ముగ్గుల‌ పోటీలలో విజేతలకు బహుమతులు.

ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్ లో పెద్ద ఎత్తున పోటీలు.

తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలలో ముగ్గుల పోటీలు ప్రత్యేక ఆకర్షణ.

సంక్రాంతి ముగ్గులకు ఎంతో ప్రత్యేకత. 

విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన బొంతు రామ్మోహన్.

ఉప్పల్, నేటిధాత్రి ప్రతినిధి: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలలో సంక్రాంతి పండుగ ఎంతో విశిష్టమైనదని జిహెచ్ఎంసి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. బుధవారం ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్ల లో మహిళలు ఎంతో అందంగా తీర్చిదిద్దిన రంగవళ్లులలో విజేతలైన వారికి బొంతు రామ్మోహన్ బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో సంక్రాంతి ముగ్గులకు ప్రత్యేకమైన విశిష్టత వుంటుందన్నారు.

సంక్రాంతి నిలబెట్టిన నాటి నుంచి కనుమ‌ పండుగ వరకు వాకిళ్ల నిండా ముగ్గులు వేయడం ఆనవాయితీ. పల్లెల్లో వాకిలిలో చిన్న స్థలం కూడా వదలకుండా ఊరంతా ముగ్గులతో నింపేస్తారు. ఇక బోగి, సంక్రాంతి, కనుమ రోజులలో ఆ సందడే వేరు. సంక్రాంతి రోజున తెలంగాణ పల్లెల్లో ఎద్దుల బండ్ల ఊరేగింపులు ఇప్పటికీ కొనసాగుతుంటాయి. కనుమ పండగ రోజున కాటమయ్యకు పూజలు చేసి, పశువులను కొలవడం ద్వారా పాడి..పంటలకు లోటుండదు. అనాదిగా వస్తున్న ఆచారాకు ఆరోగ్యాలకు ప్రతీకలు. ఈ సంక్రాంతి పండుగ తెలంగాణ ప్రజలందరూ ఆనందంగా జరుపుకోవాలని బొంతు రామ్మోహన్ కోరారు. ముగ్గుల పోటీలలో విజేతలైన మహిళలకు బొంతు రామ్మోహన్ అభినందనలు తెలిపారు. అనంతరం బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్స్ బన్నలా గీత ప్రవీణ్, బొంతు శ్రీదేవి యాదవ్, మాజీ కార్పొరేటర్లు గొళ్ళూరి అంజయ్య , మేకల అనల హనుమంత రెడ్డి, గంధం జ్యోత్స్న నాగేశ్వరరావు , నందికొండ శ్రీనివాస్ రెడ్డి , మేకల మధుసూదన్ రెడ్డి, గజ్జెల సత్యరాజ్ గౌడ్ , గ్యార ఉపేందర్, కాయ హనుమంతు, బుత్కురి నవీన్ గౌడ్, జహంగీర్ గౌడ్, శివ, జాన్, అల్ల బాషా, మొహమూద్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *