సీకేఎం డిగ్రీ కళాశాల ఎఫ్ఎసి ప్రిన్సిపాల్.!

సీకేఎం డిగ్రీ కళాశాల ఎఫ్ఎసి ప్రిన్సిపాల్ గా డాక్టర్ ఏ.ధర్మారెడ్డి. 

వరంగల్, నేటిధాత్రి

 

 

దేశాయిపేటలోని సికేఎం ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల ఎఫ్ఎసి (ఫుల్ అడిషనల్ ఛార్జీ) ప్రిన్సిపాల్ గా డాక్టర్ ఏ. ధర్మారెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. మార్చ్ 31వ తేదీన సికేఎం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా డాక్టర్ జి .శశిధర్ రావు పదవి విరమణ పొందడంతో ఆ స్థానంలో కళాశాలలో కెమిస్ట్రీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ ఏ ధర్మారెడ్డికి ఇంచార్జ్ ప్రిన్సిపాల్ గా వ్యవహరించారు. అనంతరం కళాశాల విద్య కమిషనర్ ఉత్తర్వుల ఆదేశానుసారం తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు సీకేఎం డిగ్రీ కళాశాలకు ఫుల్ అడిషనల్ చార్జ్ ప్రిన్సిపాల్ గా వ్యవహరించాలని కమిషనర్ ఆఫ్ ఎడ్యుకేషన్ దేవసేన ఐఏఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు మంగళవారం డాక్టర్ ఏ .ధర్మారెడ్డి ఎఫ్ ఎ సి ప్రిన్సిపాల్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది డాక్టర్ ధర్మారెడ్డికి పుష్పగుచ్చాలు అందించి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తనను ఎఫ్ఎసి ప్రిన్సిపాల్ గా నియమించినందుకు సిసిఈ ఉన్నతాధికారులకు, సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిసిఈ సూపరిండెంట్ కృష్ణారెడ్డి, సీనియర్ అసిస్టెంట్ భరత్ చారి, కళాశాల పూర్వ ప్రిన్సిపాల్ డాక్టర్ జీ. శశిధర్ రావు, అధ్యాపకులు డాక్టర్ కే ఎల్ వి. వరప్రసాదరావు, కెప్టెన్ డాక్టర్ పి. సతీష్ కుమార్, లైబ్రరియన్ ఎస్ .అనిల్ కుమార్, సూపరిండెంట్ జి .శ్రీనివాస్, గెస్ట్ అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

చర్లపల్లి పాఠశాల మరో జలియన్వాలాబాగ్.

చర్లపల్లి పాఠశాల మరో జలియన్వాలాబాగ్

నడికూడ,నేటిధాత్రి:

 

 

మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో జలియన్వాలా బాగ్ సంఘటనను పురస్కరించుకొని ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ ఆధ్వర్యంలో ఆ సంఘటనను కనులకు కట్టినట్లుగా విద్యార్థుల ద్వారా నాటకీకరణ చేయించడం విద్యార్థులను, ఉపాధ్యాయులను ప్రజలను ఆకట్టుకున్నది. జలియన్వాలా బాగ్ ప్రదేశంలో మరణించిన భారతీయుల స్తూపానికి విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ నివాళులర్పించారు.అనంతరం అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ 1919 ఏప్రిల్ 13 న భారత నేల రక్తంతో తడిసిన రోజు అని, దుర్మార్గపు చట్టాన్ని వ్యతిరేకించినందుకు బ్రిటీష్ వారు ఆడిన రక్తపు క్రీడ అని, బ్రిటీషు ప్రభుత్వం ఆమోదించిన “రౌలత్ చట్టం” ప్రకారం పోలీసులు ప్రజలను అనుమానితుల పేరుతో ఎటువంటి విచారణ లేకుండా, రెండు సంవత్సరాలపాటు నిర్భందించవచ్చఅని, ఈ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమించిన సైపుద్దిన్ క్లిచ్, సత్యపాల్ సింగ్లను ప్రభుత్వం అరెస్ట్ చేసింది. వీరి అరెస్ట్ కు వ్యతిరేకంగా ప్రజలు అమృత్సర్ లోని జలియన్ వాలాబాగ్ లో సమావేశం అయ్యారు అని
ఈ సమావేశంలో హన్స్ రాజ్ అనేవ్యక్తి ప్రసంగిస్తున్నప్పుడు, అప్పటి సైనిక అధికారి జనరల్ డయ్యర్ ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే, నిరాయుధులైన ప్రజలపై 1650 రౌండ్ల కాల్పులు పది నిమిషాల పాటు,379 మరణాలు, రెండువేల మందిని గాయపరిచారు,అనేక మంది ప్రజలు ప్రాణాలు కాపాడుకొనుటకు అక్కడి బావిలో దూకారనీ,తుటాలు తగలి చాలామంది చనిపోయారు అని అన్నారు.ఈ సంఘటనలో వందలమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనయే భారతదేశ చరిత్రలో జలియన్ వాలాబాగ్ దురాగతంగా నిలిచిపోయిందనీ అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మేకల సత్యపాల్,
ఐ ఈ ఆర్ టి రమేష్ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

