మా అమ్మ, బిడ్డలు ఏడుస్తున్నా పట్టించుకోలేదు.

మా అమ్మ, బిడ్డలు ఏడుస్తున్నా పట్టించుకోలేదు..

శిరీష ఆవేదన

 

shine junior college

 

 

అప్పు తీరుస్తామని చెప్పినా వదల్లేదని బాధితురాలు శిరీష ఆవేదన వ్యక్తం చేశారు. కన్నప్ప కుటుంబ సభ్యులు.. తనను తీవ్రంగా కొట్టడంతో చెయ్యికి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయని శిరీష తెలిపారు.

 

చిత్తూరు, జూన్ 17: అప్పు కట్టలేదని మహిళను చెట్టుకు కట్టేసి హింసించిన ఘటన సంచలనం సృష్టించింది.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) కూడా సీరియస్‌ అయ్యాయి.
తాజాగా ఈ దారుణ ఘటనపై బాధితురాలు శిరీష స్పందిస్తూ.. తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
అప్పు తీర్చలేదని మహిళ అని చూడకుండా నడిరోడ్డుపై తాడుతో చెట్టుకు కట్టేశారంటూ శిరీష కన్నీరు పెట్టుకున్నారు.
తనకు ఇద్దరు ఆడ బిడ్డలు, ఒక మగ బిడ్డ ఉన్నారని తెలిపారు.
‘బెంగళూరు నుంచి నారాయణపురంలో నా బిడ్డ టీసీ కోసం గ్రామానికి వచ్చాను.
 టీసీ తీసుకుని పాఠశాల నుంచి బయటకు నడుచుకుంటూ వస్తుండగా అప్పు ఇచ్చిన కన్నప్ప కుటుంబ సభ్యులు ఎదురుపడి రూ.80,000 ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ కఠినంగా వ్యవహరించారు’ అని తెలిపారు.
పాఠశాల వద్ద నుంచి తనను లాక్కుని వచ్చి చెట్టుకు తాడుతో కట్టేశారన్నారు.
అప్పు తీరుస్తామని చెప్పినా వదల్లేదన్నారు. కన్నప్ప కుటుంబ సభ్యులు.. 
తనను తీవ్రంగా కొట్టారని ఆవేదన చెందారు.
కన్నప్ప కుటుంబ సభ్యుల దాడిలో తన చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు.
తన కళ్ళ ఎదుటే బిడ్డలు అమ్మా అంటూ ఏడుస్తున్నా పక్కకు లాగి పారేశారని కన్నీటి పర్యంతమయ్యారు.


దాదాపు గంటసేపు చెట్టుకు కట్టేసి ఇష్టానుసారంగా మాట్లాడారన్నారు.

‘మా అమ్మ, నా ముగ్గురు బిడ్డలు ఏడుస్తున్నా వారు పట్టించుకోలేదు’ అని తెలిపారు.
ఎవరో ఒక పెద్దాయన బుల్లెట్‌పై వచ్చి మహిళను అలా చేయకూడదని చెప్పినా వినలేదన్నారు.
కొంత మంది సహాయంతో కట్లు విప్పుకొని వచ్చేసినట్లు చెప్పారు.
ఈ వీడియో ఎవరు తీశారో తనకు తెలియదని..
మొత్తం వైరల్ అయిందన్నారు.
తన కట్లు విప్పేసిన తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశానని బాధితురాలు శిరీష చెప్పుకొచ్చారు.
కాగా.. చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో అమానుష ఘటన చోటు చేసుకుంది.
అప్పు కట్టాలంటూ శిరీష అనే మహిళను గ్రామానికి చెందిన మునికన్నప్ప, అతడి కుటుంబసభ్యులు చెట్టుకు కట్టేయడంతో పాటు దాడి చేశారు.
ఈ ఘటనను కొందరు వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
మరోవైపు ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సీరియస్ అయ్యారు.
మహిళను చెట్టుకు కట్టేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటివి పునరావృత్తం కాకుండా చూడాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

అండర్సన్‌ టెండూల్కర్‌ ట్రోఫీ ఆవిష్కరణ వాయిదా.

