గల్ఫ్ కార్మికునికి గల్ఫ్ కార్మికుల భరోసా….

గల్ఫ్ కార్మికునికి గల్ఫ్ కార్మికుల భరోసా
వి. వి. రావుపేట్ సంఘం తరపున 57.001 ఆర్థిక సాయం
మల్లాపూర్ సెప్టెంబర్ 11 నేటి ధాత్రి

 

 

 

జగిత్యాల జిల్లా మల్లపూర్ మండలం వేంపల్లి గ్రామానికి చెందిన కండేల గంగాధర్ అనే గల్ఫ్ కార్మికుని పట్ల కాలం కనికరం చూపలేదు. తన కుటుంబం కోసం చిన్నతనం అందరిని కాల్పోయి మళ్ళీ కుటుంబం కోసం కష్టపడి మంచి కుటుంబాన్ని సంతోషంగా సాగుతున్న సమయం లో విషాదం నెలకొల్పింది.
కండెల గంగాధర్ తన భార్య అంజలి అనారోగ్యం బాగా లేనందున ఎంతో ఖర్చు చేసుకొని హాస్పిటల్లో లక్షలు ఖర్చు చేసుకున్న కూడా తన భార్యను కాన్సర్ నుండి రక్షించలేకపోయాడు.
తోటి గల్ఫ్ కార్మికునిక గా చిన్నతనం నుండి చూసిన ఎంతోమంది గల్ఫ్ కార్మికులు చలించి పోయారు. వి. వి. రావుపేట్ గల్ఫ్ కార్మిక సంఘం సభ్యులు ఏదో ఉడుతా సహాయంగా ఆర్థిక సాయం చేయడం జరిగింది. అక్షరాల యాభై ఏడు వేల రూపాయలు తోటి గల్ఫ్ కార్మికులకు ఇబ్బంది ఉందని చెప్పగానే వి. వి. రావుపేట్ గల్ఫ్ కార్మిక సంఘ సభ్యులు తన కుటుంబానికి ఆర్థికంగా మనందరం కూడా సహాయం చేద్దామని ముందుకు రావడం.జరిగింది
ఒకరికి ఒకరం భరోసానివ్వడం చాలా గొప్ప విషయం అని వి. వి. రావుపేట్ గల్ఫ్ సంఘo నాయకులు తెలిపారు.
అలాగే ఈ సంస్థ ఏర్పడిన నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో మందికి భరోసా, గల్ఫ్ కార్మికలకు అవగాహనా కల్పిస్తున్న అందున పలు నాయకులు సంతోషం వ్యక్తం చేయడం జరుగుతుంది.
ఈ కార్యక్రమం లో వి వి రావుపేట గల్ఫ్ కార్మిక సంఘం సభ్యులు పెనుకుల అశోక్. ఆరేళ్లి మహేష్,విష్ణు రాజా. మచ్చర్ల అదిరెడ్డి నారాయణ గౌడ్.రఘపతి. నలిమేల ప్రసాద్. పోతు రఘు. గుగ్లావత్ శ్రీకాంత్ మెండే ప్రవీణ్. రొడ్డ రాజశేఖర్. శ్రీమాన్ గౌడ్. రొడ్డ నవీన్. ఒల్లలా మల్లేషం. సంఘ మహేష్.గోపినేని రమేష్. వేల్పుల గంగాధర్. జక్కని నరేష్. కాట్కామ్ గణేష్. అరెల్లి శ్రీనివాస్. మిట్టపల్లి శ్రీనివాస్. సురేందర్ రొడ్డ. నాణెం రంజిత్. పళ్ళికొండ నరేష్. ఒల్లలా శ్రీనివాస్. పంజర్ల సత్యనారాయణ. ఎండీ రహీమ్. కండెల వెంకటి. బాధనపెల్లి గంగారెడ్డి. ఇరిశెట్టి సాయిలు. కోమానాపెళ్ళి కాసాన్న. రొడ్డ రాజేందర్. కండెల భూమయ్య. వేల్పుల మహేష్. సకినాపెళ్ళి శేఖర్. కొడిమ్యాల లింగం చారి. సుతారి గణేష్. గుగ్లావత్ రాజేష్. యాళ్ల తిరుపతి రెడ్డి. అమరకొండ లక్ష్మి రాజాం. గుగ్లావత్ శ్యామల్. గుగ్లావత్ తిరుపతి. కండెల సాయిలు. లౌడ్య విష్ణు. అరే రాజేశం. నిమ్మల విజయ్. ఎండీ ఆమాన్. వెల్మలా ప్రవీణ్. ఎండీ అబిబి.అరెల్లి రాజేశం. సకినపెల్లి రమేష్. జోగుల రాకేష్. గుగ్లావత్ చిన్నా.ఈ కార్యక్రమంలో. పెనుకుల నరేష్. వేముల నరేష్. నలిమేల రాజు. సతీష్. శ్రీను . శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అధ్యాపకుడిగా జిల్లా కలెక్టర్…

అధ్యాపకుడిగా జిల్లా కలెక్టర్
మల్లాపూర్ సెప్టెంబర్ 11 నేటి ధాత్రి

 

 

మల్లాపూర్ మండల కేంద్రంలోని గిరిజన బాలికల (మినీ గురుకుల)పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
పాఠశాలలోని విద్యార్థులకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను నేర్పించాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు.
గురువారం రోజున జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కేందంలోని గిరిజన పాఠశాలను సందర్శించిన కలెక్టర్.
పాఠశాలను మొత్తం సందర్శించి విద్యార్థుల స్థితిగతులను, వారికి కల్పిస్తున్న వసతులను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా విద్యా ప్రమాణాలు, మౌళిక సదుపాయాల తీరును కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు.
క్లాస్ రూమ్ లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అని కలెక్టర్ ఆరా తీశారు. అదే విధంగా ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తున్నారా లేదా అని కలెక్టర్ హాజరు పట్టికను పరిశీలించారు. పాఠశాలలోని ప్రతీ విద్యార్థి పై ప్రత్యేక దృష్టి సారించాలని, సర్కారు బడుల్లో క్వాలిఫైడ్ ఉపాద్యాయులు పనిచేస్తున్నారని, భావి తరాలకు అవసరమైన విద్యా బోధన చేయడం జరుగుతున్నదని తెలిపారు.
విద్యార్థులతో ముఖాముఖి సంభాషణ జరిపి వారికి పాఠాలు చదివించి వారి బోధన స్థితిగతులను ప్రత్యేకంగా పరిశీలించారు.

 

District Collector Inspects Tribal Girls School in Mallapur

 

పాఠశాలలో విద్యార్థుల హాజరు, తరగతుల నిర్వహణ, పారిశుద్ధ్య సౌకర్యాలు వంటి అంశాలను పరిశీలించారు.. విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం భోజనం అందుతున్నదా అనే విషయాన్ని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, భోజన తయారీ విషయంలో నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అదేవిదంగా ఒప్పంద నిర్వాహకుడితో మాట్లాడి నాణ్యతతో కూడిన సరుకులు అందించాలని తెలిపారు.
పాఠశాల తరగతి గదులలో పరిసరాల పరిశుభ్రతను పాటించాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు. వర్షాకాలం దొమలు వృద్ధి చెందే అవకాశం ఉన్నందున పాఠశాల ఆవరణంలో పిచ్చి మొక్కలు తొలగించి, శానిటేషన్ చేయించాలని సూచించారు. ముఖ్యంగా పాఠశాల ఉపాధ్యాయులు సమయపాలన తప్పకుండా పాటించాలని చెప్పడం జరిగింది.
కలెక్టర్ వెంట మెట్ పల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస్, ఎస్సీ వెల్ఫేర్ జిల్లా అధికారి రాజ్ కుమార్, తహసీల్దార్, సంబంంధిత అధికారులు పాల్గొన్నారు.

సెప్టెంబర్ 13న నేషనల్ లోక్ అదాలత్: పెండింగ్ కేసులు పరిష్కారం…

సెప్టెంబర్ 13న నేషనల్ లోక్ అదాలత్: పెండింగ్ కేసులు పరిష్కారం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, హైదరాబాద్ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో, కోర్టులలో పెండింగ్ కేసులను పరిష్కరించడానికి, సత్వర న్యాయం అందించడానికి సెప్టెంబర్ 13, 2025న నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సమాచారాన్ని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం నుండి పోచారం ప్రవీణ్ కుమార్ అందించారు. ఈ లోక్ అదాలత్ ద్వారా అనేక కేసులకు సత్వర పరిష్కారం లభించే అవకాశం ఉంది. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

వరద,ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన…

వరద,ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన
.
వనపర్తి నేటిదాత్రి .

 

 

మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ భారీవర్షాలకు వరదతో ముంపుకు గురైన లోతట్టు రాజీవ్ గృహ కల్ప ఎస్. సి,ఎస్.టి వసతి గృహాలు,జంగిడిపురం,భగీరథ కాలనీ వెంగల్ రావు కాలనీ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మర్రికుంట చెరువు అలుగు పారడం,పీర్లగుట్ట నుంచి వచ్చిన వరదలతో రాజీవ్ గృహ కల్పలో మోకాళవరకు నీళ్లు చేరడంతో ప్రజలను అప్రమత్తం చేసి మిగతా ప్రాంతాలంలో నిలిచిన నీటిని మున్సిపల్ సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టడం జరిగిందని వివరించారు. ఈ రోజు అతిభారీ వర్షాలు ఉండడం వల్ల పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు అదేవిధంగా రాజీవ్ గృహ కల్పలో ఫస్ట్ ఫ్లోర్ ఇళ్ల లో కి వరద నీరు రావడంతో వార్డు ప్రజలు మాజీ వైస్ చైర్మన్ దృష్టి కి తెచ్చారు వెంటనే అధికారులు లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. వైస్ చైర్మన్ వెంట బీ ఆర్ ఎస్ కార్యకర్తలు ప్రజలు ఉన్నారు ఈసందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ బారి వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వనపర్తి పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు

డైరెక్ట్ మార్కెట్ సేలింగ్ లో తీసుకెళ్తున్న వెస్టేజ్ కంపెనీ

డైరెక్ట్ మార్కెట్ సేలింగ్ లో తీసుకెళ్తున్న వెస్టేజ్ కంపెనీ

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

మంచిర్యాల జిల్లా పద్మావతి గార్డెన్ లో బుధవారం ఏర్పాటు చేసిన వెస్టీజ్ డైరెక్ట్ మార్కెట్ సేలింగ్ కంపెనీ లో వి.ఎం.సి.ఎం సుబ్బయ్య శెట్టి,వి.ఎం.సి.ఎం ఎమ్.ఎస్.ఆర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..వెస్టీజ్ కంపెనీ తన కార్యకలాపాలను 2004 సంవత్సరంలో న్యూఢిల్లీ,బెంగళూరులోని కార్యాలయంలో ప్రారంభించి ఇది ప్రపంచ స్థాయి ఆరోగ్య వ్యక్తిగత,సంరక్షణ ఉత్పత్తులను డీల్ చేస్తూ నేడు దేశంలోని ప్రతి మూల మూలాన సంచరించిందని అన్నారు.భారతదేశంలోని అతిపెద్ద ప్రత్యక్ష అమ్మకాల కంపెనీలో ఒకటైన వెస్టీజ్ మార్కెటింగ్ లిమిటెడ్ సహా వ్యవస్థాపకుడు,మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ బాలి,డైరెక్టర్స్ కన్వర్ బీర్ సింగ్,దీపక్ సూద్ 2004లో ప్రారంభమైనప్పటి నుండి 21 సంవత్సరాలు కార్యకలాపాలను పూర్తిచేసిన ఈ కంపెనీ ప్రస్తుతం ఇండియా తో పాటు దుబాయ్, బహ్రెయిన్,ఒమన్,సౌదీ అరేబియా,యుఏఇ,నేపాల్, బంగ్లాదేశ్ లలో ఉనికి కలిగి ఉందని వారు తెలిపారు. వెస్టీజ్ కంపెనీలో ఇప్పటివరకు భారతీయులు 5 కోట్ల మంది పని చేస్తూ ఉపాధి పొందుతున్నారని తెలిపారు.ఈ కంపెనీలో పనిచేయడానికి ఎలాంటి విద్య అర్హత గాని,ఎలాంటి పెట్టుబడి లేకుండా వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ పనిచేస్తూ లక్షలలో సంపాదించుకునే అవకాశం ఉందని వారు తెలిపారు.వెస్టీజ్ కంపెనీలోని ఉత్పత్తులు ఆరోగ్యానికి,వ్యవసాయానికి,బ్యూటీకి,హోమ్ కి సంబంధించిన ఉత్పత్తులను కొనుగోలు చేసి వాడుకుంటూ వాటితో వచ్చిన రిజల్ట్స్ ద్వారా పదిమందికి చెబుతూ ఉపాధి పొందవచ్చని తెలిపారు.ఈ ఉత్పత్తులు ఎలాంటి కెమికల్స్ వాడకుండా నాచురల్ పద్ధతిలో తయారు చేయబడ్డవని,ప్రజలు ఎలాంటి అపోహలు గురి కాకుండా అనేక ఆరోగ్య సమస్యలకు ఫుడ్ సప్లిమెంట్స్ వాడుతూ పూర్తి ఆరోగ్యవంతులుగా ఉండొచ్చని అన్నారు.

