ప్రజల కష్టాలు తీర్చిన పార్టీ బిఆర్ఎస్ : మాజీ మంత్రి, మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి
* అలియాబాద్ లో రోడ్ షో
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :
పేదల కష్టాలు తెలిసిన నేత కెసిఆర్, కష్టాలు తీర్చిన పార్టీ బిఆర్ఎస్ అని మాజీ మంత్రి, మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మేడ్చల్ నియోజకవర్గం అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ని అలియాబాద్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరఫున మల్కాజ్గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డితో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. భారీ ఎత్తున్న రోడ్ షో, కార్నర్ మీటింగ్ నిర్వహించి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు తంటం నర్సింహా, బండి లక్ష్మీ రాంరెడ్డి, తూమ్ యమున శ్యామ్, మధుసూదనరెడ్ది, సగ్గు శ్రీనివాస్ యాదవ్, గుర్క కుమార్ యాదవ్ లకు ఓటు వేసి గెలిపించలని కోరారు.