వైద్య రంగంలో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్

వైద్య రంగంలో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ గా మార్చాము
– బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన కాలంలో తెలంగాణలో మెడికల్ విద్య, ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత
– కరీంనగర్ చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజ్ లో జరిగిన 2019 ఎంబీబీఎస్ విద్యార్థుల స్నాతకోత్సవంలో పాల్గొన్న కేటీఆర్

సిరిసిల్ల, ఏప్రిల్ 

ప్రతి జిల్లాలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ ఉన్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన కాలంలో తెలంగాణలో మెడికల్ విద్య, ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. కరీంనగర్ చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజ్ లో జరిగిన 2019 ఎంబీబీఎస్ విద్యార్థుల స్నాతకోత్సవంలో పాల్గొన్న కేటీఆర్, పేషంట్లతో డాక్టర్లు సరిగా మాట్లాడితే సగం జబ్బు నయమవుతుందన్నారు.

education

ఈ సందర్భంగా మాజీ మంత్రి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ
2019 బ్యాచ్ ఎంబిబిఎస్ స్టూడెంట్స్ కు డాక్టర్లుగా మారబోతున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు.
నా చిన్నతనంలో మా అమ్మ కూడా నేను డాక్టర్ కావాలని కోరుకుందని అన్నారు.
వ్యక్తిగత జీవితం, ప్రాధాన్యతలను కూడా పక్కన పెట్టి ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా డాక్టర్లు పనిచేయాల్సి ఉంటుందని కెసిఆర్ నాకు చెప్పారు.
డాక్టర్లు పేషంట్లతో సరిగా మాట్లాడితే 50 శాతం జబ్బు నయమవుతుంది. ఇది ఒక సైకలాజికల్ ఎఫెక్ట్ అని అన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ రూపంలో డాక్టర్లకు రాబోయే రోజుల్లో పెద్ద చాలెంజ్ ఎదురు కాబోతుందని అన్నారు.
చాట్ జిపిటి , గ్రోక్ లు ప్రిస్కిప్షన్ లు కూడా రాస్తున్నాయని అన్నారు.
ఏఐ ఇచ్చే సమాచారం ఆధారంతో చాలా మంది పేషెంట్లు డాక్టర్ల దగ్గరకు వస్తున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అన్నారు.
ఇలాంటి పేషెంట్లను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుందని అన్నారు.
కరుణ, సానుభూతితో రోగులకు డాక్టర్లు సేవ చేయాలని అన్నారు.
బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన కాలంలో తెలంగాణలో మెడికల్ విద్య, ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామని అన్నారు.
ప్రతి జిల్లాలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ ఉన్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటేనని అన్నారు.
హెల్త్ కేర్ రంగంలో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ గా మార్చామని అన్నారు.
వైద్యరంగంలో తెలంగాణ సాధించబోయే ప్రగతిలో మీరందరూ భాగస్వాములు కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాని అన్నారు.

డ్రాయింగ్ ఒలంపియాడ్ స్టేట్ లో గోల్డ్ మోడల్ సాధించిన.

ఇంటర్నేషనల్ డ్రాయింగ్ ఒలంపియాడ్ స్టేట్ లో గోల్డ్ మోడల్ సాధించిన గీతాన్విత..

రామాయంపేట ఏప్రిల్ 12 నేటి ధాత్రి (మెదక్)

 

 

రామాయంపేట పట్టణానికి చెందిన చింతల ఉష శ్రీనివాస్ దంపతుల కూతురు గీతాన్విత రామాయంపేట పట్టణంలోని వివేకనంద విద్యాలయం లో 5వ తరగతి చదువుతున్నది.

Student

ఇంటర్నేషనల్ డ్రాయింగ్ ఒలంపియాడ్ పోటీలు నిర్వహించారు. రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకు సాధించడం జరిగింది. ఉత్తమ ఫలితాలు సాధించి రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకు సాధించినందుకు గోల్డ్ మెడల్ అందజేయడం జరిగింది.

Student

 

రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించిన విద్యార్థిని గీతాన్వితను పాఠశాల ఉపాధ్యాయ బృందం, పట్టణవాసులు అభినందించారు.

గురుకుల పాఠశాలలో ఏడుగురు బాలికలకు అస్వస్థత.

గురుకుల పాఠశాలలో ఏడుగురు బాలికలకు అస్వస్థత

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

జహీరాబాద్ మండలం హోతి(కె) బాలికల గురుకులంలో ఏడుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. నైట్ స్టడీ తర్వాత విద్యార్థినులు తీవ్రమైన దగ్గు, ఆయాసంతో అస్వస్థతకు గురవడంతో వారిని హాస్టల్ సిబ్బంది జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి వారు ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.

ఐదో క్లాసులో స్టేట్ ర్యాంక్ సాధించిన గీతాన్విత.

ఐదో క్లాసులో స్టేట్ ర్యాంక్ సాధించిన గీతాన్విత..