యువత కి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న వెస్టీజ్ కంపెనీ

యువతి,యువకులు ఎన్నో ఉన్నత చదువులు చదివి ఉద్యోగా అవకాశాలు లేకపోవడంతో వెస్టీజ్ కంపెనీ లో డైరెక్ట్ మార్కెటింగ్ సేలింగ్ చేస్తూ ఉపాధి పొందుతూ లక్షలలో సంపాదిస్తున్నారని అన్నారు.అలాగే రైతులు పండించే పంటలలో ఎక్కువగా క్రిమిసంహారక మందులు పిచికారి చేయడంతో భూమి పూర్తిగా కలుషితమై మనం తినే తిండి వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. ఇప్పటికైనా వెస్టీజ్ మార్గాన్ని ఎంచుకొని కంపెనీ ఏర్పరిచే ఫ్రీ ఐడి ద్వారా కంపెనీలో చేరి బిజినెస్ చేస్తూ డబ్బు సంపాదించుకోవచ్చని తెలియజేశారు.

మాజీ జెడ్పిటీసి అంతిమయాత్రలో పాల్గొన్న గజ్జి విష్ణు…

మాజీ జెడ్పిటీసి అంతిమయాత్రలో పాల్గొన్న గజ్జి విష్ణు

 

పరకాల నేటిధాత్రి

 

 

మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన సిలివేరు మొగిలి మాజీ జడ్పీటీసీ మరణించగా అంతిమయాత్రలో సూర్య హాస్పిటల్ ఎండి డాక్టర్.సురేష్,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సూర్య ట్రస్ట్ చైర్మన్ గజ్జి విష్ణు మొగిలి పార్థివదేహానికి పూలదండ వేసి నివాళులు అర్పించారు.వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని వారికి దైర్యం చెప్పి వారి కుటుంబానికి రూపాయలు 5000 ఆర్థిక సహాయం అందచేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో కొగిల్వయి చందు,పెంచల రాజెందర్,సిలివేరు చిరంజీవి,సిలివేరు వెంకటేష్,రాఘవ,వినయ్,రంజిత్,సాయి,దయ,ఈ అంతిమయాత్ర లో పాల్గొన్నారు.

పాఠశాలను తనిఖీ చేసిన మండల ప్రత్యేక అధికారి సునీల్…

పాఠశాలను తనిఖీ చేసిన మండల ప్రత్యేక అధికారి సునీల్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, రేగొండ మండల ప్రత్యేక అధికారి ఏ. సునీల్ కుమార్ ఎం.జె.పి.టి.బి.సి.డబ్ల్యూ.
ఆర్ బాలుర పాఠశాలను సందర్శించారు.
పాఠశాలలో కూరగాయల స్టాక్ రిజిస్టర్‌ను,
కూరగాయల తాజాదనంను పరిశీలించారు.
విద్యార్థులకు వడ్డిస్తున్న ఆహార నాణ్యతను పరిశీలించారు.
వంటగది, భోజనశాల పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు.

యూరియా కోసం రైతుల తిప్పలు…

యూరియా కోసం రైతుల తిప్పలు
వర్షాన్ని లెక్కచేయని క్యూలైన్‌లు..

రామయంపేట సెప్టెంబర్ 11 నేటి ధాత్రి (మెదక్)

 

 

 

రామాయంపేట మండలం కాట్రియాల, ధర్మారం గ్రామాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటలకు అత్యవసరమైన యూరియా కోసం తెల్లవారుజాము నుంచే సొసైటీ ఎదుట బారులు తీరారు. ఉదయం నుంచి వర్షం కురుస్తున్నా, తడుస్తూనే ఒక బస్తా యూరియా కోసం ఎనిమిది గంటలపాటు క్యూలైన్‌లలో నిలబడ్డారు.
“తడిసినా పర్వాలేదు… మా పంటలకు యూరియా లేకపోతే ఎండిపోతాయి” అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా రైతులు కూడా వర్షాన్ని లెక్కచేయకుండా లైన్లలో నిలబడటం గ్రామాల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో
రైతులు స్పష్టంగా డిమాండ్ చేస్తున్నారు.ఇక మాకు హామీలు వద్దు వెంటనే యూరియా సరఫరా చేయాలి. పంటల భవిష్యత్తు కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి.

ధర్మస్థల కేసుపట్ల వేగవంతంతో దర్యాప్తును నిర్ధారించాలి….

