పోత్కపల్లి హై స్కూల్ ను తనిఖీ చేసిన MEO Erra రమేష్.

నేటిధాత్రి కథనానికి స్పందన

పోత్కపల్లి హై స్కూల్ ను తనిఖీ చేసిన ఎం ఇ ఓ ఎర్ర రమేష్

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

 

ఓదెల మండలం పోత్కపల్లి లో గల zphs పాఠశాలలో మధ్యాహ్న భోజనం గురించి మధ్యాహ్నం బోజన పథకం లో విద్యార్థులకు భోజనం లేదని ఆవేదన అని నెటిధాత్రి లో ప్రచురితమైన వార్త కథనానికి స్పందించిన ఎం ఈ ఓ బుధవారం జెడ్, పి హెచ్,ఎస్ పాఠశాల ను సందర్శించి
విద్యార్థులను అడిగి తెలుసుకుని ఉపాధ్యాయులతో మరియు యం డి యం వంట వారితో మాట్లాడడం జరిగింది విద్యార్థులకు సరిపడ బియ్యం ఉపాద్యాయులు ఇచ్చినప్పటికీ తమ వైపు తప్పిదం జరిగినదని వంట వారు ఒప్పుకున్నారని ఏం ఈ ఓ ఎర్ర రమేష్ తెలిపారు.మళ్ళీ ఎప్పుడు ఇలాంటి తప్పిదం జరగకుండా చూసుకుంటామని తెలియా జేశారు. ఈ సందర్భంగా ఏం ఈ ఓ మాట్లాడుతూ విద్యార్థులకు సరిపడ అన్నం అందజేయాలని అలాగే ఇలాంటి సంఘటనలు పునరవృతం కాకుండా చూసుకోవాలని, మళ్ళీ ఇలానే జరిగితే తగు చర్యలు తీసుకుంటామని ఉపాధ్యాయులకు వంట వారికి సూచించడం జరిగింది.

టీజీ గురుకుల సెట్ లో మెరిసిన దోరవారివేంపల్లి పాఠశాల

టీజీ గురుకుల సెట్ లో మెరిసిన దోరవారివేంపల్లి పాఠశాల ఆణిముత్యాలు..

కొత్తగూడ, నేటిధాత్రి:

 

 

 

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం లోని దోరువారివేంపల్లి ప్రభుత్వం పాఠశాల విద్యార్థులు 100%శాతం ఫలితాలు , సత్తా చాటిన పాఠశాల విద్యార్థులు
ఫిబ్రవరి 23 వ తారీఖున జరిగిన టీజీ గురుకుల సెట్ లో హనుమకొండ జిల్లా నడికుడ మండలం చర్లపల్లి ప్రాథమిక పాఠశాల నుంచి 10 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయగా అందులో నుండి పోయిన వారం వెల్లడించిన ప్రవేశ ఫలితాల వెల్లడిలో 10/10 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు దొరవారివేంపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సువర్ణ పాక క్రిష్ణ తెలిపారు… ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ మా యొక్క పాఠశాలలో ప్రాథమిక తరగతి వరకే ఉండడం వలన విద్యార్థులు ఈ గ్రామం మంచి పాఠశాలలో విద్యార్థులు చదువుకోవాలని పాఠశాల విద్యార్థులకు గురుకుల ప్రవేశ పరీక్ష కోసం స్పెషల్ క్లాస్ నిర్వహించము అందుకే విద్యార్థులకు ఈ రోజున పదికి పది మంది విద్యార్థులు వివిధ గురుకుల పాఠశాలలో సీట్ రావడం జరిగిందని చెప్పారు ఈసందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.. విద్యార్థులు తల్లిదండ్రులు సందర్భంగా చాలా సంతోషం పడ్డారు ఈకార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అండెం కృష్ణ గారు అంగన్వాడీ టీచర్ భారతి గారు పాల్గొన్నారు…

విద్యారంగంలో మనువాద భావాజాలానికి వ్యతిరేకంగా.!