రామాయంపేట ఏప్రిల్ 12 నేటి ధాత్రి (మెదక్)

 

రామాయంపేట పట్టణానికి చెందిన చింతల ఉష శ్రీనివాస్ దంపతుల కూతురు గీతాన్విత రామాయంపేట పట్టణంలోని వివేకనంద విద్యాలయం లో 5వ తరగతి చదువుతున్నది.

Eaxms

 

ఐదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకు సాధించడం జరిగింది. ఉత్తమ ఫలితాలు సాధించి రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకు సాధించినందుకు గోల్డ్ మెడల్ ప్రభుత్వం అందజేయడం జరిగింది.

Eaxms

 

రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించిన విద్యార్థిని గీతాన్వితను పాఠశాల ఉపాధ్యాయ బృందం, పట్టణవాసులు అభినందించారు.

5వ తరగతి విద్యార్థులకు ఆత్మీయ వీడ్కోలు.

5వ తరగతి విద్యార్థులకు ఆత్మీయ వీడ్కోలు

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

ఎమ్. పి.పి.ఎస్ కల్వల పాఠశాల లో ఈరోజు 5వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం పాఠశాల ప్రధానోపాధ్యాయులు కళ్లెం వీరారెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి కాలేరు యాదగిరి, గౌరవ అతిథిగా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు బండారు నరేందర్ విచ్చేయడం జరిగింది. ఈ సమావేశంలో విద్యాశాఖ అధికారి కాలేరు యాదగిరి విద్యార్థులను మంచి విద్యావంతులు గా మార్చి, భావి భారత పౌరులు గా తీర్చి దిద్దడంలో ఉపాధ్యాయుల కృషి వెలకట్టలేనిది. ఈనాడు ప్రభుత్వ పాఠశాల లో చదువు కున్న వారే నేడు గొప్ప స్థానంలో వున్నారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాల లో చదివించాలని పిలుపునిచ్చారు. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు బండారు నరేందర్ మాట్లాడుతూ విద్యార్థులను అన్ని రంగాలలో సర్వతోముఖ అభివృద్ధికి పాటు పడటం కేవలంప్రభుత్వ పాఠశాల తోనే సాధ్యం అని, ప్రభుత్వ విద్యా రంగం ను బలోపేతం చేయాలని అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కళ్లెం వీరారెడ్డి మాట్లాడుతూ ఇంగ్లీష్ భాషను ఒక భాష లాగే చూడాలని, సబ్జెక్టు కు ఆపాదించవద్దని, మాతృభాష లోనే ఎక్కువ విషయావగాహనను, జ్ఞానాన్ని పొందదగలరని అన్నారు. ఇంగ్లీష్ మీడియం విద్య అని విద్యార్థులను ఏ భాష సరిగా రాకుండాచేస్తున్నారని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినిీ ఉపాధ్యాయులైన గోపి, స్వరూప, హరిక్రిష్ణ, క్రిష్ణ,శ్రీదేవి, మోహనకృష్ణ, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తలిదండ్రులు ,విద్యార్థులు పాల్గొన్నారు.

సమయానికి తెరుచుకొని పాఠశాల.

సమయానికి తెరుచుకొని పాఠశాల

విధి నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ఉద్యోగులు

కేసముద్రం/ నేటి దాత్రి

 

కేసముద్రం మున్సిపల్ మండలంలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ రోజురోజుకు మరి అధ్వానంగా తయారవుతున్నాయని ప్రభుత్వ పాఠశాలలో కొలువులు చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు సమయపాలన పాటించకుండా విధులలో అలసత్వం వహిస్తున్నారని, సమయానికి పాఠశాలల తలుపులు తెరుచు కోవడం లేదని విద్యార్థుల మాటలు వినబడుతున్నాయి, మండల విద్యాశాఖ అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉపాధ్యాయులకు మెమొలు జారీ చేసినప్పటికీ ఉపాధ్యాయుల విధి నిర్వహణలో మార్పు కనిపించడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. మండలంలో పనిచేస్తున్న ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు స్థానికంగా ఏ ఒక్కరు ఉండకుండా సుదూర ప్రాంతాల నుంచి కొన్ని రవాణా సౌకర్యాలు రైలుబండ్లు మరియు ఆర్టీసీ బస్సుల ద్వారా నిత్యం రాకపోకలు జరుగుతున్నప్పటికీ ఎవరు ప్రశ్నించేవారు లేక ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. స్థానికంగా ఉండకుండా ఇలా రోజు వచ్చి పోయే క్రమంలో ట్రైన్లు బస్సులు ఆలస్యంగా నడవడం సహజం, కానీ విధులు నిర్వహించే ఉద్యోగులు సమయానికి రాక ట్రైన్ ఎప్పుడు వస్తే అప్పుడే వీరి పాఠశాల సమయపాలనగా భావిస్తూ విడుదల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని పలువురు విద్యావేత్తలు మేధావులు ప్రశ్నిస్తున్నారు.