ధర్మస్థల కేసుపట్ల వేగవంతంతో దర్యాప్తును నిర్ధారించాలి.*

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

కర్ణాటక ప్రభుత్వం ధర్మస్థల కేసులో శాస్త్రీయ,నిష్పాక్షిక వేగవంతమైన దర్యాప్తును నిర్ధారించాలని పిఓడబ్ల్యు జిల్లా కార్యదర్శి పూలక్క డిమాండ్ చేశారు.నర్సంపేటలోని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పిఓడబ్ల్యు సదస్సు జక్కుల విజయ అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా పిఓడబ్ల్యు జిల్లా కార్యదర్శి పూలక్క మాట్లాడుతూ
కర్ణాటకలోని ధర్మస్థల ఆలయంతో పాటు చుట్టుపక్కల 400 మంది నివేదికల ప్రకారం బాలికలు,మహిళల సామూహిక అత్యాచారాలు,లైంగిక దాడులు,సామూహిక హత్యలు,సామూహిక ఖననంపై అందుకు సంబంధించిన ఎఫ్ఐఆర్‌పై కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు ఇప్పటికీ కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ క్రమంలో దర్యాప్తులో కొన్ని సమస్యల తర్వాత భట్ తల్లి తనకు ఎప్పుడైనా కూతురు ఉందా లేదా అనే దానిపై తిరగబడటం, విజిల్‌బ్లోయర్ అరెస్టు నివేదికలు వంటి సమస్యలను మళ్లించడానికి అలాగే సమస్యను మతంచేయడం ద్వారా, న్యాయవాదులు,కార్యకర్తలను కించపరచడం, ఆలయ స్థాపనకు నైతిక మద్దతు కవాతులను ప్రకటించడం ద్వారా ఒత్తిడిని పెంచడానికి ప్రచారం జరుగుతోందని తెలిపారు.ధర్మస్థల కేసులో ఆధారాలు, సాక్షులు, న్యాయవాదుల రక్షణ కొనసాగించి ప్రజల పోరాటం నిఘా మాత్రమే పూర్తి వాస్తవాలు వెలుగులోకి వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
అనంతరం పిఓడబ్ల్యు నూతన డివిజన్ కమిటీని ఏర్పాటు చేయగా నూతన అధ్యక్ష కార్యదర్శులు జక్కుల విజయ,ఆకుల శైలజ, డివిజన్ నాయకులు సంధ్య, వీరలక్ష్మి, సుక్కక్కలను ఎన్నుకున్నారు.

33 వ వార్డు లోబారి వర్షానికి ఒరిగిన కరెంటు స్థంభం…

33 వ వార్డు లోబారి వర్షానికి ఒరిగిన కరెంటు స్థంభం

వెంటనే స్పందించిన మాజీ కౌన్సిలర్ తిరిమాల్
తప్పిన ప్రమాదం
వనపర్తి నేటిదాత్రి .

 

 

 

జిల్లా కేంద్రంలోని వల్లభ నగర్ రాష్ట్ర ప్రణాళిక సంఘము వైస్ చైర్మన్ జి చిన్నారెడ్డి ఇంటి దగ్గర 33 వ వార్డులో కుండపోతగా కురిసిన వర్షానికి కారెంట్ స్తంభం ఒరిగి ప్రమాదానికి గురై కిందికి ఒరగడం చూసిన వార్డు ప్రజలు మాజీ కౌన్సిలర్ ఉంగ్లo తిరుమల్ కి సమాచారం ఇచ్చారు వెంటనే విద్యుత్ అధికారులను అప్రమంత్తo చేసి జె సి బి తో కరెంట్ స్థంభం ప్రమాదానికి గురికాకుండా సహాయం అందించారు ఈమేరకు విద్యుత్ అధికారుల కు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ తిరిమాల్ కు ఒక ప్రకటన లో కృతజ్ఞతలు తెలిపారు

బాలాజీ మహిళా డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం…

బాలాజీ మహిళా డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

నర్సంపేట పట్టణంలోని బాలాజీ మహిళా డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఓరియంటేషన్ ప్రోగ్రాం ఘనంగా నిర్వహించారు.ముఖ్య అతిథిగా హాజరైన ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ ఈసం నారాయణ మాట్లాడుతూ విద్యార్థినులు చదువుతో పాటు క్రీడా,సాంస్కృతిక రంగాలలోనూ రాణించాలని సూచించారు. ఈ లక్ష్య సాధనకు ఎన్ఎస్ఎస్ ఒక అద్భుతమైన వేదికగా ఉపయోగపడుతుందని తెలిపారు. దేశాభివృద్ధికి ఆటంకాలైన మూఢనమ్మకాలు,నిరక్షరాస్యత,డ్రగ్స్ వంటి దుష్ప్రవర్తనలను సమాజం నుండి పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు.కళాశాల ప్రిన్సిపాల్ మోర్తాల రామరాజు మాట్లాడుతూ నూతన విద్యార్థులు తప్పనిసరిగా ఎన్ఎస్ఎస్ రిజిస్ట్రేషన్ చేసుకుని యూనివర్సిటీ నిర్వహించే వివిధ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొని కళాశాలకు పేరు తీసుకురావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి శ్రీనివాస్,అధ్యాపకులు రవీందర్, బిక్షపతి,రాజ్‌కుమార్,మధు తదితరులు పాల్గొన్నారు.

మాజీ జెడ్పిటిసిని పరామర్శించిన మునిగాలా సురేందర్ రావు…

మాజీ జెడ్పిటిసిని పరామర్శించిన మునిగాలా సురేందర్ రావు

పరకాల నేటిధాత్రి

 

 

 

కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతు మరణించిన పరకాల మాజీ జడ్పిటిసి సిలివేరు మొగిలి పార్థివదేహానికి తన స్వగ్రామం మండలంలోని వెంకటపూర్ గ్రామంలో బిఆర్ఎస్ జిల్లా నాయకులు మునిగాల సురేందర్ రావు నివాళులు అర్పించారు.మొగిలి మరణ వార్త తెలిసి పరకాల ప్రాంత ప్రజలు తీవ్రంగా విచారాన్ని వ్యక్తం చేశారు.ప్రజా సమస్యలపై ఎల్లప్పుడూ ముందుండే నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు లభించింది.రాజకీయ నాయకులు,స్థానిక ప్రజలు ఆయన మరణంపై సంతాపం తెలియజేస్తూ,వారి ఆత్మకు శాంతి కలగాలని,కుటుంబ సభ్యులకు ధైర్యం కలగాలని ప్రార్థించారు.

పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి..

పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి..

ఏబీవీపీ రాష్ట్ర నాయకులు బండారి ప్రశాంత్..

రామాయంపేట, సెప్టెంబర్ 11 నేటి ధాత్రి (మెదక్)

 

 

 

రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న ₹8,300 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌లను తక్షణమే విడుదల చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రామాయంపేట శాఖ డిమాండ్ చేసింది.
స్థానిక బస్టాండ్‌ వద్ద గురువారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న 8300 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ విడుదల చేయాలని స్థానిక బస్టాండ్ వద్ద బయట నుంచి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు బండారి ప్రశాంత్ మాట్లాడుతూ –
ఫీజు రీయింబర్స్మెంట్ అనేది విద్యార్థుల హక్కు, ప్రభుత్వం ఇచ్చే దానం కాదు. పేద, మధ్యతరగతి విద్యార్థులు ఈ నిధుల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థుల సమస్యలపై స్పందించకపోగా కేవలం డైవర్షన్ రాజకీయాలతోనే రోజులు గడుపుతున్నారని విమర్శించారు.
అతను హెచ్చరిస్తూ, విద్యార్థుల సమస్యలు, స్కాలర్‌షిప్‌లు తక్షణమే పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఏబీవీపీ విస్తృత స్థాయి ఆందోళనలు, ధర్నాలు చేపడతామని తెలిపారు.
ఈ నిరసనలో నగర కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి అర్జున్, హరిహర, ఆదర్శ్, చందు, మల్లికార్జున్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.

భారీ వర్షాలతో జహీరాబాద్లో పంట నష్టం, ప్రజల ఆవేదన…

భారీ వర్షాలతో జహీరాబాద్లో పంట నష్టం, ప్రజల ఆవేదన

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఆగస్టులో కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలో ఆస్తి, ప్రాణ నష్టం జరిగిన నేపథ్యంలో, బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో జహీరాబాద్లో నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలు జనాలను విసుగు చెందిస్తున్నాయి. గురువారం ఝరాసంగం మండలంలో ఉదయం 8 గంటల నుంచే వర్షం కురుస్తుండటంతో, కోతకు వచ్చిన పంటలను ధాన్యంగా మార్చే ప్రక్రియకు అంతరాయం కలిగి, చేతికొచ్చిన పంట కళ్ళముందే నాశనం అవుతుంటే చూసి భరించలేమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారులు ఎవరైనా ప్రశ్నిస్తే కులస్థంగాల నాయకులతోటి బెదిరింపులు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-11T142537.924.wav?_=1

 

అధికారులు ఎవరైనా ప్రశ్నిస్తే కులస్థంగాల నాయకులతోటి బెదిరింపులు

చందానగర్ టౌన్ ప్లానింగ్ ఏసిపి శిష్యుడుగా*

చందానగర్ సర్కిల్లో సామాన్యులు అధికారులను
కలవాలంటే శ్రీనివాస్ ను
కలిసిన తర్వాతనే అధికారులని
అపార్ట్మెంట్ ఇప్పిస్తాడు

గత సంవత్సరం క్రితమే సర్కిల్ పటాన్చెరు ట్రాన్స్ఫర్ అయ్యి

మళ్లీ చందానగర్ సర్కిల్ కు రావడం ఆశ్చర్యమేంటి
చందానగర్ సర్కిల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగి చెప్పిందే వేదం గత 20 పైనే సంవత్సరాలుగా చందానగర్ సర్కిల్లో పాతుకపోయాడు బిల్లింగ్ పర్మిషన్ కావాలన్నా శ్రీనివాస్ నీ కలవాల్సిందే

అయ్యప్ప సొసైటీలో ఎలాంటి పర్మిషన్లు ఉండవు అది అలుసుగా తీసుకొని, శ్రీనివాస్ బిల్డర్స్ దగ్గర భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి ఆఫీసర్లకు,లీడర్లకు, రిపోర్టర్స్ నేను*
చూసుకుంటానని చెబుతాడు
ఒక బిల్డర్ ఔట్సోర్సింగ్, శ్రీనివాస్ నా దగ్గర మొత్తం డబ్బులు, తీసుకొని నేను ఇస్తానని చెప్పాడు, కావలసి అంటే శ్రీనివాసు డబ్బులు తీసుకుపోయిన వీడియో, ఆడియో, నా దగ్గర ఉన్నది నేను దేనికైనా రెడీ అని బిల్డర్ చెప్తున్నాడు

*చందానగర్ సర్కిల్-21లో కింగ్ మేకర్ ఔట్ సోర్సింగ్, ఉద్యోగి, శ్రీనివాస్,

నిర్మాణాలు జరగాలంటే వీరు అడిగినంత ఇవ్వాల్సిందే

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి, :-

 

 

 

చందానగర్ సర్కిల్లో ,ఔట్ సోర్సింగ్ కింగ్ మేకర్ శ్రీనివాస్ అవతారమెత్తారు. చందానగర్ లో ఆడిందే ఆట..పాడిందే పాటన్న చందనంగా మారిపోయింది. చందానగర్ సర్కిల్ లిమిట్స్ లో ప్రతీరోజు అనేక చోట్ల కొత్త భవనాలు,అదనపు బిల్డింగ్స్ నిర్మాణాలు,సెల్లార్ల కన్స్ట్రక్షన్స్ జరుగుతుంటాయి. అయితే ఎక్కడ కొత్త నిర్మాణాలు ప్రారంభమైనా చైన్ మెన్ లేకపోవడంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు గద్దల్లా వాలిపోవడం పరిపాటిగా మారిపోయింది. భవన నిర్మాణ యాజమానులు వీరికి అడిగినంత ఇస్తే కానీ,అస్సలు ఊరుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. జీరో పర్మిషన్ కు ఎంత చెల్లించాలి,అదనపు ఫోర్స్ కన్స్ట్రక్షన్ కు ఎంత ముట్టజెప్పాలి..కొత్త భవనాల నిర్మాణాలకు ఎంత చెల్లించాలి అనే విషయాలపై వీరే ఓ ధరను నిర్ణయించేస్తున్నారు.