విద్యారంగంలో మనువాద భావాజాలానికి వ్యతిరేకంగా పోరాడుదాం…PDSU

పి డి ఎస్ యు ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ

చెన్నూర్:: నేటి ధాత్రి

 

 

చెన్నూర్ కేంద్రంలో కిష్టంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పి డి ఎస్ యు ఆధ్వర్యంలో ఉస్మానియా క్రాంతి ధార కామ్రేడ్ జార్జ్ రెడ్డి 53 వ వర్ధంతి సభలను విజయవంతం చేయాలని పోస్టర్ ఆవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా PDSU జిల్లా ఉపాధ్యక్షుడు పి.సికిందర్ మాట్లాడుతూ…ఉస్మానియా యూనివర్సిటీలోమతోన్మాదానికి ,మహిళలపై లైంగిక దాడులకు వ్యతిరేకంగా పిడికిలి బిగించి పోరాడిన విప్లవ, విద్యార్థి నాయకులు కామ్రేడ్ జార్జి రెడ్డి క్యాంపస్ లో జరుగుతున్న అన్యాయాలను లంపెన్ గుండాల దాడులను ఎదిరించాడు అన్నారు.
సమసమాజ స్థాపనకు ఉద్యమిస్తున్న జార్జి రెడ్డి ఎదుగుదలని జీర్ణించుకోలేని మతోన్మాద గుండాలు హత్య చేశారన్నారు.ఆయన ఆశయాల సాధనకై పోరాడాలని,అమరత్వాన్ని స్మరించుకుంటూ,జరుగు వర్ధంతి సభలను జయప్రదం చేయాలని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాహుల్, రవికిరణ్, స్నేహ, రవళి, లక్ష్మి, పూజ తదితరులు పాల్గొన్నారు

ఎన్.ఎస్.యు.ఐ 55వ ఆవిర్భావ వేడుకలు.

ఎన్.ఎస్.యు.ఐ 55వ ఆవిర్భావ వేడుకలు.

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి )

 

సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో
ఎన్.ఎస్. యు.ఐ 55 ఆర్బో వేడుకలు పాల్గొన్న రాష్ట్ర కోఆర్డినేటర్ వేల్పుల వేణు యాదవ్ మాట్లాడుతూ నేడు అంబేద్కర్ విగ్రహం సాక్షిగా జై భీమ్, జై బాపు జై సంవిధాన్ అనే కార్యక్రమం కూడా ఇక్కడే నిర్వహించడం గర్వకారణంగా ఉంది.అని అలాగే ఎన్నో సంవత్సరాలనుండి విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్న ఎన్.ఎస్.యు.ఐ నేడు 55వ ఆవిర్భావ దినోత్సవం సిరిసిల్ల పట్టణంలో జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది అని తెలిపారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్.ఎస్.యు.ఐ ఆవిర్భవ దినోత్సవం సిరిసిల్ల జిల్లా స్థాయిలో పట్టణ స్థాయిలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చొప్పదండి ప్రభాకర్, పద్మశాలి పట్టణ అధ్యక్షులు గోలి వెంకటరమణ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వైద్య శివప్రసాద్,తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్,టోనీ తదితర కాంగ్రెస్ నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు.

టీఎస్ పాలీసెట్ ఉచిత బోధన తరగతులు – 2025.

టీఎస్ పాలీసెట్ ఉచిత బోధన తరగతులు – 2025. 

మందమర్రి నేటి ధాత్రి

 

సింగరేణి సిఎండి శ్రీ ఎన్. బలరాం గారు మరియు డైరెక్టర్ (పా) శ్రీ కె. వెంకటేశ్వర్లు గారి ఆదేశాల మేరకు, సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో టీఎస్ పాలీసెట్ – 2025 పరీక్షకు ఉచిత బోధన తరగతులు నిర్వహించబోతున్నాము.

ఈ తరగతులు 2025 ఏప్రిల్ 10 నుండి మే 10 వరకు సింగరేణి పాఠశాలల్లో నిర్వహించబడతాయి.

అర్హులు:

ఎస్ఎస్సి – 2025 పూర్తి చేసిన విద్యార్థులు

ఇతర పాఠశాలల్లో చదువుతున్న సింగరేణి ఉద్యోగుల పిల్లలు

సీట్ల పరిమితి మేరకు బడుగు, బలహీన వర్గాల, నిరుపేద ఎస్ఎస్సి విద్యార్థులు

వివరాలు: టీ.ఎస్ పాలీసెట్ (తెలంగాణ స్టేట్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) ద్వారా విద్యార్థులు ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ వంటి విభాగాల్లో 3 సంవత్సరాల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు.