అండర్సన్‌ టెండూల్కర్‌ ట్రోఫీ ఆవిష్కరణ వాయిదా…

shine junior college

అహ్మదాబాద్‌ విమాన దుర్ఘటన నేపథ్యంలో అండర్సన్‌-టెండూల్కర్‌ ట్రోఫీ ఆవిష్కరణ వాయిదాపడింది. గతంలో. లండన్‌: అహ్మదాబాద్‌ విమాన దుర్ఘటన నేపథ్యంలో అండర్సన్‌-టెండూల్కర్‌ ట్రోఫీ ఆవిష్కరణ వాయిదాపడింది. గతంలో ఇంగ్లండ్‌-భారత్‌ మధ్య సిరీ్‌సను పటౌడీ ట్రోఫీగా వ్యవహరించేవారు. అయితే, ఇంగ్లండ్‌ బోర్డు ఆ పేరు మార్చి ఆధునిక దిగ్గజాలు అండర్సన్‌-టెండూల్కర్‌ పేరున ట్రోఫీని తీసుకురావాలనే నిర్ణయం తీసుకొంది. సిరీస్‌ ఆరంభమయ్యే ముందే ట్రోఫీ ఆవిష్కరణ జరుగుతుందని బీసీసీఐ తెలిపింది.

తండ్రిపై కుమార్తె రోకలి బండతో దాడి .

తండ్రిపై కుమార్తె రోకలి బండతో దాడి 

 

shine junior college

వ్యసనాలకు బానిసైన తండ్రి పుల్లెపు నర్సయ్య (54)తో కుమార్తె వర్షిత గొడవ పడింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ పెరిగి పెద్దదయింది. దీంతో ఆవేశంలో కుమార్తె కన్న తండ్రిపై రోకలి బండతో దాడి చేసి కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నర్సయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.

 

 

Nizamabad: రక్త సంబంధాలు రోజు రోజుకు కనుమరుగైపోతున్నాయి. ఆస్తులు, ఇంట్లో గొడవలు ఇలా రకరకాల కారణాలతో (Family Dispute) ఆయా కుటుంబసభ్యులు రక్తసంబంధాలనే మరిచిపోతున్నారు. దాడులు చేసుకుంటూ హత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా కన్నతండ్రిని కుమార్తె రోకలి బండతో కొట్టి చంపిన (Daughter kills father) విషాదకర సంఘటన నిజామాబాద్ జిల్లా (Nizamabad Dist), నవీపేట్ మండలం, ధర్మారం గ్రామంలో చోటుచేసుకుంది.

 

 

వ్యసనాలకు బానిసైన తండ్రి పుల్లెపు నర్సయ్య (54)తో కుమార్తె వర్షిత గొడవ పడింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ పెరిగి పెద్దదయింది. దీంతో ఆవేశంలో కుమార్తె కన్న తండ్రిపై రోకలి బండతో దాడి చేసి కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నర్సయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న నవీపేట్ ఎస్‌ఐ వినయ్ గ్రామానికి చేరుకొని ఈ సంఘటనపై విచారణ చేపట్టారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

 

మరోవైపు హైదరాబాద్ కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వ్యక్తి దుర్మరణం చెందాడు. డీమార్ట్ వద్ద వ్యక్తి నడిచి వెళుతుండగా అతి వేగంగా వచ్చిన వాహనం వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న కాచిగూడ సీఐ జోష్న మృతుడి వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కొడైకెనాల్‌ ‘గుణా’ గుహ వద్ద నోట్ల వర్షం కురిపించిన వానరం .

కొడైకెనాల్‌ ‘గుణా’ గుహ వద్ద నోట్ల వర్షం కురిపించిన వానరం

 

shine junior college

ప్రముఖ పర్యాటక ప్రాంతం కొడైకెనాల్‌ ‘గుణా’ గుహ వద్ద చెట్టుపై కూర్చుని ఓ వానరం ఐదువందల కరెన్సీ నోట్ల కట్ట పట్టుకుని ఒక్కో నోటు విసిరేసిన సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో తీవ్రంగా వైరల్‌ అవుతోంది.

 

చెన్నై: ప్రముఖ పర్యాటక ప్రాంతం కొడైకెనాల్‌(Kodaikanal) ‘గుణా’ గుహ వద్ద చెట్టుపై కూర్చుని ఓ వానరం ఐదువందల కరెన్సీ నోట్ల కట్ట పట్టుకుని ఒక్కో నోటు విసిరేసిన సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో తీవ్రంగా వైరల్‌ అవుతోంది. కొద్ది రోజుల క్రితం గుణా గుహను సందర్శించేందుకు వచ్చిన కర్ణాటకు చెందిన పర్యాటకుడి సంచిని ఓ వానరం లాక్కెళ్లింది. కాసేపయ్యాక ఆ వానరం ఓ చెట్టెక్కి సంచిలో ఉన్న రూ.500 నోట్ల కట్ట పట్టుకుని ఒక్కో నోటు కిందకు వేసింది.

