బిఆర్ఎస్లో 20 మంది కాంగ్రెస్ నేతల చేరిక
కండువా కప్పి ఆహ్వానించి ఎంఎల్ఏ మల్లారెడ్డి
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :
మూడు మున్సిపాలిటీ లపై బిఆర్ఎస్జెండా ఎగరావేస్తామని మాజీ మంత్రి, ఎంఎల్ఏ చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ నియోజకవర్గం అలియాబాద్ మున్సిపాలిటీ కి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బండి లక్ష్మి, బండి రామ్ రెడ్డి, బండి శ్రీకర్ రెడ్డి లతో పాటు 20మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శుక్రవారం బిఆర్ఎస్ పార్టీ లో చేరగా గులాబీ కండువా వేసి పార్టీ లోకి ఆహ్వానించారు. అనంతరం అలియాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా
రోడ్ షో లో పాల్గోని బిఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులను ఓటు వేసి గెలిపించాలని కోరారు.