ఈ కోర్సులు పూర్తి చేసిన తర్వాత విద్యార్థులు:

లాటరల్ ఎంట్రీ ద్వారా ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సుల్లో చేరవచ్చు

ప్రభుత్వ/ప్రైవేట్ రంగ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు

స్వంతంగా పరిశ్రమ/వ్యాపారం స్థాపించి స్వయం ఉపాధి పొందవచ్చు

మరిన్ని వివరాలకు: సమీపంలోని సింగరేణి పాఠశాల మందమర్రి ప్రధానోపాధ్యాయులను సంప్రదించగలరు సెల్ నెంబర్. 98492 15692

కార్యదర్శి సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ (ఎస్ సి ఈ ఎస్)

గ్రూప్ 1 ర్యాంకర్ జిన్నా తేజస్వినిరెడ్డికి ఘన సన్మానం. 

గ్రూప్ 1 ర్యాంకర్ జిన్నా తేజస్వినిరెడ్డికి ఘన సన్మానం. 

గట్లకానిపర్తి గ్రామ అభివృద్ధి కమిటీ

శాయంపేట నేటిధాత్రి:

 

తెలంగాణ రాష్ట్రంలో TGPSC ప్రకటించిన గ్రూప్ 1 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంక్, మల్టీ జోన్1 లో మొదటిర్యాంక్ సాధించిన శాయంపేట మండ లం మాంధారిపేట గ్రామానికి చెందిన జిన్నా విజయపాల్ రెడ్డి కూతురు కుమారి తేజస్వి ని రెడ్డి అభినందిస్తూ గ్రామ అభివృద్ధి కమిటీ గట్లకానిపర్తి మరియు సీనియర్ జర్నలిస్ట్ & చీఫ్ ఎడిటర్ వరంగల్ వాయిస్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మా నించడం జరిగింది. గ్రామ అభివృద్ధి కమిటీ తరుపున మెమంటో బహుకరించి, శాలువాతో సత్కరించడం జరిగింది. ఇదే సమయంలో కుమారి తేజస్వినిరెడ్డి మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహిం చాలని కోరుకుంటూ భవిష్య త్తులో గట్లకానిపర్తి గ్రామంలో నిర్మించబోయే గ్రంధాలయ ప్రారంభోత్సవానికి రావాలని కోరగా అందుకు తను తప్ప కుండా హాజరవుతానని చెప్ప డంతోపాటు, గట్లకానిపర్తి గ్రామంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు తెలుసుకొని ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మద్దతు తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ & వరంగల్ వాయిస్ ఎడిటర్ గడ్డం కేశవ మూర్తి మరియు గట్లకాని పర్తి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

శ్రీ చైతన్య స్కూల్లో గ్రాడ్యుయేట్ డే.

శ్రీ చైతన్య స్కూల్లో గ్రాడ్యుయేట్ డే

ముఖ్య అతిథులుగా పాల్గొన్న మహబూబాబాద్ ఎమ్మెల్యే డా” భూక్య మురళి నాయక్, డి సి సి అధ్యక్షులు జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి

పిల్లలని దయచేసి బెట్టింగ్ యాప్ లకు దూరంగా ఉంచండి…

సెల్ ఫోన్ లకు పిల్లలని దూరంగా ఉంచండి

విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు

కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి

 

విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచి క్రమశిక్షణ పాటిస్తూ భవిష్యత్తులో అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్ ఆకాంక్షించారు. స్థానిక శ్రీ చైతన్య పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన ఐ ఎన్ టి ఎస్ ఓ బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. నేషనల్ టాలెంట్ టెస్ట్ ఒలంపియాడ్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులను ఆయన అభినందించారు విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఆయన బహుమతి ప్రధానం చేశారు. ఈ పరీక్షలో ప్రథమ స్థానంలో నిలిచిన మూడవ తరగతి విద్యార్థిని ఏ లాస్య ఫిరోజ్ ఖాన్ అద్వైత రోషిత విక్రం ములకు గోల్డ్ మెడల్ సర్టిఫికెట్లు అందజేశారు లాస్యకు లాప్టాప్ అందజేసి ప్రత్యేకంగా అభినందించారు. తొమ్మిదవ తరగతిలో అత్యున్నత ప్రదర్శన కనపరిచిన అల్లం పైవ్యశ్రీ వచన పల్లి చేత్రాలకు గోల్డ్ మెడల్ ప్రశంస పత్రాలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రమశిక్షణ లోపిస్తే అది తల్లిదండ్రుల బాధ్యత అన్నారు. విద్యార్థులు సెల్ఫోన్లకు దూరంగా ఉండాలని ఆయన కోరారు సెల్ఫోన్లకు అలవాటు పడిన విద్యార్థులు భవిష్యత్తులో బెట్టింగులకు పాల్పడే ప్రమాదం ఉందన్నారు. తను కూడా విద్యార్థి దశలో ఇలాంటి పరీక్షల్లో 12,000 స్కాలర్షిప్ ను పొందిన విషయాన్ని గుర్తు చేశారు. తన విద్యార్థి జీవితాన్ని నెమరు వేసుకున్నారు పోటీ పరీక్షలకు వంద మంది విద్యార్థులు హాజరైతే 85 మంది విద్యార్థులు విజయం సాధించడం అభినందనీయం అన్నారు ప్రిన్సిపాల్ కోలా రామదాసు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ డిసిసి అధ్యక్షులు జన్నారెడ్డి భరత్ చంద్రారెడ్డి, మార్కెట్ చైర్మన్ గంటా సంజీవరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు, డిసిసి ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి బండారి వెంకన్న , మాజీ టి పి సి సి సభ్యులు దాసురు నాయక్, ఆయుఃఖాన్, వేముల శ్రీనివాస్ రెడ్డి,సుధాకర్ కోమల వెంకట్ రెడ్డి రాజేష్ కుమార్ సుమన్ అర్చన మౌనిక నూర్జహాన్ శ్రావణి ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులపై లాఠీ ఛార్జ్ పై విన్నుత్న నిరసన. 

