ప్రజాసేవ చేసేందుకు అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేసి చూపిస్తా…

ప్రజాసేవ చేసేందుకు అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేసి చూపిస్తా…

11వ వార్డ్ బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి గడ్డం సంపత్ గౌడ్

రామకృష్ణాపూర్,నేటిధాత్రి:

 

ప్రజా సేవ చేస్తూ, 11వ వార్డ్ అభివృద్ధికి కృషి చేస్తూ నిత్యం ప్రజల్లో ఉంటానని బీజేపీ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి గడ్డం సంపత్ గౌడ్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శివాజీ నగర్ ఏరియాలో ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లకు తెలియజేస్తున్నారు. ఒక్క అవకాశం ఇచ్చి కౌన్సిలర్ గా గెలిపిస్తే వార్డు లోని సమస్యలను పరిష్కరిస్తానని గడపగడపకు తిరుగుతూ ఓటర్లను ఓటు అభ్యర్థిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈనెల 11న జరిగే మున్సిపాలిటీ ఎన్నికలలో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని 11వ వార్డు ప్రజలను, ఓటర్లను కోరుతున్నారు.

రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక వసతులు కల్పిస్తానని హామీ ఇస్తూ, ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ, ప్రజలకు ఏ ఆపద వచ్చినా నిత్యం అందుబాటులో ఉంటానని ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ప్రజలు ఆశీర్వదిస్తే సుభాష్ కాలనీ అభివృద్ధి చేస్తా….

ప్రజలు ఆశీర్వదిస్తే సుభాష్ కాలనీ అభివృద్ధి చేస్తా

బిజెపి పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఆపిల్ బాల్

భూపాలపల్లి నేటిధాత్రి

ప్రజలు నన్ను ఆశీర్వదించి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే సుభాష్ కాలనీ 29 వార్డు అభివృద్ధి చేస్తానని ఆపిల్ బాలు అన్నారు
మున్సిపాలిటీ సాధారణ ఎన్నికల్లో భాగంగా 29వార్డు బిజెపి పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి యాపిల్ బాల్ కార్యకర్తలతో ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుభాష్ కాలనీ 29వ వార్డు ప్రజలు ఒక్కసారి నేను గతంలో ఓడిపోయాను రెండోసారి బిజెపి పార్టీ నుండి కమలం పువ్వు గుర్తుపై పోటీ చేస్తున్నాను కావున ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి మున్సిపాలిటీ కౌన్సిలర్ గా కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించగలరని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను నేను గెలిచిన వెంటనే సుభాష్ కాలనీ సైడ్ డ్రైనేజీలు సిసి రోడ్లు వాటర్ సమస్య లేకుండా చేస్తాను అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

“4వ వార్డులో బీజేపీ అభ్యర్థి ప్రచారం”

కమలం పువ్వు గుర్తుపై ఓటు వేయండి కన్నం యుగదీశ్వర్

భూపాలపల్లి నేటిధాత్రి

మున్సిపాలిటీ సాధారణ ఎన్నికల్లో భాగంగా భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 4వార్డ్ బిజెపి పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి కన్నం యుగదీశ్వర్ యుగేందర్ ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగో వార్డ్ ప్రజలు నన్ను ఆశీర్వదించి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి కౌన్సిలర్ అభ్యర్థిగా గెలిపించి భూపాలపల్లి మున్సిపాలిటీ పంపియండి కాలనీ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తాను నాలుగో వార్డు పక్కకు వారం సంతను తీసుకువస్తాను ప్రతి వార్డుకు ఒక బోరు వేసి నీటి సౌకర్యం కల్పిస్తాను కాలనీ సమస్యలను అన్నిటిని పరిష్కరిస్తానని వారు అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version