ప్రశాంతంగా మున్సిపాలిటీ ఎన్నికలు..

ప్రశాంతంగా మున్సిపాలిటీ ఎన్నికలు

* ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

మేడ్చల్ జిల్లాలోని మూడు మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. మూడు మున్సిపాలిటీలోని రెండు చోట్ల మినహా ఇతర అన్నిచోట్ల పోలింగ్ సక్రమంగా జరిగింది. మొదట మందకోడిగా సాగిన పోలింగ్ ఆ తర్వాత పొంచుకుంది. 7:00 నుంచి 9 గంటల వరకు రెండు గంటల వ్యవధిలో 15% లోపు పోలింగ్ ఆ తర్వాత 11, ఒంటిగంట వరకు పోలింగ్ శాతం అంతకంతకు పెరుగుతూ వచ్చింది. ఒకటి గంటల వరకు మూడు మున్సిపాలిటీలో 50 శాతానికి మించి పోలింగ్ జరిగింది. గట్టి పోలీస్ బందోబస్తు మధ్య ఎన్నికలు జరిగాయి. పోలింగ్ కు మూడు రోజుల కిందట అలియాబాద్ మున్సిపాలిటీ లాల్ గడి మలక్పేట్ లో కాంగ్రెస్, బిఆర్ఎస్ల మధ్య జరిగిన గొడవతో బందోబస్తును మరింత పెంచారు. సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించిన అద్రాస్ పల్లి, కొల్తూరు గ్రామాల్లో బందోబస్తును మరింత పెంచారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ లాల్ గడి మలక్పేట్ ను సందర్శించి, బందోబస్తును పర్యవేక్షించారు.

కాగా జిల్లా కలెక్టర్ మన చౌదరి, ఎన్నికల పరిశీల కురాలు విజయ కాంతి వెస్లీ తో కలిసి మూడు మున్సిపాలిటీల్లో ని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి, ఓటింగ్ నిర్వాహణ, ఓటర్లకు కల్పిస్తున్న సౌకర్యాలను పర్యవేక్షించారు. ఎన్నికల అధికారులకు పలు సూచనలు చేశారు. అడిషనల్ డిసిపి పురుషోత్తం, ఏసీపీ లు శ్రీనివాస్ రెడ్డి, బాలగంగి రెడ్డి, మేడ్చల్ జిల్లాలో జరుగుతున్న మునిసిపల్ ఎన్నికలను పరిశీలించారు. కేశవరం, కొల్తూరు, మూడు చింతలపల్లి, ఉద్దమర్రి గ్రామాలను సందర్శించి, భద్రత ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ఇది ఇలా ఉంటే అలియాబాద్ మున్సిపాలిటీ ఐదో వార్డులో బిజెపి అభ్యర్థి నకిలీ వెండి నాణేలను ఓటర్లకు అందజేసినట్టు ఆరోపణలు వచ్చాయి. విషయాన్ని గుర్తించిన ఓటరు సదరు అభ్యర్థిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే రావల్కోల్ లో ఓటు వేయడానికి వచ్చిన వారిపై డి ఐ కిరణ్ శాంతి భద్రతల విధుల్లో భాగంగా లాటీ ఛార్జ్ చేశారు. దీనీ పై సిపిఎం నేత నరేష్ తో పాటు ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసే సరికి ఎల్లంపేట్ మునిసిపల్ 83.28 %, అలియాబాద్ మునిసిపల్ 79.62 % మూడుచింతలపల్లి మునిసిపల్ 89.06 శాతం పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు.

మునిసిపల్ ఎన్నికల్లో మేడ్చల్ జిల్లాలో బిఆర్ఎస్ జోరు

మునిసిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ జోరు

* రోడ్డు షోల్లో పాల్గొన్న మాజీ మంత్రి, ఎంఎల్ఏ మల్లారెడ్డి

* బిఆర్ఎస్ లో పలువురికి చేరిక

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

మునిసిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థులు దూసుకు పోతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మేడ్చల్ నియోజకవర్గం ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని బండ మాదారం, శ్రీరంగవరం, నూతనకల్ గ్రామాలలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరఫున భారీ ఎత్తున్న రోడ్ షో లు నిర్వహించి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఓటు వేసి గెలిపించలని కోరారు. ఈ సందర్బంగా మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదం తో ఎన్నికల్లో బిఆర్ఎస్ జెండాను ఎగరావేయాలన్నారు. ఈ కార్యక్రమలలో మేడ్చల్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మహేందర్ రెడ్డి, ఎల్లంపేట్ మున్సిపాలిటీ ఎన్నికల ఇంచార్జ్ వెంకట్ రెడ్డి, మాజీ గ్రంధాలయ చైర్మన్ భాస్కర్ యాదవ్, అభ్యర్థులు పాల్గొన్నారు.

బిఆర్ఎస్ లో కాంగ్రెస్, బీజేపీ నేతల చేరికలు..

మేడ్చల్ నియోజకవర్గం ముడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అద్రాస్ పల్లి లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్లం వెంకటేష్, ఎల్లం దేవి రమేష్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సుమారు 30 మంది, కొల్తురు కు చెందిన మహేష్ లకు బిఆర్ఎస్ కండువా వేసి పార్టీ లోకి ఆహ్వానించారు. బిఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు ఆది అజయ్, నాగరాజు గార్లకు ఓటు వేసి గెలిపించాలని కోరడమైనది. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ గజ్జెల నాగేష్, బిఆర్ఎస్ పార్టీ యువనాయకులు డా భద్ర రెడ్డి, మద్దుల శ్రీనివాస్ రెడ్డి, మధుకర్ రెడ్డి, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ వెంకటేష్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, ఏఎంసి మాజీ వైస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, రమేష్, చిరంజీవి బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలియాబాద్ వార్డు నెంబర్–17కు చెందిన బీజేపీ నాయకుడు తాడేం కుమార్ బిఆర్ఎస్ లో చేరగా అలియాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజ్‌గిరి శాసనసభ్యులు, అలియాబాద్ మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ముద్దం మధుసూదన్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి అనిత లాలయ్య, వంగ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version