గ్రామాభివృద్ధికి కాంగ్రెస్ విజయం అవసరం
ఉల్లెంగల యాదగిరి స్పష్టం
నేటి ధాత్రి ఐనవోలు:
రాబోయే గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజలు తెలివైన నిర్ణయం తీసుకోవాలని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నేషనల్ జాయింట్ కోఆర్డినేటర్, మధ్యప్రదేశ్ ఇన్చార్జి ఉల్లెంగల యాదగిరి పిలుపునిచ్చారు.
గ్రామస్థాయిలో అభివృద్ధి జరగాలంటే అనుభవజ్ఞులు, ప్రజాభిమానాన్ని గెలుచుకున్న నాయకులు ముందుకు రావాలని పేర్కొన్న యాదగిరి,రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో 14వ తేదీన కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపిస్తే మాత్రమే గ్రామాలు మార్పు దిశగా అడుగులు వేస్తాయి” అని స్పష్టం చేశారు.
యాదగిరి నాయకత్వం – గ్రామాలకు భరోసా మాట
ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ, గడచిన కొన్ని రోజులుగా గ్రామాల్లో పర్యటించిన ఉల్లెంగల యాదగిరి ప్రతి ఇంటి సమస్యను విన్నారు. గ్రామ ప్రజలను ఉద్దేశించి ఆయన ఇలా అన్నారు.తాగునీరు అందుబాటులోకి రావాలి.గ్రామీణ విద్యా వ్యవస్థ బలపడాలి. ఉద్యోగావకాశాలు పెరిగే విధానాలు రావాలి.మురికినీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం అవసరం.ఎలక్ట్రిసిటీ సమస్యలు పూర్తిగా తొలగాలి.గ్రామీణ రహదారులు, పంచాయతీ భవనాలు అభివృద్ధి చెందాలి.”ఈ పనులు చేయగలిగేది కేవలం ప్రజలు ఎన్నుకున్న శక్తివంతమైన సర్పంచులు మాత్రమేనని, అందుకోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడం తప్ప ప్రజలకు మరో మార్గం లేదని ఆయన స్పష్టం చేశారు.
ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ – యాదగిరి దృఢసంకల్పం
“గ్రామం అభివృద్ధి చెందాలి అంటే నాయకులు కాదు… ప్రజలే ముందుకు రావాలి.
ప్రజలు ఓటుతో ఇచ్చే తీర్పే పాలనను మార్చగల శక్తి” అని యాదగిరి పేర్కొన్నారు.
గ్రామాభివృద్ధి, ప్రజల పురోగతి, భవిష్యత్తు తరాలకు మంచి గ్రామం నిర్మించాలనే లక్ష్యంతో, కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండి. అభివృద్ధిని కాంగ్రెస్ హామీ ఇస్తుంది, అని ఉల్లెంగల యాదగిరి ప్రజలను కోరారు.
