ఒక్కో వార్డు నా బాధ్యతే : మాజీ మంత్రి, ఎంఎల్ఏ మల్లారెడ్డి…

ఒక్కో వార్డు నా బాధ్యతే : మాజీ మంత్రి, ఎంఎల్ఏ మల్లారెడ్డి
* మునిసిపల్ బిఆర్ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశం

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

 

మునిసిపల్ ఎన్నికలో గెలుపే లక్ష్యం ఒక్కో వార్డు నా బాధ్యతని మాజీ మంత్రి, ఎంఎల్ఏ చామకూర మల్లారెడ్డి అన్నారు. మునిసిపల్ ఎన్నికల సందర్బంగా బిఆర్ఎస్ మునిసిపల్ అధ్యక్షులు సరసం మోహన్ రెడ్డి, మల్లేష్ గౌడ్ ల ఆధ్వర్యంలో సోమవారం అలియాబాద్, మూడుచింతలపల్లి మునిసిపల్ ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మల్లారెడ్డి మాట్లాడుతూ గెలుపే లక్షంగా ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు. కాంగ్రెస్ రెండు ఏండ్లు పాలన గడిచిన అంతా ఆగమే ఉందన్నారు. ఆగమైన ఆరు గ్యారంటీకాని ప్రజల్లో ప్రశ్నించి చైతన్యపరచలన్నారు.

ఓటర్లను అక్కర్శించే పనులతో ప్రజల్లోకి వెళ్ళాలని, 13న ఊర్లలో ముగ్గుల పోటీలు, 16న క్రికెట్ మ్యాచ్ లు చేపట్టాలనసూచించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి జహంగీర్, డీసీఎంఎస్ మాజీ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశం, ఏఎంసి వైస్ చైర్మన్ లు నాగరాజు, శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎంపీపీలు పల్లె సితారములు గౌడ్, ఎల్లుభాయి, మాజీ జడ్పీటీసీ అనిత, సొసైటీ వైస్ చైర్మన్ ఐలయ్య యాదవ్, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ డైరెక్టర్లు, బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

హన్మంత్ రావు పాటిల్‌కు కాంగ్రెస్ నాయకుల సన్మానం

హన్మంత్ రావు పాటిల్ గారిని ను మర్యాద పూర్వకంగా కలిసి

◆:…సన్మానించిన కాంగ్రెస్ నాయకులు రాయికోటి నర్సిములు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ హన్మంత్ రావు పాటిల్, యువ నాయకులు ఉదయ్ శంకర్ పాటిల్ గార్లను కలసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయికోటి నర్సిములు… ఝరాసంగం లోని హన్మంత్ రావు పాటిల్ గెస్ట్ హౌజ్ లో మర్యాద పూర్వకంగా కలసి సన్మానం చేశారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో కలిసిన సందర్బంగా ఈ సన్మానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా హన్మంత్ రావు పాటిల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తోనే పలు అభివృద్ధి పనులు సాధ్యం అన్నారు. ఈ కార్యక్రమం లో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నరేష్ గౌడ్, కొల్లూర్ సర్పంచ్ చింతల్ గట్టు శివరాజ్ కాంగ్రెస్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి, డప్పుర్ సంగమేష్, శ్రీకాంత్ రెడ్డి, జాన్ శ్రీకాంత్,అంబేద్కర్, డప్పూర్ హరి తదితరులు ఉన్నారు..

ఎన్నికల సమావేశంలో పాల్గొన్న ఏఐఎంఐఎం నాయకులు…

ఎన్నికల సమావేశంలో పాల్గొన్న ఏఐఎంఐఎం నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఏఐఎంఐఎం జాతీయ అధ్యక్షుడు మరియు హైదరాబాద్ ఎంపీ బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ మరియు మన సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ కార్వాన్ ఎమ్మెల్యే జనాబ్ కౌసర్ మొహియుద్దీన్ సూచనల మేరకు, ఈరోజు మునిసిపల్ జహీరాబాద్‌లో కమిషనర్ ఎంసీజెడ్ తహశీల్దార్ జహీరాబాద్‌తో జరిగిన ఎన్నికల సమావేశంలో ఏఐఎంఐఎం జహీరాబాద్ అధ్యక్షుడు మహ్మద్ అథర్ అహ్మద్, జిల్లా ప్రధాన కార్యదర్శి మొహియుద్దీన్ ఘౌరి సహబ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అజ్మత్ పాషా మరియు పార్టీ క్యాడర్‌తో కలిసి పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version