ఒక్క ఓటుతో ఏమవుతుందనుకోకు – ప్రతి ఓటే ప్రజాస్వామ్యానికి పునాది..

ఒక్క ఓటుతో ఏమవుతుందనుకోకు – ప్రతి ఓటే ప్రజాస్వామ్యానికి పునాది!

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

ప్రజాస్వామ్యం ప్రజల చేతిలోనే ఉంటుంది.ఆ శక్తి ఓటు రూపంలో మనకు లభించింది. ఒక్క ఓటు విలువ లేదని అనుకోవడమే ప్రజాస్వామ్యానికి అతి పెద్ద నష్టం.అనేక ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతోనే విజయం లేదా ఓటమి నిర్ణయమైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మనం వేసే ఓటే నాయకులను నిర్ణయిస్తుంది.పాలన దిశను మార్చుతుంది.ఓటు హక్కు మనకు ఉచితంగా రాలేదు. ఎన్నో త్యాగాలు,పోరాటాల ఫలితంగా అది మనకు దక్కింది.అందుకే ఓటు వేయకపోవడం అంటే ఆ త్యాగాలను నిర్లక్ష్యం చేసినట్లే. నా ఒక్కరితో ఏమవుతుందిలే అనుకోవద్దు.ప్రతి ఒక్కరి ఓటు కలిసినప్పుడే బలమైన ప్రజాస్వామ్యం ఏర్పడుతుంది.కాబట్టి ప్రతి పౌరుడు బాధ్యతగా ముందుకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలి.ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు,మన కర్తవ్యమూ.నేడు వేసే ఒక్క ఓటే రేపటి మంచి భవిష్యత్తుకు పునాది గా మారుతుంది.

గ్రామాభివృద్ధికి యువతే దిక్సూచి

లక్ష్యం సర్పంచ్ అవ్వడం కాదు — ఊరి భవిష్యత్తు మార్చడం..

నేటి ధాత్రి కథలాపూర్

 

కౌన్సిల్ ఫర్ సిటిజెన్ రైట్స్ (పౌర మరియు మానవ హక్కుల సంస్థ రాష్ట్ర కార్యదర్శి తాలూకా మల్లేష్ మాట్లాడుతూ.

సర్పంచ్ అవ్వడం అంటే లంచాలు తీసుకోవడం కాదు,
సర్పంచ్ అవ్వడం అంటే ఊరి సమస్యలు పరిష్కరించడం.

సర్పంచ్ అవ్వడం అంటే ప్రజల్లో గొడవలు పెట్టి లాభం పొందడం కాదు ,.
అది ఊరిని కలిపి అభివృద్ధి దిశగా నడిపించడం * .

మంచి పాఠశాలలు కట్టించడం
హాస్పిటల్ నిర్మించడం
ప్రతి కుటుంబానికి ఇల్లు తెప్పించడం
ప్రతి ఇంటికి తాగునీరు, కొళాయిలు ఏర్పాటు చేయడం
ప్రజలకు కష్టసమయంలో అండగా నిలవడం — ఇదే నిజమైన సర్పంచ్ ధర్మం!

సర్పంచ్ అవ్వాలని కాదు — సేవ చేయాలని ఆలోచించాలి!
ప్రతి పనికి డబ్బు ఆశించే వారు ఊరిని ఎప్పుడూ అభివృద్ధి చేయలేరు.

*ఎలక్షన్ టైంలో సానుభూతి మాటలు, ప్రమాణాలు, కన్నీటి నాటకం చూపించే వారు,
ఊరి అభివృద్ధి కాదు — తమ స్వార్థాన్ని మాత్రమే కాపాడుతారు.*

యువత ముందుకు రావాలి!
స్వచ్ఛతతో, సేవా భావంతో, నిజాయితీతో ఉన్న యువతను
సర్పంచ్‌గా ఎన్నుకుంటే గ్రామం మారుతుంది!

లంచం లేని పాలన — యువతతోనే సాధ్యం!

