రైతు నేస్తం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా.

రైతు నేస్తం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా,

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

shine junior college

 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కోసం రూపొందించిన ‘రైతునేస్తం’ కార్యక్రమం సోమవారం సాయంత్రం 4 గంటలకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 566 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం కల్పించబడి ఉండగా, తాజాగా మరో 1,034 వేదికల్లో ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. ఈ కార్యక్రమాన్ని ఝరాసంగం మరియు కప్పుడ్ రైతు వేదిక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులు వీక్షించడం జరిగింది.

దీనిలో భాగంగా ప్రస్తుతం మండలానికి ఒక రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ఉండగా దీనికి అదనంగా తాజాగా మండలానికి మరో 2 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం కల్పించి ప్రతీ మంగళవారం నిర్వహించే రైతునేస్తం ద్వారా శాస్త్రవేత్తలతో ముఖాముఖి, ఆదర్శరైతుల అనుభవాలు, కొత్త పంటల సాంకేతికతపై చర్చలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు స్థానిక వ్యవసాయ అధికారి వెంకటేశ్ వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి సుధాకర్, మండల అధ్యక్షులు హన్మంతరావు పాటిల్,ఆలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ పటేల్ ఛైర్మన్ , పాక్స్ చైర్మన్ గౌస్ ఉద్దీన్, మాజీ ఎంపీపీ దేవదాస్, వ్యవసాయ విస్తరణ అధికారులు సుకుమార్, సంపత్ కుమార్, ఙ్ఞానం, రేణుక, వేదవతి భారతి, హరికృష్ణ, తాజా మాజీ ప్రజాప్రతినిధులు
శ్రీకాంత్ రెడ్డి, మల్ల రెడ్డి, ఆరిఫ్, శ్రీనివాస్ రెడ్డి, స్వామి,ఇతర రైతులు పాల్గొన్నారు..

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version