విద్యార్థులపై లాఠీ ఛార్జ్ పై విన్నుత్న నిరసన. 

సిరిసిల్ల చేనేత చౌక్ వద్ద మోకాళ్లపై కూర్చొని సంకెళ్లతో నిరసన

సిరిసిల్ల టౌన్: (నేటి ధాత్రి)

 

సిరిసిల్ల పట్టణంలోని చేనేత చౌక్ లో
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేయడానికి నిరాసిస్తూ ఈరోజు సిరిసిల్ల చేనేత చౌక్ లో కూర్చొని సంకెళ్లతో నిరసన తెలపడం జరిగింది.ఈ సందర్భంగా కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు శాంతియుతంగా నిరసన తెలిపితే వారిపై లాఠీచార్జ్ చేయడం సిగ్గుచేటు ఈ సందర్భంగా అన్నారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూమిని చెట్లను నరికి వేసుకుంటే అక్కడ యూనివర్సిటీ విద్యార్థులు శాంతియుతంగా ఆందోళన చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులచే లాఠీచార్జి చేయించడం చాలా దురదృష్టమై అన్నారు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను ఇబ్బందులు పెడుతుంటే ఇదేనా మీ ప్రజా పాలన ఇదేనా ఇంద్రమ్మ రాజ్యం అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యార్థులతో పెట్టుకున్న ప్రభుత్వం చరిత్రలో ఎక్కడ ఉండలేదని అన్నారు విద్యార్థి లోకానికి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు విద్యార్థులకు ఇక్కడ అన్యాయం జరిగిన బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు చెట్లను కొట్టేస్తే అక్కడ ఉన్న మూగ జీవాలు తల్లఢిల్లుతున్నాయి అని గుర్తు చేశారు మేధావులారా ఇంత జరిగినా ఎందుకు మౌనంగా ఉంటుందని ప్రశ్నించారు విద్యార్థులతో పాట ప్రొఫెసర్ల చూడకుండా చిట్కబడడం చాలా దురదృష్టమని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల లాక్కోవడం మానేయాలని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మట్ట శ్రీనివాస్ ముద్దం అనిల్ కాసర్ల వినయ్ దేవరాజ్ ముజ్జు నవీ గణేష్ రాజు వినయ్ నరేష్ వేణు మోహన్ పరమేష్ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు…..

విద్య, వైద్యం కాంగ్రెస్ ముఖ్య ద్యేయం.

విద్య, వైద్యం కాంగ్రెస్ ముఖ్య ద్యేయం
• ఎమ్మెల్యే రోహిత్ రావు

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

విద్య, వైద్యన్నీ అందిచడమే కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్య ద్యేయమని మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. ఈ మేరకు శుక్రవారం నిజాంపేట మండల కేంద్రంలో పర్యటించి జై బాపు, జైసంవిధాన్ లో భాగంగా మండలం లో ర్యాలీ నిర్వహించారు. అలాగే సన్న బియ్యం, ఆరోగ్య ఉప కేంద్రన్నీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో చేయలేని అభివృద్ధినీ కాంగ్రెస్ 15 నెలల్లో చేసి చూపిస్తుందని కొనియడారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, వైద్య కళాశాల ను కాంగ్రెస్ హయాంలో ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ రమాదేవి, కాంగ్రెస్ నాయకులు చౌదర సుప్రభాతరావు, మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజా మహేందర్, పట్టణ అధ్యక్షుడు నసిరుద్దీన్, సత్యనారాయణ, లింగం గౌడ్, గుమ్ముల అజయ్, దేశెట్టి సిద్దారములు, సత్యనారాయణ రెడ్డి,శ్యామల మహేష్, అధికారులు ఉన్నారు.

