ఎస్సీ సంక్షేమ సంఘం మహిళా కార్పొరేషన్ ఎన్నిక…

ఎస్సీ సంక్షేమ సంఘం మహిళా కార్పొరేషన్ ఎన్నిక

జిల్లా అధ్యక్షురాలుగా కన్నూరి మహేశ్వరి నియామకం

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

ఎస్సీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్రం మహిళా విభాగం మంచిర్యాల కార్పొరేషన్ అధ్యక్షురాలుగా కన్నూరి మహేశ్వరి ని ఏకగ్రీవంగా ఎన్నుకొని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.నర్సింగ్ మంగళవారం నియామక పత్రాన్ని అందించారు.మహిళ నాయకుల ముఖ్య సమావేశాన్ని శ్రీరాంపూర్ లో ఏర్పాటు చేసి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కాల్వ సురేష్ అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె. నర్సింగ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో దళితులపైన జరుగుతున్న కుల గృహంకార దారులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుకట్ట వేయాలని దాడులు చేస్తున్న వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.కేంద్రంలోని నరేంద్ర మోడీ మతోన్మాద బిజెపి ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని మార్చే కుట్రలో భాగంగా మతకల్లాలతో మరణ హోమం సృష్టిస్తుందని ఇందులో సామాన్య ప్రజలను బలి చేస్తున్నారని అన్నారు. ఇలాంటి నీచపు ఆలోచనలు మానుకోవాలి అని ఎవరు ఎన్ని కుట్రలు చేసినా రాజ్యాంగాన్ని మార్చలేరని మార్చే ప్రయత్నాలను ఎప్పటికప్పుడు అంబేద్కర్ వాదులుగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. అదేవిధంగా సంఘ నిర్మాణం కోసం దిశ నిర్దేశం చేసి సంఘ బలోపేతం చేయాలని మహనీయులను ముఖ్యంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్,సావిత్రిబాయి ఫూలే లను ఆదర్శంగా తీసుకొని సంఘం బలోపేతానికి నిరంతర కృషి చేయాలని తెలిపారు.అలాగే శ్రీరాంపూర్ ఏరియా మహిళా విభాగం అధ్యక్షురాలుగా మాలం నీలమ్మ, ప్రధాన కార్యదర్శి రౌతు లక్ష్మి, శ్రీరాంపూర్ వాటర్ ట్యాంక్ ఏరియా అధ్యక్షురాలుగా నిమ్మ లక్ష్మి, ఉపాధ్యక్షురాలుగా బేతు విజయలక్ష్మిని ఎన్నుకోవడంజరిగింది.ఈ కార్యక్రమంలో మంచిర్యాల కార్పొరేషన్ అధ్యక్షులు జక్క మొగిలి,నస్పూర్ జోన్ ప్రధాన కార్యదర్శి విజయ్,అరుణక్కనగర్ ప్రధాన కార్యదర్శి శంకర్,మంచిర్యాల కార్పొరేషన్ నాయకులు ఓదెలు,కొమురయ్య,వెంకన్న, రాయమల్లు,మహిళా నాయకురాలు మహేశ్వరి,లక్ష్మి,నీలమ్మ, లక్ష్మీ,సువర్ణ, జ్యోతి,విజయలక్ష్మి,సుభద్ర తదితరులు పాల్గొన్నారు.

దేశ రెండవ రాజధానిగా హైదరాబాదును ఏర్పాటు చేయాలి..

దేశ రెండవ రాజధానిగా హైదరాబాదును ఏర్పాటు చేయాలి

ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.నర్సింగ్

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

దేశ రెండవ రాజధానిగా హైదరాబాద్ ను ఏర్పాటు చేయాలని ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.నర్సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు.ఎస్సీ సంక్షేమ సంఘం మంచిర్యాల కార్పొరేషన్ ముఖ్య నాయకుల సమావేశం శ్రీరాంపూర్ లోని ఆర్కే సిక్స్ ఎయిమ్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నిర్వహించారు.ఈ సమావేశానికి మంచిర్యాల నియోజకవర్గం అధ్యక్షులు గుమ్మడి శ్రీనివాస్ అధ్యక్షత వహించగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపల్లి నర్సింగ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా నర్సింగ్ మాట్లాడుతూ.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను సాధించడం కోసం సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ నిరంతరం కృషి చేయాలని కోరారు.మహానీయుల సిద్ధాంతాలను పోరాటపటివను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని,భూ భౌగోళికంగా అన్ని సౌకర్యాలు కలిగిన హైదరాబాద్ ను రెండవ రాజధానిగా ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.త్యాగానికి నిలువెత్తు నిదర్శనం భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రను పార్టీ పుస్తకాలలో చేర్చి ఎస్సీ సంక్షేమం కోసం ప్రత్యేక ఎస్సీ కార్పొరేషన్ బోర్డు ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.నిరుద్యోగులైన యువతి,యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం చిన్న తరహా పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవడం కొరకు శిక్షణ ఇచ్చి ఎలాంటి షరతులు లేకుండా బ్యాంకు లోన్ ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎస్సీల సంక్షేమ కోసం సంక్షేమ భవనం కొరకు స్థలం ఏర్పాటు చేయాలన్నారు.ఎమ్మెల్యేల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వారి సమస్యలను తీసుకెళ్తూ సమస్యలు పరిష్కారం అయ్యేలా నియోజవర్గంలోని గ్రామ కమిటీలు,మండల కమిటీలు త్వరగా పూర్తిచేసి జిల్లా కమిటీని పటిష్టం చేస్తామని తెలిపారు.

సంఘం యొక్క తీర్మానాలు

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేక రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, సౌకర్యాలను ఏర్పాటు చేయాలని అన్నారు.ప్రభుత్వ హాస్టల్ పాఠశాల విద్యార్థులకు పెడుతున్న మధ్యాహ్న భోజనం నాణ్యతను పాటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తదితర అంశాల పైన తీర్మానం చేశారు. సంఘం యొక్క తీర్మానాలను సభ్యులందరి ఆమోదంతో జిల్లా యూత్ అధ్యక్షులు బింగి సదానందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.అలాగే మంచిర్యాల కార్పొరేషన్ అధ్యక్షులుగా శ్రీరాంపూర్ హిమాయత్ నగర్ ప్రాంతానికి చెందిన జక్కే మొగిలి ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో నస్పూర్ మున్సిపాలిటీ ఏరియా అధ్యక్షులు పార్లపెల్లి సారయ్య,శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షులు పుట్ట రవి, మద్దెల స్వామి దొంత మురళి, వార్డ్ ఇన్చార్జి కౌటం కృష్ణ, నూకల రాజయ్య, అరుణక్కనగర్ ఏరియా ప్రధాన కార్యదర్శి భోగ శంకర్, నాయకులు బవండ్లపల్లి నరసయ్య,సొల్లు కొమరయ్య, జక్కే మొగిలి,చేవుల వాసు, బేతే రాజశేఖర్,కనుమల్ల అనిల్ కుమార్,వేముల మల్లమ్మ,కావటం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version