Education

తల్లి తండ్రి దైవం గురువు వీరు అత్యున్నతమైన స్థానం కలిగిన వారిని, గురువుకు అత్యున్నతమైన గౌరవం ఈ సమాజంలో ఉందని అంతటి గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నటువంటి ఒక ఉపాధ్యాయులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఆ పాఠశాల విద్యార్థుల భవిష్యత్తు అద్దకారం అయిపోతుందని ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులు చదువులలో వెనుకబడిపోతున్నారని పలువురు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. అదేవిధంగా గురువారం కేసముద్రం మున్సిపల్ లోని దానసరి ఎస్టి కాలనీ గల ప్రాథమిక పాఠశాల సమయానికి తలుపులు తెరుచుకోక విద్యార్థులు సమయానికి పాఠశాల చేరుకొని గేటు బయట ఎదురుచూస్తున్న సంఘటన చోటుచేసుకుంది, ఉదయం 7:40 నిమిషములకు పాఠశాలకు రావలసిన ఉపాధ్యాయులు సమయానికి రాక గేటు తాళాలు తీసేవారు లేక విద్యార్థిని విద్యార్థులు గేటు బయటే కూర్చుని ఉపాధ్యాయుల రాక కోసం ఎదురుచూస్తూ ఉండిపోయారు. ఈ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారని, ఒక ఉపాధ్యాయురాలు మాత్రమే పాఠశాలకు ఆలస్యంగా చేరుకోవడం జరిగింది, ఇంకో ఉపాధ్యాయులు మాత్రం నేను ఈరోజు రావడం లేదని లీవ్ లో ఉన్నానని ఫోన్ ద్వారా వివరణ ఇవ్వటం జరిగింది, ఈ స్కూల్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు సమాచారం తెలియజేయగా మాకు ముందస్తు సమాచార లేదని తెలిపారు. ఇలా విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుల పనితీరు మండల విద్యాశాఖ అధికారులు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యార్థుల భవిష్యత్తు ఆగమ్య గోచారం కాకుండా చూడాల్సిన విద్య శాఖ అధికారులు ఇలాంటి ఉపాధ్యాయుల పట్ల కఠిన నిర్ణయాలు పాటించి చర్యలు తీసుకోవాలని ప్రజలు విద్యార్థుల తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.

తెలుగు విభాగంలో కుమ్మరి ఓదేలుకు డాక్టరేట్.

తెలుగు విభాగంలో
కుమ్మరి ఓదేలుకు డాక్టరేట్
హైదరాబాద్ నేటిధాత్రి:

 

ఉస్మానియా విశ్వ విద్యాలయం, హైదరాబాద్ తెలుగు విభాగంలో వరంగల్ జిల్లా కథా సాహిత్యం పరిశీలన అనే అంశం పైన డాక్టర్ పూర్ణ ప్రజ్ఞ చంద్రశేఖర రావు పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేసినందున పీహెచ్డీ పట్టాను ఉస్మానియా విశ్వవిద్యాలయం అందజేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లా మొగుళ్ళపల్లి మండలం గుడిపహాడ్ అనే గ్రామానికి చెందిన కుమ్మరి చిన్న సమ్మయ్య సారమ్మ అనే దంపతులకు జన్మించిన చివరి సంతానం ఓదేలు శారీర వైకల్యం కలిగిన ఓదేలు తన కుటుంబ సభ్యుల సహాయ సహకారంతో అన్నత విద్యనభ్యసించి డాక్టర్ పట్టాను పొందారు.ప్రాథమిక విద్యను స్వగ్రామంలో పూర్తిచేసి, హై స్కూల్ విద్యను మొగుళ్లపల్లి మండలం లో ఉన్న జెడ్ పి పి ఎస్ ఎస్ మొగుల్లపల్లి హైస్కూల్లో చదివి, ఇంటర్ ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర కళాశాల స్టేషను ఘన్ పూర్ లో, కాకతీయ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బిఎ స్పెషల్ తెలుగు చదివి ఉన్నత విద్యను ఉస్మానియా విశ్వవిద్యాలయం లోని ఎం. ఎ తెలుగులో, ఎం.ఎ అర్థశాస్త్రంలో పూర్తిచేసి, టీచర్ ట్రైనింగ్ చేసి పీహెచ్డీ లో ప్రవేశం పొంది వరంగల్ జిల్లా కథా -సాహిత్యం పరిశీలన అంపశయ్య నవీన్ రామచంద్రమౌళి గారి కథల పైన పరిశోధన చేసి పీహెచ్డీ పట్టానుపొందారు. పీహెచ్డీ పట్టాను పొందిన ఓదేలును మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల సంస్థాన్ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు ,వ్యాఖ్యాత, డా బి. వెంకట్ కవి, కుటుంబసభ్యులు, గురుకుల అధ్యాపకులు, మిత్రులు, కవులు, కళాకారులు, తదితరులు, అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

పోత్కపల్లి హై స్కూల్ ను తనిఖీ చేసిన MEO Erra రమేష్.