పేదరిక నిర్మూలనకు చదువు వజ్రాయుధం.

‘పేదరిక నిర్మూలనకు.. చదువు వజ్రాయుధం’

భూత్పూర్/ నేటి ధాత్రి.

 

 

మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను తల్లిదండ్రులు అందించి.. చదివించాలన్నారు. పేదరిక నిర్మూలనకు చదువు ఒక ఆయుధమన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన.!   

వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన ఆదర్శ మోడల్ స్కూల్ యాజమాన్యం.  

మందమర్రి నీటి ధాత్రి

 

మందమర్రి పట్టణం లోని తెలంగాణ ఆదర్శమోడల్ పాఠశాల లో జూనియర్ కాలేజీ విద్యార్థుల తో వార్షికోత్సవ (అనివార్సరీ) వేడుకలు ఘనంగా నిర్వహించరు ముందుగా సరస్వతి పూజ జ్యోతిప్రజ్వాల వెలిగించి వార్షికోత్సవ వేడుకలు ప్రారంభించిన మోడల్ పాఠశాల ప్రిన్సిపాల్ సారా తస్లిమా
ప్రిన్సిపాల్ మాట్లాడుతూ

Adarsh ​​Model School.

మీ తల్లిదండ్రులు కష్టాన్ని మీరు గమనించి జీవితంలో మంచి స్థాయి కి ఎదిగి వారిని సంతోషపెట్టాలని ఆ దిశ గా లక్ష్యాన్ని ఏర్పార్చుకోవాలని కోరారు

Adarsh ​​Model School.

విద్యార్థులు చేసిన జానపద నృత్యలు, యోగ విన్యాసాలు,వివిధ పాటలు లంబాడి నృత్యంలు పలువురు ని అలరించాయి ఈ కార్యక్రమం లోప్రిన్సిపాల్ సారా తస్లిమ్ ఉపాధ్యాయులు ఉపాధ్యాయలు విద్యార్థి విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఏబీవీపీ నాయకుల ముందస్తు అరెస్టులు.

ఏబీవీపీ నాయకుల ముందస్తు అరెస్టులు

నిజాంపేట, నేటి ధాత్రి

 

చలో HCU కార్యక్రమానికి తరలిన ఏబీవీపీ విద్యార్థి నాయకులను నిజాంపేట పోలీసులు ముందస్తుగా అక్రమ అరెస్టులుచేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు బండారి ప్రశాంత్ మాట్లాడుతూ
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (HCU) భూములను కాపాడేందుకు పోరాడుతున్న విద్యార్థులను ముందస్తుగా అరెస్టు చేయడం దారుణమన్నారు.
క్యాంపస్‌లో 400 ఎకరాల భూమిని ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం దారుణమని ఇందిరమ్మ పాలనలో ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచిందని ఆరోపించారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులపై దమనకాండ ఆపాలని
HCU భూములను రక్షించాలన్నారు.
విద్యార్థుల గొంతును నొక్కాలని చూస్తే, తెలంగాణలో ఆత్మగౌరవ ఉద్యమం మరింత మిన్నంటుతుంది! రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి యువత ఏకమై ప్రభుత్వంపై ప్రతిఘటన తప్పదు అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలంపాట సరికాదు.

సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలంపాట సరికాదు

నర్సంపేట,నేటిధాత్రి:

 

రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైదారాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను వేలంపాట వేయడం సరికాదని ఎబిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్ ఆరోపించారు.

నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణంలో ఏబిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించగా అనంతరం నరేష్ మాట్లాడుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని ప్రభుత్వం వేలం పాట ద్వారా అమ్మే ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.

యూనివర్సిటీ అభివృద్ధి కోసం పని చేయవలసిన రాష్ట్ర ప్రభుత్వం, యూనివర్సిటీ భూములు అమ్మి విద్యార్థులకు నష్టం జరిగే విధంగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు.

