తహశీల్దార్ కార్యాలయంలో ఏం జరుగుతుంది..?
పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ మహిళా జూనియర్ అసిస్టెంట్.
రాజకీయ నాయకుల ఒత్తిడే కారణమా..?
నల్లబెల్లి, నేటిధాత్రి:
రాజకీయ నాయకుల ఒత్తిడితోనా లేక అధికారుల వేధింపుల వల్ల మనోవేదనకు గురై పురుగు మందు తాగి ఆత్మహత్యనికి పాల్పడ్డ మహిళా జూనియర్ అసిస్టెంట్ సంఘటన నల్లబెల్లి మండలంలోని తాసిల్దార్ కార్యాలయంలో చోటుచేసుకుంది వివరాల్లోకి వెళ్తే నల్లబెల్లి తాసిల్దార్ కార్యాలయంలో జూనియర్
అసిస్టెంట్ గా పనిచేస్తున్న కల్పన సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆమె వెంట తెచ్చుకున్న పురుగుమందు తాగి ఆత్మహత్యనికి పాల్పడగా గమనించిన తోటి ఉద్యోగులు హుటా హుటిన మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై మండలంలో పలువురు పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ చర్చించుకుంటున్నారు. ఏది ఏమనప్పటికీ మండలంలోని వివిధ శాఖలో పనిచేస్తున్న అధికారులపై వేధింపులు చేస్తున్న వారిపై సమగ్ర విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.