దీనితో ఆ కర్ణాటక పర్యాటకుడు కింద పడిన నోట్లను ఏరుకోగా తక్కిన ప్రయాణికులు కూడా నోట్లను సేకరించి ఆయనకు అందజేశారు. అయితే ఆ వానరం విసిరేసిన నోట్లలో కొన్ని గుణా గుహలో పడ్డాయి. ఆ నోట్లను తీయడం కష్టమని తెలుసుకుని, కర్ణాటక(Karnataka) పర్యాటకుడు ఆ వానరం విసిరేసిన నోట్లన్నింటిని ఏరుకుని బయలుదేరాడు. ప్రస్తుతం ఆ వానరం చెట్టుపై నుంచి ఐదు వందల రూపాయల నోట్లను ఒక్కొక్కటిగా విసిరేస్తున్న వీడియోను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

కెనడియన్‌ గ్రాండ్‌ ప్రీ విజేత జార్జ్‌.

కెనడియన్‌ గ్రాండ్‌ ప్రీ విజేత జార్జ్‌

 

 

shine junior college

 

 

ఫార్ములావన్‌ స్టార్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌కు కెనడియన్‌ గ్రాండ్‌ ప్రీలో చుక్కెదురైంది. ఫైనల్‌ రేసులో వెర్‌స్టాపెన్‌కు షాకిస్తూ…

మాంట్రియల్‌: ఫార్ములావన్‌ స్టార్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌కు కెనడియన్‌ గ్రాండ్‌ ప్రీలో చుక్కెదురైంది. ఫైనల్‌ రేసులో వెర్‌స్టాపెన్‌కు షాకిస్తూ.. మెర్సిడెస్‌ డ్రైవర్‌ జార్జ్‌ రస్సెల్‌ చాంపియన్‌గా నిలిచాడు. మ్యాక్స్‌ రెండోస్థానానికి పరిమితమవగా.. మెర్సిడె్‌సకే చెందిన కిమి ఆంటోనెలి మూడోస్థానంతో పోడియం ఫినిష్‌ చేశాడు. బ్రిటన్‌కు చెందిన 27 ఏళ్ల జార్జ్‌కిది ఎఫ్‌-1 కెరీర్‌లో నాలుగో విజయం.

పూరి మూవీలో సంయుక్త

పూరి మూవీలో సంయుక్త

 

 

shine junior college

పూరి జగన్నాథ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించబోతున్న సినిమాలో విజయ్ సేతుపతి, టబు, దునియా విజయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడీ సినిమాలోకి తాజాగా సంయుక్త వచ్చి చేరింది.

 

 

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) తో ఓ సినిమాను నిర్మిస్తున్నారు. ఛార్మి (Charmy) నిర్మాణ భాగస్వామిగా ఉంటున్న ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చి చాలా రోజులే అయ్యింది. ఇందులో ఓ ప్రధాన పాత్రకు టబును తీసుకున్నట్టు చిత్ర బృందం గతంలోనే ప్రకటించింది. ఇప్పుడీ సినిమాలో మరో కీలక పాత్ర కోసం సంయుక్త మీనన్ తీసుకున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా చిత్ర బృందం ప్రకటించింది.

 

పూరి, విజయ్ సేతుపతి కాంబోలో రాబోతున్న పాన్ ఇండియా మూవీకి ‘బెగ్గర్’ అనే పేరు ఖరారు చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో ‘బెగ్గర్’ అనే పేరును కోలీవుడ్ వర్గాలు అంగీకరించవు కాబట్టి దాని బదులు ‘బిక్షాందేహి’ అనే టైటిల్ పెడితే మరింత బెటర్ గా ఉంటుందనే సలహా వచ్చిందట. చిత్రం ఏమంటే… తమిళులు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంగ్లీష్ టైటిల్ ను అయినా యాక్సెప్ట్ చేస్తారు కానీ సంస్కృత పదాన్ని తమ సినిమాకు పేరుగా ఎందుకు ఒప్పుకుంటారు? అని కొందరంటున్నారు. ఏతావాతా ఈ సినిమా టైటిల్ పై ఇంకా అనిశ్చిత పరిస్థితి నెలకొని ఉంది.

 

ఇదిలా ఉంటే… సంయుక్త మీనన్ తెలుగులో బాలకృష్ణ సరసన ‘అఖండ -2’ లో నటిస్తోంది. అలానే తన ప్రెజెంటర్ గా, దర్శకుడు యోగి తెరకెక్కిస్తున్న లేడీ ఓరియంటెడ్ మూవీలోనూ ఆమె నటిస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే మొదలైంది. యంగ్ హీరో నిఖిల్ హీరోగా నటిస్తున్న ‘స్వయంభూ’లోనూ సంయుక్త నాయికగా చేస్తోంది. ఇక పూరి జగన్నాథ్‌ స్వీయ దర్శకత్వంలో విజయ్ సేతుపతితో తీయబోతున్న సినిమాలో ‘దునియా’ విజయ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలాగే పూరి తనయుడు ఆకాశ్ కూడా ఓ కీ-రోల్ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంలో అశ్విన్‌

బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంలో అశ్విన్‌

 

shine junior college

భారత మాజీ ఆఫ్‌ స్పిన్నర్‌ ఆర్‌.అశ్విన్‌ మరో వివాదంలో చిక్కుకున్నాడు. గతవారం మహిళా అంపైర్‌తో గొడవకు దిగిన అతను తాజాగా…

 

కోయంబత్తూరు: భారత మాజీ ఆఫ్‌ స్పిన్నర్‌ ఆర్‌.అశ్విన్‌ మరో వివాదంలో చిక్కుకున్నాడు. గతవారం మహిళా అంపైర్‌తో గొడవకు దిగిన అతను తాజాగా బంతి స్వరూపాన్ని మార్చేందుకు ప్రయత్నించాడంటూ మధురై పాంథర్స్‌ జట్టు ఫిర్యాదు చేసింది. తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌ (టీఎన్‌పీఎల్‌)లో అశ్విన్‌ దుండిగల్‌ డ్రాగన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈనెల 14న ఇరుజట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ‘డ్రాగన్స్‌ జట్టు ఆటగాళ్లు రసాయనాల్లో ముంచిన టవళ్లతో బంతిని పదేపదే తుడిచారు. తద్వారా బంతి బరువును పెంచాలని చూశారు’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు ఇందుకు తగిన ఆధారాలను చూపడంలో మధుర జట్టు విఫలమైందని టీఎన్‌పీఎల్‌ ప్రకటించింది.

డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్‌కు ఘన స్వాగతం.

డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్‌కు ఘన స్వాగతం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

shine junior college

 

 

ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) రజతోత్సవంలో భాగంగా అమెరికాలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమెరికా నుండి తిరిగి స్వదేశానికి విచ్చేసిన సందర్భంగా, సంగారెడ్డి జిల్లా ఝ రా సంగం మండలం మెదపల్లి బీ ఆర్ఎస్ సీనియర్ నేత పరమేశ్వర్ పాటిల్ ఝరాసంగం మండల బీఆర్ఎస్ పార్టీ యువనాయకులు ఎస్.కె. షోయల్ ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మాజీ ఎంపీపీ విజయకుమార్, ఝరాసంగం మండల బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు మాణికప్రభు పాటిల్, యువ నాయకులు నవీన్ పాటిల్ శివకుమార్, సంగారెడ్డి జిల్లా వీరశైవ లింగాయత్ యువజన సంయుక్త కార్యదర్శి పోలీస్ ప్రవీణ్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

నేడు జట్టుతో చేరనున్న గంభీర్‌

నేడు జట్టుతో చేరనున్న గంభీర్‌

 

 

shine junior college
భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ గౌతం గంభీర్‌ మంగళవారం జట్టుతో చేరనున్నాడు. తల్లి సీమా గంభీర్‌ గుండెపోటుకు గురైనందున…

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ గౌతం గంభీర్‌ మంగళవారం జట్టుతో చేరనున్నాడు. తల్లి సీమా గంభీర్‌ గుండెపోటుకు గురైనందున అతడు ఈనెల 12న స్వదేశానికి వచ్చాడు. గౌతీ తల్లి ఐసీయూలో చికిత్స పొందుతున్నప్పటికీ..ఆమె ఆరోగ్యం మెరుగైందని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం కెంట్‌లో ఉన్న భారత జట్టు శుక్రవారం నుంచి ఇంగ్లండ్‌తో జరిగే తొలి టెస్టు కోసం మంగళవారం హెడింగ్లీకి బయల్దేరి వెళ్లనుంది.

ఆర్చరీలో తెలుగమ్మాయి రెండు ప్రపంచ రికార్డులు.

ఆర్చరీలో తెలుగమ్మాయి రెండు ప్రపంచ రికార్డులు

 

shine junior college

 

సింగపూర్‌లో జరుగుతున్న ఆసియాకప్‌ స్టేజ్‌ 2 అండర్‌-21 ఆర్చరీ ర్యాంకింగ్‌ రౌండ్‌లో ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారిణి బుద్ధె షణ్ముఖి నాగసాయి…

విజయవాడ స్పోర్ట్స్‌: సింగపూర్‌లో జరుగుతున్న ఆసియాకప్‌ స్టేజ్‌ 2 అండర్‌-21 ఆర్చరీ ర్యాంకింగ్‌ రౌండ్‌లో ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారిణి బుద్ధె షణ్ముఖి నాగసాయి రెండు ప్రపంచ రికార్డులు నెలకొల్పింది. 50 మీటర్ల కాంపౌండ్‌ మహిళల టీమ్‌ ఈవెంట్‌లో షణ్ముఖి, తేజల్‌ సాల్వే, తనిష్కలతో కూడిన భారత జట్టు 2101 పాయింట్లు స్కోరుచేసి వరల్డ్‌ రికార్డు సాధించింది. ఈ క్రమంలో 2076 పాయింట్ల రికార్డును అధిగమించింది. ఇక మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో షణ్ముఖి, కుషాల్‌ దలాల్‌ ద్వయం 1420 పాయింట్లు స్కోరు చేసి గత వరల్డ్‌ రికార్డు (1419)ను అధిగమించింది.