 

 

 

ఒకవేళ వీరు చెప్పినంత ఇవ్వకుంటే వెంటనే ఉన్నతాధికారులకు సదరు నిర్మాణ యాజమానుల వివరాలను చేరవేసి పనులను నిలిపివేయిస్తున్నారనే విమర్శలున్నాయి. ఫైర్ సెఫ్టీ,సెట్ బ్యాక్,ఇతరత్రా కారణాలు చెప్పి నిర్మాణాలు నిలుపుదల చేయిస్తున్నారు. ఈ విషయంలో ఔట్ సోర్సింగ్ శ్రీనివాస్ ఉన్నతాధికారుల నుంచి అండదండలు పుష్కలంగా అందుతున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు ఇచ్చిన సపోర్టుతోనే ఈ అవినీతి చేప పిల్లలు రెచ్చిపోతున్నట్లు సమాచారం. రోజు వారిగా బిల్డింగ్ నిర్మాణ యాజమానుల దగ్గర వసూల్ చేసుకొచ్చిన అవినీతి సోమ్మును పై అధికారులకు వారి వారి స్థాయిలను బట్టి ఎవరి ముల్లే వారికి అప్పజెబుతున్నట్లు తెలుస్తోంది. చందానగర్ సర్కిల్-21 లిమిట్స్ లో వీరి ఆగడాలకు అడ్డూ-అదుపులేని పరిస్థితి దాపురించింది. ఈ వ్యవహరాలపై పలుమార్లు పత్రికల్లో వార్తలు వచ్చినా..ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. అయితే వీరి లీలలను భరించలేని పబ్లిక్ మాత్రం మున్సిపల్ అధికారులపై దుమ్మెత్తిపోస్తున్నారు

కార్మిక వ్యతిరేక నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుదాం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-11T131732.044.wav?_=2

 

కార్మిక వ్యతిరేక నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుదాం

కామెర గట్టయ్య
తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుల

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

భూపాలపల్లి పట్టణంలోని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి టి ఎస్ యు ఎస్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామెర గట్టయ్య మాట్లాడుతూ
నల్ల చట్టాలకు ఆజ్యం పోస్తున్న గుర్తింపు ప్రాతినిత్య కార్మిక సంఘాలు.
సింగరేణిలో కోడ్ ఆఫ్ డిస్ప్లేన్ . అమలు చేస్తూ కార్మికులు కార్మిక సంఘాలు మాట్లాడకుండా హక్కుల గురించి ప్రశ్నించకుండా మాట్లాడే స్వేచ్ఛను కాల రాస్తున్న కార్మికులకు వాక్ స్వాతంత్రం లేకుండా చేసే కుట్రను కార్మిక వర్గం కార్మిక సంఘాలు ఒక తాటిపై నడిచి తిప్పి కొట్టాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్మికులకు కార్మిక సంఘాలకు విజ్ఞప్తి చేస్తుంది
సింగరేణి యాజమాన్యం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఒకటిగా నిలబడి కార్మికుల శ్రమపై ఆధారపడిన యాజమాన్యం కార్మికుల వాక్కు స్వాతంత్రాన్ని విస్మరిస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తూ కార్మికులను కట్టు బానిసలుగా చేయుటకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వంత పాడుతున్న సింగరేణి యాజమాన్యం గుర్తింపు కార్మిక సంఘం ప్రాతినిధ్య కార్మిక సంఘం కార్మికులను మోసం చేస్తూ పబ్బం గడుపు కుఉంటుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు టాక్సీల పేరుతో కోట్లది రూపాయలు కడుతున్న కూడా కనికరించని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి కార్మికులకు సొంత ఇంటి పథకం అమలు చేయాలని గత కొన్ని సంవత్సరాల కాలం నుండి ఉద్యమిస్తున్న కార్మిక సంఘాలను కార్మికుల నుండి దూరం చేయుటకు సింగరేణి యాజమాన్యం కూడా డిస్ప్లే న్ పేరుతో కార్మిక సంఘం నాయకులు బ్యాలెట్ తో కార్మిక వర్గం దగ్గరికి తమ అభిప్రాయాలను తెలుపాలని వచ్చిన కార్మిక సంఘం నాయకులను గేటు దాటవద్దని హుకుం జారీ చేయడాని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం యాజమాన్యం మొండి వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఉంది సింగరేణిలో 1998.ఎన్నికల తర్వాత ఒకే సంఘం పేరుతో కార్మిక సంఘాలను నిర్వీర్యం చేసిన గుర్తింపు సంఘం. ఏఐటీయూసీ మళ్లీ పాత పద్ధతిని 2025 లో అదే నల్ల చట్టాలు కోడ్ ఆఫ్ డిసిప్లిన్ పేరుతో కార్మిక సంఘాలను నిర్వీర్యం చేయుటకు కార్మికులకు సొంతింటి పథకం అమలు చేయాలనే పోరాటాన్ని నిర్వీర్యం చేయుటకే కానీ కార్మిక హక్కుల్ని కాపాడుకొనుటకు కాదు అనేదాన్ని సింగరేణి కార్మిక వర్గం గ్రహించి గుర్తింపు కార్మిక సంఘం నాయకులను కార్మికులు నిలదీయాలని కోరుతుంది సింగరేణి కార్మికులను పకృతికి విరుద్ధంగా పనిచేసే కార్మికులు బార్డర్ సైనికులతో పోల్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బార్డర్ సైనికునికి ఇచ్చిన గుర్తింపులో సగభాగాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు ఇవ్వడం లేదు సింగరేణి కార్మికులకు కేంద్ర ప్రభుత్వానికి కూడా టాక్సీల రూపంలో కార్మికులు పన్నులు కడుతూనే ఉన్నారు కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వాళ్ళ సంక్షేమానికి ఏమీ జవాబుగా నిలిచిందో కార్మిక వర్గం గ్రహించాలి అని కోరుతున్నామని బార్డర్ లో సైనికుని 15 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న సైనికునికి హైదరాబాద్ పట్టణ పరిసర ప్రాంతాలలో రెండు గుంటల జాగా ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం 60 సంవత్సరాలు సింగరేణి కార్మికుల రక్తాన్ని చెమటలు మార్చి దేశానికి వెన్నెముకగా నిలబడితే కార్మికునికి రక్త మాంసాలు ధారపోసి కోట్లాది రూపాయలు లాభాలు తీసుకొస్తున్న కార్మికులకు నివసించుటకు రెండు గుంటల జాగా అడిగితే కార్మికుడు ఉత్పత్తిలో భాగమే తప్ప సొంత ఆస్తి లేదు సొంత ఆస్తిని ఇవ్వము అనే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సింగరేణి యాజమాన్యం వాటికి కొమ్ముకాస్తున్న గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాలను కార్మిక వర్గం నిలదీయాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కోరుతుంది దేశంలో ఉత్పత్తి లో భాగమైన విద్యుత్ పరికరంగా మారిన కార్మికుని 40 సంవత్సరాల నుండి తీసుకున్న టాక్సీ లా రూపంలో తీసుకున్న రూపాయలను లెక్కలోకి తీసుకుంటే కార్మికుడు అడిగే రెండు గుంటల జాగా కు సరిపడే రూపాయలు కష్టతరమైన పని కాదని కూడా ఆలోచించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం. బే షరతుగా కార్మికులకు రెండు గుంటల జాగా పట్టణ ప్రాంతాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కార్మికుల సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తున్న కార్మిక సంఘాలను నిర్వీర్యం చేయాలని చూస్తున్నా గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాలకు బుద్ధి చెప్పుటకు కార్మిక వర్గం సిద్ధం కావాలని ఈసందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం కార్మిక సంఘాలన్నీ కూడా ఒక తాటిపై నిలబడి కార్మిక హక్కులను కాపాడుటకు దోహదపడే విధంగా కార్మిక సంఘాల ఎజెండా ఉండాలని ప్రశ్నించే సంఘాలను అన్ని కూడా ఒక వేదికగా ఏర్పడి కార్మిక హక్కుల కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తో పాటు సింగరేణి యాజమాన్యాన్ని కూడా ఒప్పించి సింగరేణి కార్మికుల సొంతింటి పథకాన్ని అమలు చేయుటకు దోహదపడాలని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరింపబడడాలంటే ఐక్య పోరాటాలే శరణ్యమని ఈ సందర్భంగా తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామెర గట్టయ్య మాట్లాడారు
ఈ సమావేశంలో
టి ఎస్ యు ఎస్ కార్మిక సంఘం నాయకులు
దాసరి జనార్ధన్ కాసర్ల ప్రసాద్ రెడ్డి నామాల శ్రీనివాస్ జయశంకర్ సాజిత్ సలీం నరసింహారెడ్డి యుగంధర్ సిహెచ్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు

