శ్రీరామ్ దళ్ ఆధ్వర్యంలో జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరణ…

శ్రీరామ్ దళ్ ఆధ్వర్యంలో జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరణ

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట నియోజకవర్గ పరిధి శ్రీరామ్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాబ్ మేళా కోసం పట్టణంలోని కెఎస్‌ఆర్ కాన్సెప్ట్ స్కూల్‌లో జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరణ జిల్లా అధ్యక్షులు కొరిటాల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా రాష్ట్ర అధికార ప్రతినిధి భూసాని రమేష్ మీడియాతో మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం సంస్థ యొక్క ప్రధాన లక్ష్యమని తెలిపారు.రాష్ట్ర అధ్యక్షుడు నంద్యాల వినయ్ రెడ్డి మార్గదర్శకత్వంలో ఈ జాబ్ మేళాను నిర్వహించడం గర్వకారణమని పేర్కొన్నారు.
కోశాధికారి మచ్చిక రవితేజ కార్యక్రమంలో యువతకు ప్రోత్సాహం అందించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, యువతీ యువకులు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట నియోజకవర్గ కన్వీనర్ కన్నబోయిన రమేష్, వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు ఊరేటి శివకుమార్, నర్సంపేట మండల అధ్యక్షులు అజ్మీర రాజ నాయక్, దుగ్గొండి మండల అధ్యక్షుడు జాను అజయ్,నర్సంపేట నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ పొనుగోటి త్రినేష్ రావు, నిమ్మగడ్డ నాగార్జునతో పాటు ఇతర కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మద్రాస్ రబ్బర్ లిమిటెడ్ కంపెనీలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలుసిఐ రాజువర్మ

మద్రాస్ రబ్బర్ లిమిటెడ్ కంపెనీలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలుసిఐ రాజువర్మ

నేటిదాత్రి చర్ల

 

భద్రాద్రి కొత్తగూడెం చర్ల మండలంలోని యువతకు సువర్ణ అవకాశం ప్రముఖ కంపెనీలైన మద్రాస్ రబ్బర్ (ఎంఆర్ ఎఫ్ ) రేన్( మద్రాసు)లిమిటెడ్ కంపెనీలో 120 పొస్టులకు గాను శిక్షణ మరియు ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ నెల10న ఖమ్మం కలెక్టరేట్ లో జరిగే ఎంపికకు అర్హత కలిగిన అభ్యర్ధులు నేరుగా పాల్గొనాలని తెలిపారు వయస్సు 18సంవత్సరాల నుండి 28 సంవత్సరాల వయస్సు కలిగిఉండాలని అర్హత 10 తరగతి ఇంటర్ ఐటిఐ చేసిన ( పురుషులు) నిరుద్యోలకు సువర్ణ అవకాశం అని అన్నారు శిక్ణణ కాలం 2 సంవత్సరాలు ఉంటుందని పని సయమం ఎనిమిది గంటలు ఉంటుందని శిక్షణ సమయంలో మంచి జీతం ఇవ్వటంతోపాటు భోజనం వసతి కల్పించడం జరుగుతుందని తెలిపారు ఆసక్తి గల నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు మరింత సమాచారం కొరకు స్ధానిక పొలీస్ స్టేషన్లో సంప్రదించాలని సి ఐ రాజువర్మ నిరుద్యోగ యువతకు పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు

దుగ్గొండి కేజీబీవి కుక్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం….

దుగ్గొండి కేజీబీవి కుక్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

హెడ్ కుక్ -1,అసిస్టెంట్ కుక్ – పోస్ట్..

ఈ నెల 25 న దరఖాస్తుల చివరితేదీ

మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు

నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి:

 

దుగ్గొండి మండలం పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయంలో కుక్కు పోస్టుల దరఖాస్తుల ఆహ్వానం పలుకుతున్నట్లు మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు.
దుగ్గొండి మండలంలోని మల్లంపల్లి గ్రామంలో గల కేజీబీవి పాఠశాలలో హెడ్ కుక్ పోస్టు, అసిస్టెంట్ కుక్ రెండు పోస్టులు ఖాళీగా ఉన్న నేపథ్యంలో అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుతున్నామని పేర్కొన్నారు. ఈ రెండు పోస్టులకు 18 నుండి 45 సంవత్సరాలులోపు మహిళలు అర్హులని,సామూహిక వంటలో అనుభవం కల్గిఉండాలన్నారు.హెడ్ కుక్ పోస్టు కోసం పదో తరగతి పాస్ అయ్యి,స్థానిక మండలం వారు కావాలని తెలిపారు.అసిస్టెంట్ కుక్ పోస్టు కోసం స్థానిక దుగ్గొండి మండల వాసి అయ్యి ఏడవ తరగతి పాస్ అయి ఉండాలని వివరించారు. హెడ్ కుక్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థురాలు పదవ తరగతి మెమో, అసిస్టెంట్ కుక్ ఏడో తరగతి మెమో, కుల,నివాస ధ్రువీకరణ పత్రాలు, స్టడీ, ఆధార్, వంటల అనుభవం ధృవీకరణ పత్రం, పాస్ ఫొటోస్ తో సంబంధిత దరఖాస్తు ఫామ్ కు జతపరిచి ఈనెల 25 సాయంత్రం 4 గంటల లోపు మల్లంపల్లి లో గల కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం పాఠశాల ప్రత్యేక అధికారినికి అందజేయాలని మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలియజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version