కోహీర్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన నాయకులు…

కోహీర్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్, మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు, సీనియర్ నాయకులు కలిమ్, యువ నాయకులు మిథున్ రాజ్ కోహీర్ పట్టణం లోని వివిధ వార్డ్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చైర్మన్ నాయకులు మాట్లాడుతూ ,ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను ఆరు గ్యారంటీలు ఎక్కడ అని నిలదీయాలన్నారు, బి ఆర్ ఎస్ హయాంలో చేసిన పనులకు రంగులు వేసి మేమే చేసాము అని గొప్పలు చెప్పుకుంటున్నారు,ప్రజల ఆశీస్సులతో కోహీర్ గడ్డ పై గులాబీ జెండా ఎగరడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులు,నాయకులు ,కార్యకర్తలు ,తదితరులు పాల్గొన్నారు..

బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి…

బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి

* అద్రాస్ పల్లి లో గడపగడప ప్రచారంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటి ధాత్రి :

 

నీళ్లు రావాలన్న నిధులు కావాలన్నా కేవలం టిఆర్ఎస్ తోటే సాధ్యమని మాజీ మంత్రి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మేడ్చల్ నియోజకవర్గం ముడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ని అద్రాస్ పల్లి లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అజయ్ కుమార్, నాగరాజు ల తరఫున గడప గడప ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రజలను కష్టాలపాలు చేస్తున్న కాంగ్రెస్ కు అవకాశం కల్పించొద్దన్నారు. ప్రజల కష్టాలు తెలిసి కన్నీళ్లు తీర్చిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ అని నేడు కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో 60 ఏండ్లు వెనకకు ప్పోయమన్నారు. మరిచిపోయి కూడా కాంగ్రెస్ కు ఓటు వేయొద్దన్నారు. గడప గడప ప్రచారంలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఆది అజయ్, నాగరాజు లకు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించలని కోరారు. ఈ కార్యక్రమలలో ఇంచార్జ్ గజ్జెల నాగేష్, యువనాయకులు డాక్టర్ భద్ర రెడ్డి, నాయకులు ఆది రమేష్, నర్సింలు, వెంకటేష్, చిరంజీవి, మల్లేష్, కార్యకర్తలు పాల్గొన్నారు.

మూడు చింతలపల్లి పై బిఆర్ఎస్ జెండా ఎగర వేస్తాం..

మూడు చింతలపల్లి పై బిఆర్ఎస్ జెండా ఎగర వేస్తాం : మాజీ మంత్రి, మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి

* జగన్ గూడా, ఉద్దమర్రి లో ఎన్నికల ప్రచారం

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

మూడు చింతలపల్లి మున్సిపల్ కోట పై బిఆర్ఎస్ జెండా మాజీమంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మేడ్చల్ నియోజకవర్గం ముడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సంపన్ బోల్, జగన్ గూడ, ఉద్దమర్రి గ్రామాలలో బుధవారం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారంలో పాల్గొన్నారు. భారీ ఎత్తున్న రోడ్ షో నిర్వహించి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఓటు వేసి గెలిపించలని కోరారు. ఉద్దేమర్రి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీ లో చేరగా కండువా కప్పి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమలలో ఇంచార్జ్ గజ్జెల నాగేష్, యువనాయకులు డాక్టర్ భద్ర రెడ్డి, మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మల్లేష్ గౌడ్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి అనిల్ రెడ్డి, రవీందర్ రెడ్డి, నవీన్, బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version