> “ గ్రామం కోసం యువత — యువత కోసం గ్రామం”

అవినీతి అలవాటు పడ్డ వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ సర్పంచ్‌గా ఎన్నుకోవద్దు!
అటువంటి వారిని సపోర్ట్ చేసే వాళ్లను కూడా నమ్మకండి.
వారి మాయమాటలకు మోసపోవద్దు —
అటువంటి వ్యక్తుల చేత గ్రామ భవిష్యత్తు నాశనం అవుతుంది.

యువతనే ఆశ, యువతనే మార్పు!
యువతను గెలిపిద్దాం — మన ఊరి భవిష్యత్తును వెలిగిద్దాం!

భూపాలపల్లి గ్రామపంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు

గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి

భూపాలపల్లి నేటిధాత్రి

 

మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
బుధవారం ఐడిఓసి కార్యాలయపు సమావేశపు హాలులో మొదటి విడత గ్రామ పంచాయితీ ఎన్నికల నిర్వహణపై రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 27వ తేదీ ఉదయం 10.30 గంటల లోపు ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించి గ్రామ పంచాయతీ కార్యాలయం, గ్రామపంచాయతీ ప్రధాన కూడళ్లలో ప్రదర్శింపచేయాలని అన్నారు. అలాగే గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఓటరు జాబితా కూడా ప్రదర్శింపజేయాలని సూచించారు. నామినేషన్లు ప్రక్రియ ఉదయం 10:30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుందని ఈనెల 29వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించాలని తెలిపారు. 30వ తేదీన నామినేషన్లు పరీశీలన, డిసెంబర్ 1వ తేదీన అప్పీళ్లు, 2వ తేదీన డిస్పోజల్, 3వ తేదీన ఉపసంహరణ ఉంటుందని తెలిపారు. నామినేషన్లు స్వీకరణకు 25 మంది 25 రిటర్నింగ్ అధికారులను నియమించామని తెలిపారు.
ప్రతి రిటర్నింగ్ అధికారుల కేంద్రాల్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఒక వ్యక్తి గరిష్టంగా నాలుగు సెట్లు నామినేషన్ సెట్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు. నామినేషన్ లో ఖచ్చితంగా తేదీ, సమయం, క్రమ సంఖ్య నమోదు చేయాలని సూచించారు. నామినేషన్లలో అభ్యర్థి సంతకం, ధ్రువీకరణ ప్రతిపాదకుని సంతకం ఉండాలని తెలిపారు. మొదటి విడతలో 4 మండలాల్లోని 82 గ్రామపంచాయతీల పరిధిలోని 712 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారి విధులు చాలా కీలకమని ఎన్నికలపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.
అనంతరం మాస్టర్ ట్రైనర్లు ఎన్నికల విదులపై పవర్ పాయింట్ ద్వారా అవగహన కల్పించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ట్రైని డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి , డిపిఓ శ్రీలత ఎంపీడీవోలు, రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ జూబ్లీహిల్స్‌లో ఇంటింటికీ ప్రచారం…

తెలంగాణ సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ జూబ్లీహిల్స్‌లో ఇంటింటికీ ప్రచారం

◆:- సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్. గిర్ధర్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల దృష్ట్యా, తెలంగాణ సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్. గిర్ధర్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్మికులు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా ఇంటింటికీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం యొక్క సమగ్ర అభివృద్ధిని సాధించడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తుకు ఓటు వేయాలని మరియు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను భారీ మెజారిటీతో విజయవంతం చేయాలని ఆయన సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంతో సంబంధం ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డు…

ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డు

మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

రేగొండ మండలం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డును ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డును ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మాయ చేస్తున్న ఈ మాయ ప్రభుత్వానికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 22 నెలల్లో ఇప్పటి వరకు ఒక్కో వ్యక్తికి ఎంత బాకీ పడ్డాదో తెలియచేస్తూ రేగొండ మండలం రూపిరెడ్డిపల్లి, దమ్మన్నపేట గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్ళి బాకీ కార్డు పంపిణీ చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ వద్దకు వచ్చినప్పుడు మాకు ఇచ్చిన హామీలు ఎక్కడ అని ప్రశ్నించాలని కోరుతూ రేగొండ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ప్రచారం చేసిన బీఆర్ ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version