లలో ఈ వేసవిలో నీటి వృధాను అరికట్టి జల సంరక్షణ చర్యలు చేపడుతూ ఈ ప్రాంతంలో సంచరించే వన్యప్రాణుల దాహార్తిని తీర్చడానికి ఈ నీటి కుంటలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

రోడ్డు భద్రత పై అవగాహన సదస్సు

రోడ్డు భద్రత పై అవగాహన సదస్సు

జైపూర్, నేటిధాత్రి:

 

మైనర్‌లకు వాహనాలు ఇవ్వరాదు

సురక్షిత ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత…సీపీ అంబర్ కిషోర్ ఝా

జైపూర్ మండల కేంద్రంలోని దుబ్బ పల్లి ఫంక్షన్ హాల్ వద్ద రోడ్డు భద్రతపై డ్రైవర్లకు అవగాహన కల్పించి కంటి పరీక్షలు నిర్వహించారు.
రోడ్డు ప్రమాదాల నివారణ, వాహనదారులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవడం ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం,తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు చేపట్టిన“అరైవ్ అలైవ్ ఫేజ్-3” కార్యక్రమంలో భాగంగా సోమవారం జైపూర్ పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా,మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ,రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన“అరైవ్ అలైవ్”కార్యక్రమం ద్వారా ప్రజల్లో రోడ్డుభద్రతపై అవగాహన పెంపొందించడం లక్ష్యమని తెలిపారు.ప్రజా ప్రగతి ప్రణాళికలో భాగంగా ట్రాఫిక్ నియమాలపై అవగాహన సదస్సులు,కంటి వైద్య శిబిరాలు,ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి హాజరైన యువకులు, కార్మికులు,విద్యార్థులు రోడ్డు భద్రతపై తెలుసుకున్న విషయాలను తమ గ్రామాలు,కాలనీలు, స్నేహితులు,కుటుంబ సభ్యులకు,సహచరులకు తెలియజేసే దూతలుగా మారాలని సూచించారు.ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించేలా చైతన్యవంతం చేయడం సామాజిక బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.మద్యం సేవించి వాహనాలు నడపకూడదని,హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని స్పష్టం చేశారు.మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని హెచ్చరిస్తూ,వారి భవిష్యత్తు దృష్ట్యా తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.రాత్రి సమయంలో డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని,రోడ్డుపై నడిచే వారిని గమనిస్తూ వాహనాలు నడపాలని సూచించారు.కనీస జాగ్రత్తలు పాటిస్తే రోడ్డుప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు.ప్రతి ఒక్కరి సహకారంతో రామగుండం కమిషనరేట్‌ను ప్రమాదరహిత ప్రాంతంగా మార్చాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు,జైపూర్ సీఐ నవీన్,చెన్నూర్ టౌన్ సీఐ బన్సీలాల్,చెన్నూర్ రూరల్ సీఐ కృష్ణ,జైపూర్ ఎస్సై రాజశేఖర్,శ్రీరాంపూర్ ఎస్సై సంతోష్,భీమారం ఎస్సై రాజేందర్ పోలీస్ అధికారులు,సిబ్బంది,ప్రజలు యువత పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version