యూనివర్సిటీ భూమి రక్షించుకునేందుకు విద్యార్థి నాయకులు ధర్నాలు నిర్వహిస్తున్న క్రమంలో విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేసి, రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేయడం సరికాదని అవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తక్షణమే వెనక్కి తీసుకొని సెంట్రల్ యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఈశ్వర్, రాజేష్ చింటూ, నాగరాజ్, ప్రమోద్, వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

కృష్ణవేణి టాలెంట్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు.

అంగరంగ వైభవంగా.కృష్ణవేణి టాలెంట్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు*

 

రాయికల్ నేటి ధాత్రి. ఏప్రిల్ రాయికల్.పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ “విరించి-2025″వార్షికోత్సవ వేడుకలను గురువారం ఆర్ఆర్ కన్వెన్షన్ హాల్లో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ జూపల్లి వేణుగోపాల్ రావు మాట్లాడుతూ….. పాఠశాలల్లో వార్షికోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం వలన విద్యార్థులలోని ప్రతిభ పాటవాలు వెలికి తీయడానికి దోహదపడతాయని అన్నారు.విద్యార్థులు చదువుతోపాటు ఆటపాటల్లో రాణించాలన్నారు. విద్యార్థుల చదువు విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా చదువుపై దృష్టి పెట్టి భవిష్యత్తులో ఉన్న శిఖరాలను అధిరోహించాలని,సోషల్ మీడియాలకు బానిసలు కాకుండా తగు జాగ్రత్తతో వ్యవహరించాలని సూచించారు.విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలన్న ఉన్నత స్థాయిలో స్థిరపడాలన్న ఉపాధ్యాయులు చెప్పే పాఠాలతో పాటు తల్లిదండ్రుల పెంపకం చాలా ముఖ్యమని అన్నారు.వార్షికోత్సవ కార్యక్రమంలో విద్యార్థులు పలు సందేశాత్మకమైన సాంస్కృతిక కార్యక్రమాలు, డ్యాన్సులు,కరాటే,పౌరాణిక దేశభక్తి నృత్యాలతో పలువురిని అబ్బురపరిచారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ జూపల్లి వేణుగోపాల్ రావు,డైరెక్టర్ జూపల్లి తిరుపతిరావు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

గురుకుల ఫలితాల్లో రిషిత ప్రతిభ.

గురుకుల ఫలితాల్లో రిషిత ప్రతిభ

రాష్ట్ర స్థాయిలో 3521 ర్యాంకు

పలువురి అభినందనలు

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన గురుకుల ఫలితాల్లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు చెందిన దూడపాక లావణ్యశంకర్ చిన్న కుమార్తె రిషిత రాష్ట స్థాయిలో ప్రతిభ కనబర్చింది. గత ప్రిభవరి 23న జరిగిన గురుకుల 5వ తరగతి ప్రవేశ పరీక్షకు 52,314 మంది హాజరు కాగా శనివారం ప్రకటించిన ఫలితాల్లో రిషిత రాష్టా స్థాయిలో 3521 ర్యాంకు సాధించింది.ఈ సందర్భంగా ఆమె తల్లిదండ్రులు,పాఠశాల యాజమాన్యం,కాలనీ వాసులు అభినందనలు తెలియజేశారు.

విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం సరి కాదు..

విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం సరి కాదు..

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం లాఠీ ఛార్జ్ చేయడానికి భారతీయ జనతా యువమోర్చా(బిజేవైఎం) వ్యతిరేకించడం జరుగుతుంది. విశ్వవిద్యాలయం భూములను కాపాడుకోవాలి అదేవిధంగా పర్యావరణాన్ని మూగజీవాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న అమాయక విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం పట్ల బాధ్యత వహిస్తూ ఈరోజు జహీరాబాద్ పట్టణం లో బిజేవైఎం అధ్యారంలో దిష్టి బొమ్మ దహనం చేయడానికి వెళ్తున్న బిజేవైఎం నాయకులను ముందస్తుగా అక్రమ అరెస్ట్ చేయడం జరిగింది ఈకార్యక్రంలో సోమా అనిల్. నరేష్ పాటిల్ రూషబ్. నిఖిల్ యాదవ్ పాల్గొన్నారు రేవంత్ రెడ్డి తక్షణమే బహిర్గత క్షమాపణ చెప్పాలి అని బిజేవైఎం డిమాండ్ చేసింది.

బాలికల ఉన్నత పాఠశాలలో బాలల పుస్తక దినోత్సవం.

