ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నరేష్ గౌడ్…

ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నరేష్ గౌడ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

సంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నరేష్ గౌడ్, మున్సిపల్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, 6వ వార్డులోని బాబా నగర్ కాలనీలో సీసీటీవీ కెమెరాలు మరియు ఐమాక్స్ లైట్లను ఏర్పాటు చేశారు.సాయంత్రం ముఖ్య అతిథులుగా విచ్చేసిన జహీరాబాద్ రూరల్ ఎస్ఐ శ్రీ కాశీనాథ్ మరియు సంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నరేష్ గౌడ్ సీసీటీవీ కెమెరాలు, ఐమాక్స్ లైట్లను ప్రారంభించారు.బాబా నగర్ నాయకులు మరియు యువత పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న సర్పంచ్…

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న సర్పంచ్

అభివృద్ధి దిశగా పంచాయతీలో పనులు

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,, నేటిధాత్రి.

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కరకగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో భాగంగా మోతే గ్రామంలోని ముత్యాలమ్మ గుడి ఆవరణలో భక్తుల సౌకర్యం మరియు ప్రజల మంచినీటి అవసరాల నిమిత్తం హ్యాండ్ బోర్ అవసరం ఉందని సర్పంచ్ దృష్టికి తీసుకొని రాగా స్పందించి పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు సంబంధించిన అధికారులు ఎంపీడీవో మరియు ఎంపీవోతో మాట్లాడి వారి సహకారంతో ఎంపీపీ నిధులలో మంజూరు చేయించి ఈరోజు పూజా కార్యక్రమం నిర్వహించి నూతన బోర్ పనులను ప్రారంభించిన సర్పంచ్ సుజాత పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయద్ ఇక్బాల్ హుస్సేన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ముత్యాలమ్మ గుడి వద్దకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారి సౌకర్యం కోసం అలాగే గ్రామ ప్రజలకు కూడా త్రాగునీటికి ఈ బోర్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ అక్కిరెడ్డి నిర్మల, సిపిఎం మండల కార్యదర్శి కొమరం కాంతారావు, ఎల్లి సోమిరెడ్డి, బుడగ వెంకన్న, అక్కిరెడ్డి మల్లారెడ్డి, రాజేందర్, మోతే గ్రామస్తులు పెద్దలు పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు

సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన…

సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చిన బిక్కజీపల్లి నూతన సర్పంచ్ బండారి రమేష్

నర్సంపేట,నేటిధాత్రి:

 

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గ్రామంలోని ఎనవాడకు రోడ్డు సౌకర్యం కల్పిస్తామని చేసిన వాగ్దానం మేరకు సోమవారం దుగ్గొండి మండలంలోని బిక్కాజీపల్లి సర్పంచ్ గా బండారి రమేష్ భాద్యతలు స్వీకరించిన అనంతరం సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోకల శ్రీనివాస్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు చుక్క రమేష్,ఉప సర్పంచ్ రమాదేవి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version