మళ్లీ టిఆర్ఎస్గా..! కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
మంచిర్యాల,నేటి ధాత్రి:
బీఆర్ఎస్ను మళ్లీ టిఆర్ఎస్గా మార్పు గురించి పరిశీలిస్తామని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు.మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో మీడియాతో ఆయన చిట్చాట్ నిర్వహించారు.తమకు పొత్తులతో కలిసిరాదని,అటువంటివి కుదరవని వ్యాఖ్యానించారు. గతంలో తాము కూడా కొన్ని తప్పులు చేశామని,లోపాలను సరిదిద్దుకుంటామని చెప్పారు.అన్ని పథకాల్లో కాంగ్రెస్ విఫలమైందని విమర్శించారు. ఈసారి తామే అధికారంలోకి వస్తామని,కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు.