నేడు సిరిసిల్ల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో బాలల పుస్తక దినోత్సవం

సిరిసిల్ల టౌన్: (నేటి ధాత్రి )

 

 

సిరిసిల్ల పట్టణంలోని గీతా నగర్ లోని బాలల పుస్తక దినోత్సవం (Children’s Book Day) ప్రతి ఏడాది ఏప్రిల్ 2న జరుపుకుంటారు.

ఈ రోజు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల సిరిసిల్ల లో బాల చెలిమి గ్రంథాలయములో , చదవడం, గ్రంథాలయ ప్రాముఖ్యత గురించి చెప్పడం జరిగింది.

ఈ రోజు విద్యార్థులు చవిచూసి, కొత్త విషయాలను తెలుసుకోవడంలో ఆసక్తి పెంచేందుకు ఉద్దేశ్యమైంది.

అలాగే పుస్తకాలు చదివిన తరువాత కథ పై సమీక్షా రాయలని చెప్పడం జరిగింది.

Children’s

 

ఇది హాన్‌సా క్రిస్టియన్ ఆండర్సన్ యొక్క జయంతి సందర్భంగా, అతను పిల్లల కథలను రచించడం మరియు ప్రపంచవ్యాప్తంగా పిల్లలకు మంచి పుస్తకాలు అందించడం ద్వారా ప్రసిద్ధి చెందాడు.

ప్రధానోపాధ్యాయులు L. శారదా మాట్లాడుతూ ఈ రోజు పిల్లలు పుస్తకాల మధ్య ప్రయాణం చేస్తూ, కొత్త కథలు చదవడానికి, అక్షరాల మహిమను తెలుసుకునేందుకు ప్రేరణ పొందవచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమం లో బాల చెలిమి గ్రంధాలయం ఇంచార్జ్ ఎలగొండ రవి పాల్గొన్నారు.

కేంద్రీయ విద్యాలయ పాఠశాలకు బస్ సౌకర్యం ఏర్పాటు.

కేంద్రీయ విద్యాలయ పాఠశాలకు బస్ సౌకర్యం ఏర్పాటు

 

సిరిసిల్ల టౌన్  (నేటి ధాత్రి)

 

సిరిసిల్ల పట్టణంలో నిర్వహిస్తున్న కేంద్రీయ విద్యాలయ పాఠశాల(కేవీ స్కూల్)ని తంగళ్లపల్లి మండలం లోని పద్మనగర్ లో గల సొంత భవనంలోకి మార్చాగ విద్యార్థుల తల్లిదండ్రుల కోరిక మేరకు మంగళవారం రోజున సిరిసిల్ల కొత్త బస్టాండ్ నుండి బస్ ని సిరిసిల్ల డిపో మేనేజర్ ప్రకాష్ రావు కొబ్బరికాయ కొట్టి బస్ ని ప్రారంబించారు..సుమారు 180 మంది విద్యార్థులు సిరిసిల్ల పట్టణం నుండి విద్యాభ్యాసం కోసం కేవీ స్కూల్ కి వెళ్లనున్నారు.. ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ విద్యార్థులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఆర్.టి.సి ని లాభాల్లోకి తీసుకురావాలని కోరారు..విద్యార్థుల కోసం మరో బస్ ని కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి రోజు ఈ బస్ ఉదయం 7:30 నిమిషాలకి కొత్త బస్ స్టాండ్ నుండి ప్రారంభం అయ్యి పాత బస్టాండ్,గాంధీ చౌక్,పోలీస్ స్టేషన్ వద్ద విద్యార్థులను ఎక్కించుకొని వెళ్తుందని తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు డిపో మేనేజర్ ని శాలువాతో సత్కరించారు.. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సూపర్ వైజర్ వర్జిలాల్, కంట్రోలర్ రామ్ రెడ్డి, కార్గో డి.ఎం. ఈ శేఖర్ రావు, ఆర్. టి. సి సిబ్బంది మరియు విద్యార్థుల తల్లి దండ్రులు పెద్ది నవీన్ కుమార్,బండరాజు, కొండికొప్పుల రవి , తడుకల సురేష్,శ్రీనివాస్,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు

ముందస్తు విద్యార్థుల నమోదు కార్యక్రమం.