నేటిధాత్రి కథనానికి స్పందన

పోత్కపల్లి హై స్కూల్ ను తనిఖీ చేసిన ఎం ఇ ఓ ఎర్ర రమేష్

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

 

ఓదెల మండలం పోత్కపల్లి లో గల zphs పాఠశాలలో మధ్యాహ్న భోజనం గురించి మధ్యాహ్నం బోజన పథకం లో విద్యార్థులకు భోజనం లేదని ఆవేదన అని నెటిధాత్రి లో ప్రచురితమైన వార్త కథనానికి స్పందించిన ఎం ఈ ఓ బుధవారం జెడ్, పి హెచ్,ఎస్ పాఠశాల ను సందర్శించి
విద్యార్థులను అడిగి తెలుసుకుని ఉపాధ్యాయులతో మరియు యం డి యం వంట వారితో మాట్లాడడం జరిగింది విద్యార్థులకు సరిపడ బియ్యం ఉపాద్యాయులు ఇచ్చినప్పటికీ తమ వైపు తప్పిదం జరిగినదని వంట వారు ఒప్పుకున్నారని ఏం ఈ ఓ ఎర్ర రమేష్ తెలిపారు.మళ్ళీ ఎప్పుడు ఇలాంటి తప్పిదం జరగకుండా చూసుకుంటామని తెలియా జేశారు. ఈ సందర్భంగా ఏం ఈ ఓ మాట్లాడుతూ విద్యార్థులకు సరిపడ అన్నం అందజేయాలని అలాగే ఇలాంటి సంఘటనలు పునరవృతం కాకుండా చూసుకోవాలని, మళ్ళీ ఇలానే జరిగితే తగు చర్యలు తీసుకుంటామని ఉపాధ్యాయులకు వంట వారికి సూచించడం జరిగింది.

టీజీ గురుకుల సెట్ లో మెరిసిన దోరవారివేంపల్లి పాఠశాల

టీజీ గురుకుల సెట్ లో మెరిసిన దోరవారివేంపల్లి పాఠశాల ఆణిముత్యాలు..

కొత్తగూడ, నేటిధాత్రి:

 

 

 

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం లోని దోరువారివేంపల్లి ప్రభుత్వం పాఠశాల విద్యార్థులు 100%శాతం ఫలితాలు , సత్తా చాటిన పాఠశాల విద్యార్థులు
ఫిబ్రవరి 23 వ తారీఖున జరిగిన టీజీ గురుకుల సెట్ లో హనుమకొండ జిల్లా నడికుడ మండలం చర్లపల్లి ప్రాథమిక పాఠశాల నుంచి 10 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయగా అందులో నుండి పోయిన వారం వెల్లడించిన ప్రవేశ ఫలితాల వెల్లడిలో 10/10 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు దొరవారివేంపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సువర్ణ పాక క్రిష్ణ తెలిపారు… ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ మా యొక్క పాఠశాలలో ప్రాథమిక తరగతి వరకే ఉండడం వలన విద్యార్థులు ఈ గ్రామం మంచి పాఠశాలలో విద్యార్థులు చదువుకోవాలని పాఠశాల విద్యార్థులకు గురుకుల ప్రవేశ పరీక్ష కోసం స్పెషల్ క్లాస్ నిర్వహించము అందుకే విద్యార్థులకు ఈ రోజున పదికి పది మంది విద్యార్థులు వివిధ గురుకుల పాఠశాలలో సీట్ రావడం జరిగిందని చెప్పారు ఈసందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.. విద్యార్థులు తల్లిదండ్రులు సందర్భంగా చాలా సంతోషం పడ్డారు ఈకార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అండెం కృష్ణ గారు అంగన్వాడీ టీచర్ భారతి గారు పాల్గొన్నారు…

విద్యారంగంలో మనువాద భావాజాలానికి వ్యతిరేకంగా.!

విద్యారంగంలో మనువాద భావాజాలానికి వ్యతిరేకంగా పోరాడుదాం…PDSU

పి డి ఎస్ యు ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ

చెన్నూర్:: నేటి ధాత్రి

 

 

చెన్నూర్ కేంద్రంలో కిష్టంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పి డి ఎస్ యు ఆధ్వర్యంలో ఉస్మానియా క్రాంతి ధార కామ్రేడ్ జార్జ్ రెడ్డి 53 వ వర్ధంతి సభలను విజయవంతం చేయాలని పోస్టర్ ఆవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా PDSU జిల్లా ఉపాధ్యక్షుడు పి.సికిందర్ మాట్లాడుతూ…ఉస్మానియా యూనివర్సిటీలోమతోన్మాదానికి ,మహిళలపై లైంగిక దాడులకు వ్యతిరేకంగా పిడికిలి బిగించి పోరాడిన విప్లవ, విద్యార్థి నాయకులు కామ్రేడ్ జార్జి రెడ్డి క్యాంపస్ లో జరుగుతున్న అన్యాయాలను లంపెన్ గుండాల దాడులను ఎదిరించాడు అన్నారు.
సమసమాజ స్థాపనకు ఉద్యమిస్తున్న జార్జి రెడ్డి ఎదుగుదలని జీర్ణించుకోలేని మతోన్మాద గుండాలు హత్య చేశారన్నారు.ఆయన ఆశయాల సాధనకై పోరాడాలని,అమరత్వాన్ని స్మరించుకుంటూ,జరుగు వర్ధంతి సభలను జయప్రదం చేయాలని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాహుల్, రవికిరణ్, స్నేహ, రవళి, లక్ష్మి, పూజ తదితరులు పాల్గొన్నారు

ఎన్.ఎస్.యు.ఐ 55వ ఆవిర్భావ వేడుకలు.

