Two-Bedroom Housing for Eligible Beneficiaries: Collector
అర్హులైన లబ్ధిదారులకు రెండు పడక గదుల ఇండ్లు
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల,నేటి ధాత్రి:
అర్హులైన లబ్ధిదారులకు రెండు పడక గదుల ఇండ్లు అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.మంగళవారం జిల్లాలోని బెల్లంపల్లి మండల కేంద్రంలో గల రెండు పడక గదుల ఇండ్లను అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిరుపేదలకు గూడు కనిపించే ఉద్దేశంతో చేపట్టిన రెండు పడక గదుల పథకంలో అర్హులైన లబ్ధిదారులకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.అనంతరం మన కేంద్రంలోని సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని సందర్శించి సబ్ కలెక్టర్ మనోజ్ తో కలిసి కార్యాలయ రికార్డులు, దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు.వివిధ భూ సమస్యలపై భూభారతి రెవెన్యూ సదస్సులలో అందిన దరఖాస్తులను రికార్డులతో సరిచూసి క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
