దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి: కార్మిక సంఘాలు

దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి
.
కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె నోటీసులు

నర్సంపేట, నేటిధాత్రి:

కార్మిక చట్టాల సవరణను వ్యతిరేకిస్తూ కార్మికులకు నష్టం జరిగే నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 12 న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలని బుధవారం అఖిలపక్ష కార్మిక సంఘాలైన బిఆర్టియు,ఏఐటియుసి, ఐఎఫ్టియు, మాస్ లైన్ ఐఎఫ్టియు సంఘాల ఆధ్వర్యంలో నర్సంపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పాలయి శ్రీనివాస్, కమిటీ కార్యదర్శి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా నాయకులు సింగరకొండ మాధవ శంకర్ లకు సమ్మె నోటీసులు అందజేశారు.ఈసందర్భంగా బి.ఆర్.టి.యు జిల్లా అధ్యక్షుడు గోనే యువరాజు,హమలీ రాష్ట్ర కార్యదర్శి కొల్లూరి లక్ష్మీనారాయణ.ఏ ఐ టి యు సి సివిల్ సప్లై రాష్ట్ర నాయకులు గుంపెల్లి మునీశ్వర్,ఐ ఎఫ్ టి యు జిల్లా కార్యదర్శి ఎలకంటి రాజేందర్ మాట్లాడుతూ దేశంలో ఉన్న బడా కార్పోరేట్ శక్తులు దోపిడీ చేసుకోవడానికి కార్మిక చట్టాలు అడ్డుగా ఉన్నాయని సాకుతో కేంద్ర ప్రభుత్వంతో మికకత్ ఆయ్యి కార్మిక చట్టాల సవరణ చేయడం సరికాదని ఆరోపించారు.కార్మిక వర్గం ఒకటై ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పెరమండ్ల రవి, రాములు, జనార్ధన్, ప్రసాద్, మల్లయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి…

దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి.

కల్వకుర్తి / నేటి ధాత్రి :

కల్వకుర్తి మంగళవారం కార్మికులంతా ఏకమై దేశ వ్యాప్త సమ్మెను తెలంగాణ కేంద్ర.రాష్ట్ర కార్మిక సంఘాల ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా కల్వకుర్తి T U C I శాఖ
1.నాలుగు లేబర్ కోడ్ ల రద్దు క్తె పోరాడుదాం.
2.పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కాపాడుకుందాం.
3. ఫిబ్రవరి 12వ జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె.
4. కనీస వేతనం 26 వేల ఉండాలి.
5. విద్యుత్ సవరణ చట్టం 2025 విబిజి రామ్ జీ చట్టం రద్దు చేయాలి దేశ వ్యాప్త సమ్మె జయప్రదం చేయాలి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు వెంకటేష్ ముఖ్యఅతిథిగా పాల్గొనడం జరిగింది ఆయన మాట్లాడుతూ చట్టాల గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆంజనేయులు తాలూకా అధ్యక్షుడు సాయిబాబు, ఉపాధ్యక్షులు మౌలాలి, కోశాధికారి మల్లేష్,కార్యవర్గ సభ్యులు వెంకటయ్య,వెంకటేష్,శీను, బాల్ చంద్రి తదితరులు పాల్గొన్నారు.

నూతన సంవత్సరo కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలి…

నూతన సంవత్సరo కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలి

ఏఐఎఫ్ఎఫ్టియు రాష్ట్ర నాయకులు చంద్రగిరి శంకర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

నూతన సంవత్సరం సందర్భంగా కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలని ఏఐఎఫ్ఎఫ్టియు రాష్ట్ర నాయకులు చంద్రగిరి శంకర్ సింగరేణి కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సింగరేణి కార్మికులకు అన్ని రాజకీయ పార్టీలకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నామని, ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని నూతన ఉత్తేజంతో ప్రతి ఒక్కరు జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు.కార్మికుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం తాము పనిచేస్తామని ,ఏఐఎఫ్ఎఫ్టియు తరుపున కార్మికుల పక్షాన నిరంతరం పోరాడుతామని ఆయన తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version