ఎన్.ఎస్.యు.ఐ 55వ ఆవిర్భావ వేడుకలు.

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి )

 

సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో
ఎన్.ఎస్. యు.ఐ 55 ఆర్బో వేడుకలు పాల్గొన్న రాష్ట్ర కోఆర్డినేటర్ వేల్పుల వేణు యాదవ్ మాట్లాడుతూ నేడు అంబేద్కర్ విగ్రహం సాక్షిగా జై భీమ్, జై బాపు జై సంవిధాన్ అనే కార్యక్రమం కూడా ఇక్కడే నిర్వహించడం గర్వకారణంగా ఉంది.అని అలాగే ఎన్నో సంవత్సరాలనుండి విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్న ఎన్.ఎస్.యు.ఐ నేడు 55వ ఆవిర్భావ దినోత్సవం సిరిసిల్ల పట్టణంలో జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది అని తెలిపారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్.ఎస్.యు.ఐ ఆవిర్భవ దినోత్సవం సిరిసిల్ల జిల్లా స్థాయిలో పట్టణ స్థాయిలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చొప్పదండి ప్రభాకర్, పద్మశాలి పట్టణ అధ్యక్షులు గోలి వెంకటరమణ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వైద్య శివప్రసాద్,తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్,టోనీ తదితర కాంగ్రెస్ నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు.

టీఎస్ పాలీసెట్ ఉచిత బోధన తరగతులు – 2025.

టీఎస్ పాలీసెట్ ఉచిత బోధన తరగతులు – 2025. 

మందమర్రి నేటి ధాత్రి

 

సింగరేణి సిఎండి శ్రీ ఎన్. బలరాం గారు మరియు డైరెక్టర్ (పా) శ్రీ కె. వెంకటేశ్వర్లు గారి ఆదేశాల మేరకు, సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో టీఎస్ పాలీసెట్ – 2025 పరీక్షకు ఉచిత బోధన తరగతులు నిర్వహించబోతున్నాము.

ఈ తరగతులు 2025 ఏప్రిల్ 10 నుండి మే 10 వరకు సింగరేణి పాఠశాలల్లో నిర్వహించబడతాయి.

అర్హులు:

ఎస్ఎస్సి – 2025 పూర్తి చేసిన విద్యార్థులు

ఇతర పాఠశాలల్లో చదువుతున్న సింగరేణి ఉద్యోగుల పిల్లలు

సీట్ల పరిమితి మేరకు బడుగు, బలహీన వర్గాల, నిరుపేద ఎస్ఎస్సి విద్యార్థులు

వివరాలు: టీ.ఎస్ పాలీసెట్ (తెలంగాణ స్టేట్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) ద్వారా విద్యార్థులు ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ వంటి విభాగాల్లో 3 సంవత్సరాల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు.

ఈ కోర్సులు పూర్తి చేసిన తర్వాత విద్యార్థులు:

లాటరల్ ఎంట్రీ ద్వారా ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సుల్లో చేరవచ్చు

ప్రభుత్వ/ప్రైవేట్ రంగ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు

స్వంతంగా పరిశ్రమ/వ్యాపారం స్థాపించి స్వయం ఉపాధి పొందవచ్చు

మరిన్ని వివరాలకు: సమీపంలోని సింగరేణి పాఠశాల మందమర్రి ప్రధానోపాధ్యాయులను సంప్రదించగలరు సెల్ నెంబర్. 98492 15692

కార్యదర్శి సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ (ఎస్ సి ఈ ఎస్)

గ్రూప్ 1 ర్యాంకర్ జిన్నా తేజస్వినిరెడ్డికి ఘన సన్మానం. 

గ్రూప్ 1 ర్యాంకర్ జిన్నా తేజస్వినిరెడ్డికి ఘన సన్మానం. 