సచిన్‌ కాదు కోహ్లీతోనే కష్టం.

సచిన్‌ కాదు కోహ్లీతోనే కష్టం…

 

shine junior college

సచిన్‌ టెండూల్కర్‌తో పోల్చితే. కోహ్లీకి బౌలింగ్‌ చేయడం తనకు ఎంతో కష్టంగా అనిపించేదని ఇంగ్లండ్‌ మాజీ పేసర్‌ జిమ్మీ అండర్సన్‌ చెప్పాడు. విరాట్‌ టెక్నిక్‌, పోరాటపటిమన.

లండన్‌: సచిన్‌ టెండూల్కర్‌తో పోల్చితే.. కోహ్లీకి బౌలింగ్‌ చేయడం తనకు ఎంతో కష్టంగా అనిపించేదని ఇంగ్లండ్‌ మాజీ పేసర్‌ జిమ్మీ అండర్సన్‌ చెప్పాడు. విరాట్‌ టెక్నిక్‌, పోరాటపటిమను కొనియాడాడు. కోహ్లీ, అండర్సన్‌ మధ్య వైరం ఎంతో ఆసక్తిగా ఉండేది. 36 ఇన్నింగ్స్‌లో ఏడుసార్లు విరాట్‌ను అండర్సన్‌ అవుట్‌ చేశాడు. ‘సచిన్‌తో పోల్చితే కోహ్లీ తత్వం భిన్నం. ఆరంభంలో విరాట్‌ను సులువుగానే అవుట్‌ చేసినా.. ఆ తర్వాత అతడిపై ఆధిపత్యం సాధించడం కష్టమైంది. దూకుడుగా ఉండే విరాట్‌.. దేనికైనా సై అన్నట్టుగా ఉంటాడ’ని అండర్సన్‌ చెప్పాడు. టెస్ట్‌లకు కోహ్లీ ఇటీవలే రిటైర్మెంట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

అవి చీకటి రోజులు.

అవి చీకటి రోజులు

 

shine junior college

 

 

లండన్‌: గత దేశవాళీ సీజన్‌లో పరుగుల వరద పారించిన కరుణ్‌ నాయర్‌కు ఎట్టకేలకు ఎనిమిది సంవత్సరాల విరామం తర్వాత జాతీయ జట్టులో చోటు లభించింది. ఈ నేపథ్యంలో…

న్యూఢిల్లీ: లండన్‌: గత దేశవాళీ సీజన్‌లో పరుగుల వరద పారించిన కరుణ్‌ నాయర్‌కు ఎట్టకేలకు ఎనిమిది సంవత్సరాల విరామం తర్వాత జాతీయ జట్టులో చోటు లభించింది. ఈ నేపథ్యంలో తన క్రికెట్‌ కెరీర్‌లో ఎత్తుపల్లాలను తలుచుకుంటూ 33 ఏళ్ల నాయర్‌ ఉద్వేగానికి గురయ్యాడు. ‘2022 ఏడాది చివరి రోజులు నా కెరీర్‌లో అత్యంత చీకటిమయం’ అని ఆర్‌.అశ్విన్‌ యూట్యూబ్‌ చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో నాయర్‌ తెలిపాడు. దేశవాళీ పోటీల్లో సత్తా చాటినా జాతీయ జట్టులో చోటు దక్కకపోవడంతో తీవ్ర ఆవేదనకు లోనైన కరుణ్‌.. ‘డియర్‌ క్రికెట్‌. నాకు మరో అవకాశం ఇవ్వు’ అంటూ 2022 డిసెంబరులో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం సంచలనం రేపింది. ‘గత రెండు మూడు సంవత్సరాలుగా నాకు అండగా నిలిచిన వారికి కృతజ్ఞతలు. ఈ సమయంలో ప్రతి క్షణం ఎంత విలువైనదో తెలుసుకున్నా. దాంతో ప్రతి రోజును కొత్తగా భావించా’ అని కరుణ్‌ తెలిపాడు. సెహ్వాగ్‌ తర్వాత టెస్ట్‌ల్లో త్రిశతకం బాదిన భారత క్రికెటర్‌గా రికార్డులకెక్కిన నాయర్‌ను 2018లో ఎలాంటి కారణం చూపకుండా టీమిండియానుంచి తప్పించడం గమనార్హం.

