భద్రత నియమాలతో ప్రమాదాలకు అడ్డుకట్ట: ఎమ్మెల్యే మాధవరెడ్డి

భద్రత నియమాలు పాటిస్తే ప్రమాదాలు నివారించచ్చు

ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు భాగంగా విద్యార్థులతో ర్యాలీ.

నర్సంపేట,నేటిధాత్రి:

ప్రభుత్వం చేపట్టిన రోడ్డు భద్రత నియమాలు పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చునని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు.జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు భాగంగా డిస్ట్రిక్ట్ ట్రాన్ఫోర్ట్ ఆఫీసర్, జిల్లా రవాణా శాఖ అధికారి, శోభన్ బాబు ఆధ్వర్యంలో నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి సాహకారంతో బుధవారం నర్సంపేట పట్టణంలోని వరంగల్ కూడలి నుండి అంబేద్కర్ సెంటర్ వరకు రోడ్డు భద్రత ఫ్లకార్డులతో వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు.

ర్యాలీ ప్రారంభిస్తున్న డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ శోభన్ బాబు

ముందుగా ఈ ర్యాలీని డిస్ట్రిక్ట్ ట్రాన్ఫోర్ట్ ఆఫీసర్ శోభన్ బాబు స్థానిక సిఐ శ్రీనివాస్ తో కలిసి ప్రారంభం చేశారు.ఈ ర్యాలీ అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రోడ్డు భద్రతల పట్ల అధికారులు తెలుపుతున్న అవి పాటించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.ప్రభుత్వ భద్రత నియమాలు పాటిస్తే 90 నుండి 100 ప్రమాదాలు జరుగకుండా నివారించవచ్చునని పేర్కొన్నారు.నియోజకవర్గంలో అన్ని మండలాల్లో అన్ని రకాల వాహనదారులకు అవగాహన కల్పించదానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

రోడ్డు భద్రత నియమాల గురించి మాట్లాడుతున్న డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ శోభన్ బాబు

డిస్ట్రిక్ట్ ట్రాన్ఫోర్ట్ ఆఫీసర్ శోభన్ బాబు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరుగకుండా ఉండేందుకు గాను జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏసీపీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ వాహనాలు నడిపేటప్పుడు రోడ్డు భద్రత నియమాలు తప్పకుండా పాటించాలని చెప్పారు.హెల్మెంట్, ధృవీకరణ పత్రాలతో వాహనాలు నడపాలన్నారు.మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ , పిసిసి సభ్యుడు పెండెం రామానంద్, మాంటిస్సొరి స్కూల్ చైర్మన్ జగన్ మోహన్ రెడ్డి, మాథర్స్ ల్యాండ్ పాఠశాల ఛైర్మన్ పాశికంటి రమేష్,పలువురు అధికారులు,పోలీస్ శాఖ ఎస్సైలు,కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు,విద్యార్థులు పాల్గొన్నారు.

రోడ్డు భద్రత నియమావళి పాటించాలి…

రోడ్డు భద్రత నియమావళి పాటించాలి

జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.హెచ్ రమేష్ బాబు

భూపాలపల్లి నేటిధాత్రి

 

రోడ్డుపైన వాహనాలు నడుపుతున్నప్పుడు క్రమశిక్షణతో, బాధ్యతతో మెలగాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.హెచ్ రమేష్ బాబు తెలిపారు. న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం రోడ్డు భద్రత నేషనల్ యూత్ డే ని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని జయశంకర్ విగ్రహం నుండి అంబెడ్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రధాన న్యాయమూర్తిగారు ప్రసంగించారు. నిర్లక్ష్యంతో డ్రైవింగ్ చేస్తే కఠిన శిక్షలు పడతాయని అన్నారు. ముఖ్యంగా లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు వాటి ఓనర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. వెయ్యి మంది విద్యార్థులు రోడ్డు భద్రత అవగాహనలో పాలుపంచుకోవడం అభినందనీయమని జడ్జి ఆనందాన్ని వ్యక్తం చేసారు. భవిషత్తులో బాధ్యతాయుత పౌరులుగా తయారు కావాలని విద్యార్థులకు సూచించారు. రోడ్డు భద్రతకు సంబంధించి జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రతిజ్ఞ చేపించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఏ. నాగరాజ్ ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.ఆర్. దిలీప్ కుమార్ నాయక్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి అఖిల అడిషనల్ ఎస్.పి. నరేష్ కుమార్ గవర్నమెంట్ ప్లీడర్ బోట్ల సుధాకర్ అడ్వొకేట్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు వి. శ్రీనివాస చారి ప్రధాన కార్యదర్శి వి. శ్రావణ్ రావు చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ పి.శ్రీనివాస్ డి.ఎస్.పి. సంపత్ రావు ఆర్.టి.ఓ. సందాని డి.ఈ.ఓ. రాజేందర్ సి ఐ నరేష్ కుమార్, ఎస్.ఐ. సాంబమూర్తి వెయ్యి మంది విద్యార్థులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version