గట్లకానిపర్తి గ్రామ అభివృద్ధి కమిటీ

శాయంపేట నేటిధాత్రి:

 

తెలంగాణ రాష్ట్రంలో TGPSC ప్రకటించిన గ్రూప్ 1 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంక్, మల్టీ జోన్1 లో మొదటిర్యాంక్ సాధించిన శాయంపేట మండ లం మాంధారిపేట గ్రామానికి చెందిన జిన్నా విజయపాల్ రెడ్డి కూతురు కుమారి తేజస్వి ని రెడ్డి అభినందిస్తూ గ్రామ అభివృద్ధి కమిటీ గట్లకానిపర్తి మరియు సీనియర్ జర్నలిస్ట్ & చీఫ్ ఎడిటర్ వరంగల్ వాయిస్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మా నించడం జరిగింది. గ్రామ అభివృద్ధి కమిటీ తరుపున మెమంటో బహుకరించి, శాలువాతో సత్కరించడం జరిగింది. ఇదే సమయంలో కుమారి తేజస్వినిరెడ్డి మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహిం చాలని కోరుకుంటూ భవిష్య త్తులో గట్లకానిపర్తి గ్రామంలో నిర్మించబోయే గ్రంధాలయ ప్రారంభోత్సవానికి రావాలని కోరగా అందుకు తను తప్ప కుండా హాజరవుతానని చెప్ప డంతోపాటు, గట్లకానిపర్తి గ్రామంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు తెలుసుకొని ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మద్దతు తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ & వరంగల్ వాయిస్ ఎడిటర్ గడ్డం కేశవ మూర్తి మరియు గట్లకాని పర్తి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

శ్రీ చైతన్య స్కూల్లో గ్రాడ్యుయేట్ డే.

శ్రీ చైతన్య స్కూల్లో గ్రాడ్యుయేట్ డే

ముఖ్య అతిథులుగా పాల్గొన్న మహబూబాబాద్ ఎమ్మెల్యే డా” భూక్య మురళి నాయక్, డి సి సి అధ్యక్షులు జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి

పిల్లలని దయచేసి బెట్టింగ్ యాప్ లకు దూరంగా ఉంచండి…

సెల్ ఫోన్ లకు పిల్లలని దూరంగా ఉంచండి

విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు

కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి

 

విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచి క్రమశిక్షణ పాటిస్తూ భవిష్యత్తులో అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్ ఆకాంక్షించారు. స్థానిక శ్రీ చైతన్య పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన ఐ ఎన్ టి ఎస్ ఓ బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. నేషనల్ టాలెంట్ టెస్ట్ ఒలంపియాడ్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులను ఆయన అభినందించారు విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఆయన బహుమతి ప్రధానం చేశారు. ఈ పరీక్షలో ప్రథమ స్థానంలో నిలిచిన మూడవ తరగతి విద్యార్థిని ఏ లాస్య ఫిరోజ్ ఖాన్ అద్వైత రోషిత విక్రం ములకు గోల్డ్ మెడల్ సర్టిఫికెట్లు అందజేశారు లాస్యకు లాప్టాప్ అందజేసి ప్రత్యేకంగా అభినందించారు. తొమ్మిదవ తరగతిలో అత్యున్నత ప్రదర్శన కనపరిచిన అల్లం పైవ్యశ్రీ వచన పల్లి చేత్రాలకు గోల్డ్ మెడల్ ప్రశంస పత్రాలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రమశిక్షణ లోపిస్తే అది తల్లిదండ్రుల బాధ్యత అన్నారు. విద్యార్థులు సెల్ఫోన్లకు దూరంగా ఉండాలని ఆయన కోరారు సెల్ఫోన్లకు అలవాటు పడిన విద్యార్థులు భవిష్యత్తులో బెట్టింగులకు పాల్పడే ప్రమాదం ఉందన్నారు. తను కూడా విద్యార్థి దశలో ఇలాంటి పరీక్షల్లో 12,000 స్కాలర్షిప్ ను పొందిన విషయాన్ని గుర్తు చేశారు. తన విద్యార్థి జీవితాన్ని నెమరు వేసుకున్నారు పోటీ పరీక్షలకు వంద మంది విద్యార్థులు హాజరైతే 85 మంది విద్యార్థులు విజయం సాధించడం అభినందనీయం అన్నారు ప్రిన్సిపాల్ కోలా రామదాసు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ డిసిసి అధ్యక్షులు జన్నారెడ్డి భరత్ చంద్రారెడ్డి, మార్కెట్ చైర్మన్ గంటా సంజీవరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు, డిసిసి ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి బండారి వెంకన్న , మాజీ టి పి సి సి సభ్యులు దాసురు నాయక్, ఆయుఃఖాన్, వేముల శ్రీనివాస్ రెడ్డి,సుధాకర్ కోమల వెంకట్ రెడ్డి రాజేష్ కుమార్ సుమన్ అర్చన మౌనిక నూర్జహాన్ శ్రావణి ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులపై లాఠీ ఛార్జ్ పై విన్నుత్న నిరసన. 

విద్యార్థులపై లాఠీ ఛార్జ్ పై విన్నుత్న నిరసన. 