భారీ వర్షాలు.. 18 మంది మృతి

భారీ వర్షాలు.. 18 మంది మృతి

 

 

 

shine junior college

 

మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ వాతావరణ శాఖ జారీ చేసింది.

 

ముంబై, జూన్ 17: మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీటి కారణంగా 18 మంది మృ‌తి చెందారు. 65 మంది గాయపడ్డారు. ఈ మేరకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. భారీ వర్షాలు, రోడ్డు ప్రమాదాలు, పిడుగుపాటు, నీట మనిగి పోవడం కారణాల వల్ల ఈ మృతులు సంభవించాయని వివరించింది. రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని.. ఈ నేపథ్యంలో గత 24 గంటలుగా భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పింది.

 

రాజధాని ముంబై మహానగరంతోపాటు ముంబై శివారు ప్రాంతం, రత్నగిరి, సిందుదుర్గ్, రాయ్‌గఢ్ తదితర జిల్లాల్లో భారీగా వర్షం కురిసిందని తెలిపింది. మరోవైపు పశ్చిమ మహారాష్ట్రలోని అరంజ్ అలర్ట్‌ జారీ చేసినట్లు పేర్కొంది. అలాగే పుణె, కోల్హపూర్, సతారాతోపాటు రాయ్‌గఢ్ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. జూన్ 15 నుంచి 18వ తేదీ వరకు మహారాష్ట్రకు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక సహాయక చర్యలు కొనసాగుతోన్నాయి. అలాగే లోతట్టు ప్రాంతాల్లో.. నీట ముంపునకు గురైన వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇంకోవైపు భారీ వర్షాల కారణంగా ముంబై మహానగరంలో రహదారులపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

 

 

ఇక నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో 24 గంటల్లో గుజరాత్, విదర్భా, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలోని పలు ప్రాంతాల్లో విస్తరించనున్నాయని తెలిపింది. అలాగే పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బిహార్, తూర్పు ఉత్తరప్రదేశ్‌లో మరో మూడు రోజుల్లో ఇవి విస్తరిస్తాయని పేర్కొంది. అయితే ఈ మరణాలు జూన్ 1వ తేదీ నుంచి నేటి వరకు చోటు చేసుకున్నవని వివరించింది.

 

కేరళలో..

అదీకాక.. కేరళలో జూన్ 18 వరకు విస్తృతంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ చేసింది. దీంతో జిల్లా ఉన్నతాధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది.

 

న్యూఢిల్లీలో..

ఇక ఈ రోజు సాయంత్రం లేదా రాత్రికి దేశ రాజధాని న్యూఢిల్లీలో సైతం సాధారణ వర్షాలు లేకుంటే.. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని వివరించింది.

 

కర్ణాటకలో..

అలాగే కర్ణాటకలో సైతం భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది ఈ జూన్ మాసంలో సగటు కంటే 110 శాతం అధిక వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ విభాగం పేర్కొంది.

మళ్లీ వస్తున్న హనుమాన్‌ జంక్షన్‌.

మళ్లీ వస్తున్న హనుమాన్‌ జంక్షన్‌

 

 

shine junior college

 

అర్జున్‌, జగపతిబాబు, వేణు హీరోలుగా 2001లో వచ్చిన ‘హనుమాన్‌ జంక్షన్‌’ చిత్రం మళ్లీ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది…

అర్జున్‌, జగపతిబాబు, వేణు హీరోలుగా 2001లో వచ్చిన ‘హనుమాన్‌ జంక్షన్‌’ చిత్రం మళ్లీ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఎడిటర్‌ మోహన్‌ నిర్మించిన ఈ చిత్రంతోనే ఆయన తనయుడు మోహన్‌ రాజా దర్శకుడిగా పరిచయమయ్యారు. లయ, స్నేహ, విజయలక్ష్మి హీరోయిన్లుగా నటించిన ‘హనుమాన్‌ జంక్షన్‌’ చిత్రాన్ని ఈ నెల 28న మళ్లీ థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్స్‌ తక్కువగా వస్తున్న ప్రస్తుత తరుణంలో ‘హనుమాన్‌ జంక్షన్‌’ మళ్లీ తన మ్యాజిక్‌తో మెస్మరైజ్‌ చేస్తుందని దర్శకనిర్మాతలు చెప్పారు.

పెళ్లి పేరుతో నమ్మించి.. డబ్బు తీసుకుని వంచించి..

పెళ్లి పేరుతో నమ్మించి.. డబ్బు తీసుకుని వంచించి..

 

shine junior college

ఓ వివాహ వెబ్‌సైట్‌లో బిజినెన్‌ మ్యాన్‌గా పరిచయం చేసుకున్నాడు. కొన్నాళ్లకు పరిచయం ఆన్‌లైన్‌ నుంచి ఆఫ్‌లైన్‌కు మారింది. ఓ హోటల్‌లో అప్పుడప్పుడూ కలుసుకునేవారు. ఆమె నుంచి రూ.లక్షల్లో డబ్బు కూడా తీసుకున్నాడు.

 

ఓ వివాహ వెబ్‌సైట్‌(Website)లో బిజినెన్‌ మ్యాన్‌గా పరిచయం చేసుకున్నాడు. కొన్నాళ్లకు పరిచయం ఆన్‌లైన్‌ నుంచి ఆఫ్‌లైన్‌కు మారింది. ఓ హోటల్‌లో అప్పుడప్పుడూ కలుసుకునేవారు. ఆమె నుంచి రూ.లక్షల్లో డబ్బు కూడా తీసుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని, డబ్బు తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తే ఇద్దరూ కలిసి ఉన్నప్పటి వీడియోలు వైరల్‌ చేస్తానని మహిళను బెదిరించడంతో పాటు ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేశాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

 

 

నగరంలోని ఓ మహిళకు షాదీ డాట్‌ కామ్‌లో ముంబైకి చెందిన కల్ఫేష్‌ కక్కడ్‌తో 2022లో పరిచయం ఏర్పడింది. ఆమెతో పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అప్పుడప్పుడు నగరానికి వచ్చి ఆమెను కలిసేవాడు. జనవరి 23న కల్ఫేష్‌ నగరానికి వచ్చి బేగంపేట(Begumpet)లో ఉన్న ఓ హోటల్‌లో దిగి ఫోన్‌ చేయడంతో ఆమె అక్కడికి వెళ్లింది. తన వ్యాపార అభివృద్ధికి డబ్బు కావాలని కోరడంతో రెండు విడతలుగా రూ.24లక్షలు ఇచ్చింది.

 

 

ఆ తర్వాత ముఖం చాటేయడంతో తన డబ్బు తిరిగి ఇవ్వాలని, పెళ్లి చేసుకోవాలని పలుమార్లు ఆయనను ఫోన్‌లో నిలదీయడంతో మనం కలిసి ఉన్నప్పుడు తీసిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరించాడు. దీంతో బాధితురాలు ఈనెల 14న బేగంపేట పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

 

విభిన్న కథతో.

విభిన్న కథతో

 

shine junior college

 

‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన సుహాస్‌, శివానీ నగరం మరోసారి జంటగా తెరపై కనిపించనున్నారు. వీర్దిద్దరూ కలసి…

‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన సుహాస్‌, శివానీ నగరం మరోసారి జంటగా తెరపై కనిపించనున్నారు. వీర్దిద్దరూ కలసి నటించనున్న కొత్త చిత్రం సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. గోపీ అచ్చర ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. త్రిశూల్‌ విజనరీ స్టూడియోస్‌ బ్యానర్‌పై నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు. ముహూర్తం షాట్‌కు సత్యదేవ్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, నాగ్‌ అశ్విన్‌ క్లాప్‌ కొట్టారు. వంశీ నందిపాటి ఫస్ట్‌ షాట్‌కు దర్శకత్వం వహించారు. విభిన్న కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని మేకర్స్‌ తెలిపారు. షణ్ముఖ ప్రశాంత్‌ ఈ చిత్రానికి కథను అందించారు. 

డీసీఎంఎస్ చెర్మన్ శివకుమార్ గారికి ఘనంగా స్వాగతం.

ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చెర్మన్ శివకుమార్ గారికి ఘనంగా స్వాగతం పలికిన మెదపల్లి తాజా మాజీ సర్పంచ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

shine junior college

ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ గారు భారత రాష్ట సమితి రజతోత్సవం లో భాగంగా బి ఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు ఆదేశానుసారం అమెరికాలో జరిగిన రజతోత్సవంలో భాగంగా పాల్గొని తిరిగి స్వదేశానికి విచ్చేసిన సందర్భంగా మెదపల్లి తాజా మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ మరియు ,ఝరాసంగం మండల బి ఆర్ యస్ పార్టీ యువనాయకులు sk షోయల్ ఘనంగా స్వాగతం పలకడం జరిగింది .ఇట్టి కార్యక్రమం లో జహీరాబాద్ మాజీ ఎంపీపీ విజయకుమార్.
ఝరసంగం మండల బి ఆర్ యస్ పార్టీ ఉపాధ్యక్షులు మాణికప్రభు పాటిల్ .యువనాయకులు నవీన్ పాటిల్ శివకుమార్ .సంగారెడ్డి జిల్లా వీరశైవ లింగాయత్ యువజన సంయుక్త కార్యదర్శి పోలీస్ ప్రవీణ్ పాటిల్.తదితరులు పాల్గొన్నారు.