డాక్టరేట్ సతీష్ యాదవ్ ను సన్మానము చేసిన పి సి సి దెలిగేట్ మాజి జెడ్పీటి సీ లు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-11T130533.779.wav?_=3

 

డాక్టరేట్ సతీష్ యాదవ్ ను సన్మానము చేసిన పి సి సి దెలిగేట్ మాజి జెడ్పీటి సీ లు

వనపర్తి నేటిదాత్రి .

 

 

వనపర్తి జిల్లా అఖిలపక్ష ఐక్య వేదిక అధ్యక్షులు డాక్టరేట్ పట్ట పొందిన సతీష్ యాదవ్ ను రాష్ట్ర కాంగ్రెస్ పి సి సి దెలిగేట్ టి శంకర్ ప్రసాద్
మాజీ జడ్పి.టి.సిలు మాజీ ఎంపీపీ,, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు మాజీ ఎంపీ.టీ.సీలు సన్మానం చేసిన వారిలో కొత్తకోట మాజీ జెడ్పిటిసి విశ్వేశ్వర్, మాజీ ఎంపీపీ గుంత మౌని క మల్లేష్ , మాజీ ఎం.పీ.టీ.సీ సత్యం యాదవ్, మాజీ కౌన్సిలర్లు ఖాజా మైనద్దీన్, రాములు ఉన్నారు. పెబ్బేరు మాజీ జెడ్పి.టీ.సి కర్రెస్వామి ,వనపర్తి మాజీ జెడ్పిటిసి ధర్మ నాయక్ తదితరులు పాల్గొన్నారు

పత్తి పంటలో..”అంతర పంటగా గంజాయి సాగు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-11T123437.931-1.wav?_=4

 

పత్తి పంటలో..”అంతర పంటగా గంజాయి సాగు”.!

◆:- రూ:1.70 లక్షల విలువ చేసే 17 గంజాయి మొక్కల స్వాధీనం, హద్దునూర్ పోలీసులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

పత్తి పంటలో అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్న సంఘటన సంగారెడ్డి జిల్లా, న్యాల్ కల్ మండలం, చాల్కి గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. హద్దునూర్ ఎస్సై సుజిత్, సంగారెడ్డి క్లూస్ టీం హెడ్ కానిస్టేబుల్ చిట్టిబాబు తెలిపిన వివరాల ప్రకారం.. చాల్కి గ్రామానికి చెందిన ఉప్పరి గుండప్ప (75) గత కొంతకాలంగా తన వ్యవసాయ పొలంలోని పత్తిపంట సాగులో అంతర పంటగా.. గంజాయి సాగును చేస్తుండేవాడు.