సిరిసిల్ల చేనేత చౌక్ వద్ద మోకాళ్లపై కూర్చొని సంకెళ్లతో నిరసన

సిరిసిల్ల టౌన్: (నేటి ధాత్రి)

 

సిరిసిల్ల పట్టణంలోని చేనేత చౌక్ లో
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేయడానికి నిరాసిస్తూ ఈరోజు సిరిసిల్ల చేనేత చౌక్ లో కూర్చొని సంకెళ్లతో నిరసన తెలపడం జరిగింది.ఈ సందర్భంగా కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు శాంతియుతంగా నిరసన తెలిపితే వారిపై లాఠీచార్జ్ చేయడం సిగ్గుచేటు ఈ సందర్భంగా అన్నారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూమిని చెట్లను నరికి వేసుకుంటే అక్కడ యూనివర్సిటీ విద్యార్థులు శాంతియుతంగా ఆందోళన చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులచే లాఠీచార్జి చేయించడం చాలా దురదృష్టమై అన్నారు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను ఇబ్బందులు పెడుతుంటే ఇదేనా మీ ప్రజా పాలన ఇదేనా ఇంద్రమ్మ రాజ్యం అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యార్థులతో పెట్టుకున్న ప్రభుత్వం చరిత్రలో ఎక్కడ ఉండలేదని అన్నారు విద్యార్థి లోకానికి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు విద్యార్థులకు ఇక్కడ అన్యాయం జరిగిన బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు చెట్లను కొట్టేస్తే అక్కడ ఉన్న మూగ జీవాలు తల్లఢిల్లుతున్నాయి అని గుర్తు చేశారు మేధావులారా ఇంత జరిగినా ఎందుకు మౌనంగా ఉంటుందని ప్రశ్నించారు విద్యార్థులతో పాట ప్రొఫెసర్ల చూడకుండా చిట్కబడడం చాలా దురదృష్టమని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల లాక్కోవడం మానేయాలని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మట్ట శ్రీనివాస్ ముద్దం అనిల్ కాసర్ల వినయ్ దేవరాజ్ ముజ్జు నవీ గణేష్ రాజు వినయ్ నరేష్ వేణు మోహన్ పరమేష్ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు…..

విద్య, వైద్యం కాంగ్రెస్ ముఖ్య ద్యేయం.

విద్య, వైద్యం కాంగ్రెస్ ముఖ్య ద్యేయం
• ఎమ్మెల్యే రోహిత్ రావు

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

విద్య, వైద్యన్నీ అందిచడమే కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్య ద్యేయమని మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. ఈ మేరకు శుక్రవారం నిజాంపేట మండల కేంద్రంలో పర్యటించి జై బాపు, జైసంవిధాన్ లో భాగంగా మండలం లో ర్యాలీ నిర్వహించారు. అలాగే సన్న బియ్యం, ఆరోగ్య ఉప కేంద్రన్నీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో చేయలేని అభివృద్ధినీ కాంగ్రెస్ 15 నెలల్లో చేసి చూపిస్తుందని కొనియడారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, వైద్య కళాశాల ను కాంగ్రెస్ హయాంలో ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ రమాదేవి, కాంగ్రెస్ నాయకులు చౌదర సుప్రభాతరావు, మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజా మహేందర్, పట్టణ అధ్యక్షుడు నసిరుద్దీన్, సత్యనారాయణ, లింగం గౌడ్, గుమ్ముల అజయ్, దేశెట్టి సిద్దారములు, సత్యనారాయణ రెడ్డి,శ్యామల మహేష్, అధికారులు ఉన్నారు.

పేదరిక నిర్మూలనకు చదువు వజ్రాయుధం.

‘పేదరిక నిర్మూలనకు.. చదువు వజ్రాయుధం’

భూత్పూర్/ నేటి ధాత్రి.

 

 

మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను తల్లిదండ్రులు అందించి.. చదివించాలన్నారు. పేదరిక నిర్మూలనకు చదువు ఒక ఆయుధమన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన.!   

వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన ఆదర్శ మోడల్ స్కూల్ యాజమాన్యం.  

మందమర్రి నీటి ధాత్రి

 

మందమర్రి పట్టణం లోని తెలంగాణ ఆదర్శమోడల్ పాఠశాల లో జూనియర్ కాలేజీ విద్యార్థుల తో వార్షికోత్సవ (అనివార్సరీ) వేడుకలు ఘనంగా నిర్వహించరు ముందుగా సరస్వతి పూజ జ్యోతిప్రజ్వాల వెలిగించి వార్షికోత్సవ వేడుకలు ప్రారంభించిన మోడల్ పాఠశాల ప్రిన్సిపాల్ సారా తస్లిమా
ప్రిన్సిపాల్ మాట్లాడుతూ

Adarsh ​​Model School.

మీ తల్లిదండ్రులు కష్టాన్ని మీరు గమనించి జీవితంలో మంచి స్థాయి కి ఎదిగి వారిని సంతోషపెట్టాలని ఆ దిశ గా లక్ష్యాన్ని ఏర్పార్చుకోవాలని కోరారు

Adarsh ​​Model School.

విద్యార్థులు చేసిన జానపద నృత్యలు, యోగ విన్యాసాలు,వివిధ పాటలు లంబాడి నృత్యంలు పలువురు ని అలరించాయి ఈ కార్యక్రమం లోప్రిన్సిపాల్ సారా తస్లిమ్ ఉపాధ్యాయులు ఉపాధ్యాయలు విద్యార్థి విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version