అర్ధాంతరంగా అమెరికాకు ట్రంప్

అర్ధాంతరంగా అమెరికాకు ట్రంప్

 

 

shine junior college

 

అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తన కెనడా పర్యటనను అర్ధాంతరంగా ముగించుకున్నారు. ఆయన అమెరికా బయలుదేరి వెళ్లనున్నారు.

కెనడా పర్యటనలో ఉన్న అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పర్యటనను కుదించుకున్నారు. జీ 7 సదస్సులో పాల్గొన్న ఆయన వెంటనే ఆమెరికాకు బయలుదేరేందుకు సమాయత్తమవుతున్నారు. అమెరికా చేరుకున్న వెంటనే భద్రతా మండలితో అత్యసవర సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు వైట్ హౌస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయన ఈ పర్యటనను కుదించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఈ యుద్ధం ముగించాలని ఇప్పటికే జీ 7 సదస్సులో పాల్గొన్న నేతలు పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే.
మరోవైపు.. అమెరికా రాగానే ట్రంప్ పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. భద్రతా సలహాదారులతో ఆయన అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. అందుకోసం వైట్‌హౌస సిచ్యుయేషన్ రూమ్‌లో సిద్ధంగా ఉండాలని భద్రతా మండలి అధికారులను ఆదేశించారు. ఇజ్రాయెల్, ఇరాన్ ఉద్రికత్తలకు సంబంధించి ట్రంప్ కీలక ప్రకటన లేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకోవైపు ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని పౌరులను వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అమెరికా సైతం ప్రత్యక్ష దాడులు జరిపే అవకాశముందని తెలుస్తోంది.

రెగ్యులర్‌ షూట్‌ షురూ.

రెగ్యులర్‌ షూట్‌ షురూ

 

shine junior college

 

 

రవితేజ కథానాయకుడిగా కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో ఇటీవలె ఓ చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ‘ఆర్‌టీ 76’ వర్కింగ్‌ టైటిల్‌…

రవితేజ కథానాయకుడిగా కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో ఇటీవలె ఓ చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ‘ఆర్‌టీ 76’ వర్కింగ్‌ టైటిల్‌. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. సోమవారం రెగ్యులర్‌ షూట్‌ను మొదలెట్టారు. హైదరాబాద్‌లో నిర్మించిన ఓ ప్రత్యేక సెట్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో రవితేజతో పాటు ఇతర తారాగణం పాల్గొంటున్నారు. ఇది రవితేజ మార్క్‌ కామెడీతో పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రంగా ఉండనుంది. ఇందులో ఆయన సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్‌. ఈ చిత్రానికి ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్‌, డీఓపీ: ప్రసాద్‌ మూరెళ్ల, సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో.

రైతు నేస్తం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా.

రైతు నేస్తం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా,

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

shine junior college

 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కోసం రూపొందించిన ‘రైతునేస్తం’ కార్యక్రమం సోమవారం సాయంత్రం 4 గంటలకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 566 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం కల్పించబడి ఉండగా, తాజాగా మరో 1,034 వేదికల్లో ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. ఈ కార్యక్రమాన్ని ఝరాసంగం మరియు కప్పుడ్ రైతు వేదిక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులు వీక్షించడం జరిగింది.

దీనిలో భాగంగా ప్రస్తుతం మండలానికి ఒక రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ఉండగా దీనికి అదనంగా తాజాగా మండలానికి మరో 2 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం కల్పించి ప్రతీ మంగళవారం నిర్వహించే రైతునేస్తం ద్వారా శాస్త్రవేత్తలతో ముఖాముఖి, ఆదర్శరైతుల అనుభవాలు, కొత్త పంటల సాంకేతికతపై చర్చలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు స్థానిక వ్యవసాయ అధికారి వెంకటేశ్ వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి సుధాకర్, మండల అధ్యక్షులు హన్మంతరావు పాటిల్,ఆలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ పటేల్ ఛైర్మన్ , పాక్స్ చైర్మన్ గౌస్ ఉద్దీన్, మాజీ ఎంపీపీ దేవదాస్, వ్యవసాయ విస్తరణ అధికారులు సుకుమార్, సంపత్ కుమార్, ఙ్ఞానం, రేణుక, వేదవతి భారతి, హరికృష్ణ, తాజా మాజీ ప్రజాప్రతినిధులు
శ్రీకాంత్ రెడ్డి, మల్ల రెడ్డి, ఆరిఫ్, శ్రీనివాస్ రెడ్డి, స్వామి,ఇతర రైతులు పాల్గొన్నారు..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version