భూపాలపల్లి గ్రామపంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు

గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి

భూపాలపల్లి నేటిధాత్రి

 

మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
బుధవారం ఐడిఓసి కార్యాలయపు సమావేశపు హాలులో మొదటి విడత గ్రామ పంచాయితీ ఎన్నికల నిర్వహణపై రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 27వ తేదీ ఉదయం 10.30 గంటల లోపు ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించి గ్రామ పంచాయతీ కార్యాలయం, గ్రామపంచాయతీ ప్రధాన కూడళ్లలో ప్రదర్శింపచేయాలని అన్నారు. అలాగే గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఓటరు జాబితా కూడా ప్రదర్శింపజేయాలని సూచించారు. నామినేషన్లు ప్రక్రియ ఉదయం 10:30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుందని ఈనెల 29వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించాలని తెలిపారు. 30వ తేదీన నామినేషన్లు పరీశీలన, డిసెంబర్ 1వ తేదీన అప్పీళ్లు, 2వ తేదీన డిస్పోజల్, 3వ తేదీన ఉపసంహరణ ఉంటుందని తెలిపారు. నామినేషన్లు స్వీకరణకు 25 మంది 25 రిటర్నింగ్ అధికారులను నియమించామని తెలిపారు.
ప్రతి రిటర్నింగ్ అధికారుల కేంద్రాల్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఒక వ్యక్తి గరిష్టంగా నాలుగు సెట్లు నామినేషన్ సెట్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు. నామినేషన్ లో ఖచ్చితంగా తేదీ, సమయం, క్రమ సంఖ్య నమోదు చేయాలని సూచించారు. నామినేషన్లలో అభ్యర్థి సంతకం, ధ్రువీకరణ ప్రతిపాదకుని సంతకం ఉండాలని తెలిపారు. మొదటి విడతలో 4 మండలాల్లోని 82 గ్రామపంచాయతీల పరిధిలోని 712 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారి విధులు చాలా కీలకమని ఎన్నికలపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.
అనంతరం మాస్టర్ ట్రైనర్లు ఎన్నికల విదులపై పవర్ పాయింట్ ద్వారా అవగహన కల్పించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ట్రైని డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి , డిపిఓ శ్రీలత ఎంపీడీవోలు, రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంత్రి కొండా సురేఖ స్వీకరించిన…

ప్రజల నుంచి విజ్ఞప్తులను వినతులను స్వీకరించిన మంత్రి కొండా సురేఖ

హన్మకొండ, నేటిధాత్రి:

అటవీ,పర్యావరణ,దేవాదాయ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి కొండా సురేఖ హనుమకొండ రామ్ నగర్ లో తమ నివాసంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని వివిధ వర్గాల ప్రజలు రాంనగర్ లోని తమ నివాసానికి చేరుకుని తమ సమస్యలను మంత్రి కొండా సురేఖకి విన్నవించారు. వారి సాధకబాధకాలను మంత్రి కొండా సురేఖ గారు సహృదయంతో విని సంబంధిత పలువురు అధికారులతో అప్పటికప్పుడే ఫోన్లో మాట్లాడి సమస్యలను పరిష్కరించారు. సులువుగా పరిష్కరించాల్సిన సమస్యల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను మంత్రి సురేఖ మందలించారు. మరోసారి బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించినట్లు తన దృష్టికి వస్తే కఠిన చర్యలకు వెనకాడనని మంత్రి సురేఖ వారికి స్పష్టం చేశారు.ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, ఏ సమస్యలున్నా ప్రజలు తనను సంప్రదించవచ్చునని కొండా సురేఖ ప్రజలకు స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారం దిశగా అధికారుల నుంచి సరైన స్పందన లేనిపక్షంలో తనకు తెలియజేయాలని వారికి సూచించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. బడుగు, బలహీన వర్గాలజీవితాల్లో వెలుగులు నింపేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నదని మంత్రి కొండా సురేఖ వారికి భరోసానిచ్చారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version