ఆర్చరీలో తెలుగమ్మాయి రెండు ప్రపంచ రికార్డులు
సింగపూర్లో జరుగుతున్న ఆసియాకప్ స్టేజ్ 2 అండర్-21 ఆర్చరీ ర్యాంకింగ్ రౌండ్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి బుద్ధె షణ్ముఖి నాగసాయి…
విజయవాడ స్పోర్ట్స్: సింగపూర్లో జరుగుతున్న ఆసియాకప్ స్టేజ్ 2 అండర్-21 ఆర్చరీ ర్యాంకింగ్ రౌండ్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి బుద్ధె షణ్ముఖి నాగసాయి రెండు ప్రపంచ రికార్డులు నెలకొల్పింది. 50 మీటర్ల కాంపౌండ్ మహిళల టీమ్ ఈవెంట్లో షణ్ముఖి, తేజల్ సాల్వే, తనిష్కలతో కూడిన భారత జట్టు 2101 పాయింట్లు స్కోరుచేసి వరల్డ్ రికార్డు సాధించింది. ఈ క్రమంలో 2076 పాయింట్ల రికార్డును అధిగమించింది. ఇక మిక్స్డ్ టీమ్ విభాగంలో షణ్ముఖి, కుషాల్ దలాల్ ద్వయం 1420 పాయింట్లు స్కోరు చేసి గత వరల్డ్ రికార్డు (1419)ను అధిగమించింది.