పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సర్పంచ్ ఉప సర్పంచ్, ఉప సర్పంచ్ కి సన్మానం
నిజాంపేట, నేటి ధాత్రి
నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సర్పంచ్ నాతి అంజమ్మ లక్ష్మా గౌడ్, ఉప సర్పంచ్ పాగాల దేవరాజు ను శాలువతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలన్నారు. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలలో అధ్యక్షులు మెట్టు రాజేందర్ , ఉపాధ్యక్షులు పోతున్న రాజు , క్యాషర్ గోశిక సతీష్, మురళి, శ్రీనివాస్, పాండురంగం, గణేష్ శంకరయ్య, బాలనర్సు , మెట్టు శంకరయ్య తదితరులు పాల్గొన్నారు
