లారీల బ్యాటరీలను దొంగతనం చేస్తున్న దొంగలు
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి సింగరేణి బొగ్గు పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఇక్కడి బొగ్గును రవాణా చేయడానికి నిరుద్యోగ యువత చాలామంది ఉపాధి కొరకు లారీలను కొనుగోలు చేసి బొగ్గు రవాణాను వివిధ పరిశ్రమల ప్రాంతాలకు రవాణాచేయడానికి వాహనాలను కొనుగోలు చేశారు ఇది వారి కుటుంబాలకు ప్రధాన ఆదాయంగా మారడం జరిగింది.
చెక్ పోస్ట్, ఫైవ్ ఇంక్లైన్ కమాన్, ప్రధాన రోడ్డు ఇరువైపులా, మెకానిక్ షెడ్లలో వివిధ ప్రాంతాలలో పార్కింగ్ చేసి ఉన్నటువంటి లారీల నుండి లారీల బ్యాటరీలను, డీజిల్, గత రెండు సంవత్సరాల నుండి సుమారు 150 లారీల బ్యాట్లను దొంగిలించిన దొంగలు లారీ యజమానులను ఆర్థిక ఇబ్బందులు గురి చేసే దొంగలను
కొంతకాలం క్రితం పెట్రోలియం పోలీసులు, దొంగలను గుర్తించి చట్టపరంగా కేసులు నమోదు చేయడం జరిగింది.
ఈ ఆరు నెలలుగా స్తబ్దంగా ఉన్న దొంగలు తిరిగి రెచ్చిపోయి
వివిధ ప్రాంతాలలో పార్కింగ్ చేసిన లారీలకు డీజిల్ బ్యాటరీలను,దొంగలించి లారీ యజమాలను ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్న వారిని
పోలీసులు గుర్తించి చట్టపర చర్యలు తీసుకోవాల్సిందిగా పలువురు లారీ యజమానులు భూపాలపల్లి పోలీస్ వారిని కోరడం జరిగింది