ముందస్తు విద్యార్థుల నమోదు కార్యక్రమం

పాఠశాల ప్రధానోపాధ్యాయులు తాటికొండ వీరస్వామి

కమలాపూర్, నేటిధాత్రి :

 

రాబోయే విద్యా సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకొని కమలాపూర్ మండలం భీంపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ బృందం ముందస్తుగా విద్యార్థుల నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించింది.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తాటికొండ వీరస్వామి మాట్లాడుతూ విద్యా సంవత్సరం చివర్లోనే తల్లిదండ్రులు,యువత, ప్రజాప్రతినిధులను కలవడం ద్వారా ముందుగా బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తే,వచ్చే ఏడాది విద్యార్థుల ప్రవేశాలు పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు.అందుకే ఈ కార్యక్రమాన్ని ముందుగా చేపట్టామన్నారు.పాఠశాల అందిస్తున్న సౌకర్యాలను వివరించేందుకు,అలాగే ఉపాధ్యాయ బృందం విద్యార్హతలను తెలియజేయడానికి ప్రత్యేక కరపత్రాన్ని ముద్రించి మండల విద్యాశాఖ అధికారిచే ఆవిష్కరించారు.గత వారం రోజులుగా ఉపాధ్యాయ బృందం గ్రామంలోని వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ, గ్రామ పెద్దలు,తల్లిదండ్రులు, యువతతో సమావేశమై, వారికి కరపత్రాలను అందజేస్తూ,తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందించేందుకు గట్టి పునాది వేస్తామనే నమ్మకాన్ని తల్లిదండ్రుల్లో కల్పిస్తున్నారు.తల్లిదండ్రులు సానుకూలంగా స్పందించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు సిద్దంగా ఉన్నారని తెలిపారు. త్వరలోనే బడి ఈడు పిల్లల తల్లిదండ్రులతో ఉపాధ్యాయ బృందం సమావేశం నిర్వహించనుందని తెలిపారు.ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఇలాంటి కార్యక్రమాలు మార్గదర్శకమని మండల విద్యాశాఖ అధికారి అభిప్రాయపడ్డారు.భీంపల్లి పాఠశాల ఉపాధ్యాయ బృందాన్ని మండల విద్యాశాఖ అధికారి శ్రీధర్,కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు వాణి అభినందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాలఉపాధ్యాయులు ఎన్. ప్రభాకర్ రెడ్డి,బి.జోత్స్న, కె.సుజాత అంగన్వాడీ టీచర్ ఏ.వరలక్ష్మి,ప్రీ ప్రైమరి టీచర్ కె.పూజిత,తదితరులు పాల్గొన్నారు.

అస్తవ్యస్తంగా సంగం(కె) ప్రాథమిక పాఠశాల.

అస్తవ్యస్తంగా సంగం(కె) ప్రాథమిక పాఠశాల

◆ శిథిలావస్థలో మరుగుదొడ్లు,
◆ మూత్రశాలలు నిరుపయోగంగా వాటర్ ట్యాంక్ పాఠశాలలో లోపించిన పారిశుధ్యం

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

ఝరా సంగం మండలంలోని సంగం (కె) గ్రామంలో గల ప్రాథ మిక పాఠశాల అస్తవ్యస్తంగా మారింది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలు చేపడుతున్నప్పటికీ ఈ పాఠశాల రూప రేఖలు మార్చలేకపోయాయి. ఈ పాఠశాల ఆవరణలో ఉన్న మరు గుదొడ్లు, మూత్రశాలలు శిథిలావస్థలో ఉండటంతో విద్యా ర్థులు ఉపయోగించుకోలేని పరిస్థితి నెలకొంది. ఈ శిథిలాలతో విద్యార్థులకు ప్రమాదం పొంచి ఉన్న వాటిని తొలగించడం లేదు. అలాగే నీటి సరఫరా కోసం ఏర్పాటు
చేసిన వాటర్ ట్యాంక్ రంధ్రాలు పడి నిరుపయోగంగా మారింది. ఈ పాఠశాల చుట్టూ పూర్తిస్థాయిలో కాంపౌండ్ వాల్ లేనందున పశువులు లోపలికి వచ్చే అవకాశం ఉంది. పాఠశాల భవనానికి అక్కడక్కడ పెచ్చులు ఊడిపోయాయి. రంగులు వెలిసిపోయి భవనం కళ హీనంగా కనిపిస్తుంది. పాఠశాల పరిసర ప్రాంతాల్లో చెత్తాచెదారం నెలకొని పారి శుద్ధ్యం లోపించింది. ఈ పాఠశాలలో ఇంకా పలు సమ స్యలు నెలకొనడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతు న్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు విద్యాభివృద్ధికై పాఠశాలలో మౌలిక సదుపాయాల కోసం అవసరమైన నిధులు మంజూరు చేయాలని విద్యార్థినీ, విద్యార్థుల తల్లి దండ్రులు కోరుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version