 

 

 

నమ్మదగిన సమాచారం మేరకు మంగళవారం సాయంత్రం స్థానిక హద్దునూర్ ఎస్సై సుజిత్, సంగారెడ్డి క్లూస్ టీం పోలీస్ సిబ్బంది, వ్యవసాయ, గ్రామ పంచాయతీ అధికారులతో కలిసి ఆకస్మిక దాడులు చేశారు. సాగులో ఉన్న పత్తిపంటను నిశితంగా పరిశీలించగా దాదాపు రూ:1.70 లక్షల విలువచేసే 17 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. పంటపొలంలో సాయంత్రం నుండి అర్ధరాత్రి వరకు బ్యాటరీల వెలుగుల మధ్య నిశితంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దాడులు చేసిన వారిలో స్థానిక పోలీస్ కానిస్టేబుళ్లు రాజశేఖర్, రవి, మోహన్, పంచాయతీ కార్యదర్శులు రవికుమార్, ధనరాజ్, ఏఈఓ సాయి కిరణ్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

హద్నూర్ లో జూదమాడుతున్న ఇద్దరి జూదరులపై కేసు నమోదు…

హద్నూర్ లో జూదమాడుతున్న ఇద్దరి జూదరులపై కేసు నమోదు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

న్యాల్ కల్ మండలం, హద్దునూర్ గ్రామంలోని ఓ వ్యవసాయ పొలంలో జూదం ఆడుతున్న ఇద్దరు జూదరులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై సుజిత్ తెలిపారు. గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు జూదం ఆడుతుండగా వారి వద్ద నుండి రూ:3400 నగదుతో పాటు 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. దాడి చేసిన వారిలో స్థానిక పోలీసులు అభినయర్, సాయి కిరణ్, కిషన్, రవికుమార్ లు ఉన్నారు.

క్రీడలతో వ్యక్తిత్వ వికాసం దోహదపడుతుంది…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-11T121252.941.wav?_=5

 

క్రీడలతో వ్యక్తిత్వ వికాసం దోహదపడుతుంది :

◆:- పార్లమెంట్ ఇంచార్జ్ జి శుక్లవర్ధన్ రెడ్డి*

◆:- హజ్రత్ షేక్ శహబుద్దిన్ మెగా వాలీబాల్ విజేత జట్టుకు ట్రాఫి నగదు బహుకరణ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

జహీరాబాద్. మండలంలోని శేకపూర్ గ్రామంలో హజ్రత్ షేక్ శహబుద్దిన్ మెగా వాలీబాల్ ట్రాఫీ సీజన్. 4(2025) దిడిగి ఫ్రెండ్స్ విజేతగా నిలిచింది. గత నాలుగు సంవత్సరాలుగా ఉర్సు ఉత్సవాలకు ఒక రోజు ముందు క్రీడలను నిర్వహించి క్రీడకలరులను ప్రోత్సహిస్తారు. ఫైనల్ విజేతగా నిలిచిన దిడిగి ఫ్రెండ్స్ జట్టుకు ఆకర్షణీయమైన ట్రాఫీతో పాటు నగదు బహుమతిని పార్లమెంట్ ఇంచార్జ్ గంకటి శుక్లవర్ధన్ రెడ్డి, పవార్ శ్రీనివాస్ నాయక్ చేతుల మీదుగా అందించారు. రన్నరప్ జట్టు అయిన అల్గోల్ టెంరిస్ జట్టుకు మాజీ ఎంపిటిసి దేశెట్టి పాటిల్, న్యాయవాది నతనియల్, ఆచార్య డిగ్రీ కళాశాల డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ట్రాఫితో పాటు నగదు బహుమానం అందించారు. తృతీయ స్థానంలో నిలిచిన రాయపల్లి జట్టుకు కాంగ్రెస్ నాయకులు రాథోడ్ ప్రేమ్ సింగ్, ఇనాయత్ పటేల్ మల్చేల్మా చేతుల మీదుగా ట్రాఫీతో పాటు నగదు బహుమతి అందజేశారు.

 

 

 

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన పార్లమెంట్ ఇంచార్జ్ శుక్లవర్ధన్ రెడ్డి, సర్పంచ్ ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి, మొహమ్మద్ జమిల్, ఇనాయత్ పటేల్ లకు నిర్వాహకులు ఘనంగా శాలువా పులమలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ శుక్లవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలతో వ్యక్తిత్వ వికాసం పెంపొందుతుందని, క్రీడల్లో రాణించిన ఎందరో యువత నేడు స్పోర్ట్స్ కోటా కింద ప్రభుత్వ ఉద్యోగాల్లో రాణిస్తున్నరాని, భవిషత్తులో తనవంతు సహాయ సహకారాలు అందిస్తూ ఇలాంటి మరిన్ని టౌర్నీలు జరిగేవిధంగా తోడ్పాటు అందిస్తామని, శేకపూర్ గ్రామ ప్రజలకు హజ్రత్ షేక్ శహబుద్దిన్ 675 వ జాతర ఉత్సవ శుభాకాంక్షలు తెలువుతున్నానని, భవిష్యత్తులో కూడా ఇలాగే ఐకమత్యంగా ముందుకు వెళ్లి అనేక విజయాలు సాధించలని, గతంలో మా నాన్న ఎంపిటిసిగా ఉన్నప్పుడు శేకపూర్ గ్రామంతో ప్రత్యేక అనుభందం ఉండేదని, ఇప్పుడు దానికి వారసులుగా మేము ముందుకు వెళ్ళడానికి శయశక్తులు ప్రయత్నిస్తానని అన్నారు. కార్యక్రమంలో ఉర్సు కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ చష్మోద్దీన్, నియోజకవర్గ మైనారిటీ అధ్యక్షుడు మొహమ్మద్ జమిలోద్దీన్, జిల్లా ఎస్టీ కాంగ్రెస్ నాయకులు రాథోడ్ ప్రేమ్ సింగ్ జిడిగడ్డ తండా, సర్పంచ్ ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి, మొహమ్మద్ ఖుర్శిద్ మియా, మొహమ్మద్ అరిఫ్ అలీ, మహేబూబ్ పాష సదర్, జావిద్ ముసవలె, ముజాహిద్ ముసవలె, ఇనాయత్ పటేల్ మల్చేల్మా, మొయిజ్ లష్కరి, నవాజ్ పటేల్, అబ్దుల్లా సిద్దిఖీ, అసద్ యఫై, అమెర్ యఫై, షాకిర్ ఓస్తద్, మొహమ్మద్ మజీద్ తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Exit mobile version