ఆశ్రమ పాఠశాల విద్యార్థినిల సమస్యలు వెంటనే పరిష్కరించాలీ.

ఆశ్రమ పాఠశాల విద్యార్థినిల సమస్యలు వెంటనే పరిష్కరించాలీ.

ప్రస్తుతం ఉన్న హాస్టల్ వార్డెన్ సమ్మయ్య నీ వెంటనే సస్పెండ్ చేయాలి.

లేడి వార్డెన్ ను వెంటనే నియమించాలి.

కుమ్మరి రాజ్ కుమార్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గర్ల్స్ ఆశ్రమ పాఠశాల విద్యార్థుల సమస్యలు తెలుసుకుందామని వెళ్లిన ఎస్ఎఫ్ఐ నాయకత్వాన్ని అడ్డుకున్న హాస్టల్ వార్డెన్ ను తక్షణమే సస్పెండ్ చేయాలని హాస్టల్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజు మాట్లాడుతూ విద్యార్థినిలు గత నాలుగు రోజుల నుంచి అనేకమైన సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి హాస్టల్లో ఉంది అందులో పని చేసే వర్కర్స్ వారి యొక్క డిమాండ్లను పరిష్కరించాలని వారు సమ్మెలోకి దిగడం జరిగింది. దీనిద్వారా హాస్టల్లో చదువుకునే విద్యార్థినిలకు అనేకమైన సమస్యలు భోజనం వండుకోవడం లాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. తక్షణమే హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని దాంతోపాటు వర్కర్స్ యొక్క న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ వారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ విద్యార్థినిల సమస్యలు కూడా పరిష్కరించాలని డిమాండ్ చేయడం జరిగింది. గర్ల్స్ హాస్టల్ అయినప్పటికీ ఆ హాస్టల్ కి లేడి వార్డెన్ లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ సమస్యను ఎన్నిసార్లు అధికారులకు దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకునే పరిస్థితి లేదు తక్షణమే ప్రస్తుతం ఉన్న వార్డెన్ సమ్మయ్య సార్ నీ సస్పెండ్ చేసి లేడీ వార్డెన్ ను వెంటనే నియమించాలిఅని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ భూపాలపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది

కోరికిశాల కస్తూర్బా పాఠశాలను సందర్శించిన…

కోరికిశాల కస్తూర్బా పాఠశాలను సందర్శించిన ఏఐఎస్ఎఫ్ బృందం

ఎస్ఓ ను తక్షణమే సస్పెండ్ చేయాలి
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోత్కు ప్రవీణ్ కుమార్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
మొగులపల్లి మండల కేంద్రంలోని కొరికిశాల కస్తూర్బా పాఠశాలను ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్తుకు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఎస్ఓ, వర్కర్ల నిర్లక్ష్యం వల్లనే విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యి అస్వస్థకు గురై ఆసుపత్రి పాలయ్యారని తెలిపారు.
గతంలో విద్యార్థులు పలుసార్లు భోజనం బాగాలేదని, అన్నంలో పురుగులు వస్తున్నాయని ఎస్ఓ దృష్టికి తీసుకువచ్చిన ఏం మాత్రం పట్టించుకోకపోవడం వల్లనే ఈ ఘటన జరిగిందని తెలిపారు మరలా ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు తక్షణమే బాధ్యత వహించి అన్ని కస్తూర్బా పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టలను ఎమ్మెల్యే, కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారులు పర్యటించాలని కోరారు.
కస్తూర్బా పాఠశాల విద్యార్థులను అడిగి వారి సమస్యలు తెలుసుకోవడం జరిగింది అని అన్నారు. వారి సమస్యలపై పోరాటాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నేరెళ్ల జోసెఫ్, జిల్లా అధ్యక్షులు రేణికుంట్ల ప్రవీణ్ దొంతర బోయిన అజయ్ రాజేష్ పవన్ రత్న రమాకాంత్ కన్నురి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version