ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న సర్పంచ్
అభివృద్ధి దిశగా పంచాయతీలో పనులు
కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,, నేటిధాత్రి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కరకగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో భాగంగా మోతే గ్రామంలోని ముత్యాలమ్మ గుడి ఆవరణలో భక్తుల సౌకర్యం మరియు ప్రజల మంచినీటి అవసరాల నిమిత్తం హ్యాండ్ బోర్ అవసరం ఉందని సర్పంచ్ దృష్టికి తీసుకొని రాగా స్పందించి పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు సంబంధించిన అధికారులు ఎంపీడీవో మరియు ఎంపీవోతో మాట్లాడి వారి సహకారంతో ఎంపీపీ నిధులలో మంజూరు చేయించి ఈరోజు పూజా కార్యక్రమం నిర్వహించి నూతన బోర్ పనులను ప్రారంభించిన సర్పంచ్ సుజాత పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయద్ ఇక్బాల్ హుస్సేన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ముత్యాలమ్మ గుడి వద్దకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారి సౌకర్యం కోసం అలాగే గ్రామ ప్రజలకు కూడా త్రాగునీటికి ఈ బోర్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ అక్కిరెడ్డి నిర్మల, సిపిఎం మండల కార్యదర్శి కొమరం కాంతారావు, ఎల్లి సోమిరెడ్డి, బుడగ వెంకన్న, అక్కిరెడ్డి మల్లారెడ్డి, రాజేందర్, మోతే గ్రామస్తులు పెద్దలు పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు
