చదువు కోసం పోరాడిన అక్షర జ్యోతి…

చదువు కోసం పోరాడిన అక్షర జ్యోతి…

దేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే

ప్రధానోపాధ్యాయులు బండారు నరేందర్

కేసముద్రం/ నేటి ధాత్రి

 

శనివారం కేసముద్రం మండలంలోని కల్వల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. మొదటగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు బండారు నరేందర్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే మధ్య యుగపు చీకటి రోజులలో సమాజం అందాకారంలో బంధించబడి పరిస్థితులు ఉన్న రోజులవి అన్నారు. మూడవిశ్వాసాలతో, సాంఘిక దురాచారాలతో వెలుగొందితూ.. స్త్రీలకు చదువుకునే అవకాశం లేక, స్త్రీలు అనగదొక్కబడుతున్న కాలంలో… భర్త జ్యోతిబాపూలే సహకారంతో చదువుకొని భారత దేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా పేరు గాయించిందని పేర్కొన్నారు. సావిత్రిబాయి పూలే 1848లో పూణేలో మొదటి బాలిక పాఠశాలలను స్థాపించింది. స్త్రీ విద్యకు పునాది వేయడం జరిగింది. పుస్తకం పట్టిన చేతులు భవిష్యత్తును మార్చగలరని, అందాకారాన్ని చీల్చన విద్యా దీపం అని కొనియాడారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థి నీలంతా బాగా చదువుకొని సమాజ సేవలో నిమగ్నం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం మహిళా ఉపాధ్యాయులైన కే పార్వతి, రాధాదేవిలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం బి సత్యనారాయణ, తండ సదానందం, వేముల నాగేందర్, రాగి బిక్షపతి, మహంకాళి యాకాంబరం, వి రాజేంద్ర చారి, బి బాలాషోరెడ్డి, కే రాములు, ఎం శ్రీనివాస్, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎస్ ఏ కొప్పుల శంకర్, కె పార్వతి, ఎండి జుబేర్ అలీ, ఓడపల్లి రాము, జి నాగరాజు, ఏ లింగయ్య, ఎస్ సునీల్, ఎస్ రాధాదేవి మరియు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ఉర్సు దర్గా ప్రాంతంలో పూలే విగ్రహ స్థలం కబ్జా ప్రయత్నం?

ఉర్సు దర్గా ప్రాంతంలో పూలే విగ్రహ స్థలం కబ్జా ప్రయత్నం?

పూలే విగ్రహ స్థలంలో వెలసిన డబ్బా..! కబ్జాదారుడికి వెనకున్న “హస్తం” ఎవరిది..?

బీసీ వర్గాల నాయకుడి విగ్రహ స్థలాన్ని కబ్జా చేయడం సమంజసమా?

నేటిధాత్రి, వరంగల్.

 

ఉర్సు దర్గా ప్రాంతంలో జ్యోతిబా పూలే దంపతుల కాంస్య విగ్రహాల నిర్మాణం జరగాల్సిన స్థలం వివాదాస్పదంగా మారింది.

ఈ విగ్రహ నిర్మాణం కోసం సిమెంట్ బ్రిక్స్, అవసరమైన సామాగ్రి ఇప్పటికే సిద్ధంగా ఉండగా, రాత్రికి రాత్రే ఆ స్థలంలో “ఓ వర్గానికి” చెందిన వ్యక్తి డబ్బా కొట్టు ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది.

గతంలో ఇక్కడ ఉన్న విగ్రహం కూలగొట్టిన దుండగుడు. అదే స్థానంలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడానికి మాజీ ఎమ్మెల్యే ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.. అయితే విగ్రహ నిర్మాణ ప్రణాళికకు ఈ చర్య పెద్ద ఆటంకం కలిగించే అవకాశముంది.

ఈ ఘటనపై స్థానిక బీసీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “సామాజికవాద పితామహుడు జ్యోతిబా పూలే జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేయాలనుకుంటున్న స్థలాన్ని కబ్జా చేయడం సిగ్గుచేటు చర్య”గా పేర్కొన్నాయి.

విగ్రహ నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశాయి.

ఇక మున్సిపల్ అధికారులు, స్థానిక మిల్స్ కాలనీ పోలీసులు ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

స్థలం కబ్జా ప్రయత్నం మధ్య పూలే విగ్రహ నిర్మాణం కొనసాగుతుందా లేదా అనే ప్రశ్న ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version