జైపూర్ పోలీసుల రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం

రోడ్డు భద్రతపై ప్రయాణికులకు అవగాహన

జైపూర్,నేటి ధాత్రి:

 

రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని జైపూర్ పోలీసులు పేర్కొన్నారు.శనివారం స్థానిక పిఎస్ పరిధిలో వాహనదారులకు అవగాహన కల్పిస్తూ రోడ్డు భద్రతా నియమాల కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ హబీబ్ మాట్లాడుతూ ఈ నెల 01 వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన భద్రతా నియమాలను వివిధ పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేపట్టినట్లు తెలిపారు.ద్విచక్ర వాహనదారులు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని,కార్ల వాహనదారులు సీటు బెల్ట్ ధరించాలని,పిల్లలకు వాహనాలు నడిపేందుకు ఇవ్వకూడదని,వాహనాలకు సంబంధించిన పత్రాలు కలిగి ఉండాలని, పరిమితికి మించిన వేగంతో వెళ్లకూడదని, శబ్ద కాలుష్యానికి కారణం కాకూడదని వాహనదారులకు సూచించారు.నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టం ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

నేరస్తునికి వారెంట్ జారి-జామీను వ్యక్తికి జైలు శిక్ష..

నేరస్తునికి వారెంట్ జారి-జామీను వ్యక్తికి జైలు శిక్ష

జైపూర్,నేటి ధాత్రి:

 

 

ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన కేసులో చెన్నూర్ కోర్టు నుండి నేరస్తునికి వారెంట్ జారీ చేస్తూ,జామీను వ్యక్తికి జైలు శిక్ష విధించారని జైపూర్ పోలీసులు తెలిపారు.2020లో రామారావు పేట గ్రామానికి చెందిన రేగుంట రాజలింగు తో పాటు కొంతమంది వ్యక్తుల దగ్గర నుండి దుబాయిలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకున్న కేసులో స్థానిక పోలీస్ స్టేషన్ లో మురళి పై కేసు నమోదు అయినట్లు స్థానిక ఎస్సై శ్రీధర్ తెలిపారు.నేరస్తుడు కోర్టు పేషీలకు హాజరు కాకపోగా వారెంట్ జారీ చేశారన్నారు.బెల్లంపల్లి మండలం గురజాలకు చెందిన ఎండి నసీర్ మురళికి షూరిటీ ఇచ్చినందుకు చెన్నూర్ కోర్టు జడ్జి రవి రెండు నెలలు జైలు శిక్ష విధించారని వివరాలు వెల్లడించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version