దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి…

దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి.

కల్వకుర్తి / నేటి ధాత్రి :

కల్వకుర్తి మంగళవారం కార్మికులంతా ఏకమై దేశ వ్యాప్త సమ్మెను తెలంగాణ కేంద్ర.రాష్ట్ర కార్మిక సంఘాల ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా కల్వకుర్తి T U C I శాఖ
1.నాలుగు లేబర్ కోడ్ ల రద్దు క్తె పోరాడుదాం.
2.పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కాపాడుకుందాం.
3. ఫిబ్రవరి 12వ జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె.
4. కనీస వేతనం 26 వేల ఉండాలి.
5. విద్యుత్ సవరణ చట్టం 2025 విబిజి రామ్ జీ చట్టం రద్దు చేయాలి దేశ వ్యాప్త సమ్మె జయప్రదం చేయాలి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు వెంకటేష్ ముఖ్యఅతిథిగా పాల్గొనడం జరిగింది ఆయన మాట్లాడుతూ చట్టాల గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆంజనేయులు తాలూకా అధ్యక్షుడు సాయిబాబు, ఉపాధ్యక్షులు మౌలాలి, కోశాధికారి మల్లేష్,కార్యవర్గ సభ్యులు వెంకటయ్య,వెంకటేష్,శీను, బాల్ చంద్రి తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్తో..సెప్టెంబర్ 22న చలో హైదరాబాద్.

ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్తో..సెప్టెంబర్ 22న చలో హైదరాబాద్.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

 

 

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని తెలంగాణ ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ (టి యు సి ఐ) ఆధ్వర్యంలో కేజీ బీవీ హాస్టల్ వర్కర్స్ సమస్యలపై ఛలో హైదరాబాద్ సెప్టెంబర్ 22న ఉద్యోగ భద్రత కల్పించాలని , పిఎఫ్ ఈఎస్ఐ గ్రాటివీటి చట్టాలు అమలు చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని విద్యార్థుల సంఖ్య కనుగుణంగా వర్కర్ల ఉద్యోగుల సంఖ్య పెంచాలని డిమాండ్తో చలో హైదరాబాద్ కార్యక్రమానికి అధికంగా కదిలి రావాలని చారకొండ, వంగూరు, వెల్దండ, ఊరకుండా,కల్వకుర్తి హాస్టల్లో కరపత్రల పోస్టర్ ద్వారా ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టియుసిఐ జిల్లా నాయకులు ఆంజనేయులు, పద్మ, శ్రీలత,బికినీ లక్ష్మి,జయ,శివ లీల తదితరులు పాల్గొన్నారు.

టీయూసీఐ మహాసభను జయప్రదం చేయాలి

*గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :*

ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసీఐ గుండాల ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 16న కొత్తగూడెం లో జరుగు టీయూ సీఐ జిల్లా మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ శుక్రవారం పెట్రోల్ బంక్ ఆటో అడ్డల మీద ప్రచారం నిర్వహించారు. అనంతరం గుండాల ఏరియా అధ్యక్షలు గడ్డం, రమేష్, కార్యదర్శులు, కొమరం, శాంతయ్య,పాల్గొని మాట్లాడుతూ మహాసభను జయప్రదం చేయాలని గుండాల ఏరియా పరిధిలో చేస్తున్న అసంఘటితంగా కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బొంబాయి రమేషు,కోడూరు జగన్, మొక్క, నరీ, పెండకట్ల, రాంబాబు, సాయం, రమేష్, గడ్డం, సుధాకర్, పాయం, నరేష్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version