Self Enumeration Introduced in Census Process
జన గణన లో సెల్ఫ్ ఎన్యుమరేషన్…
మీ ఫోన్ ద్వారా జన గణన లో మీ కుటుంబ వివరాల మీరే పొందుపరచుకోవచ్చు
మహబూబాబాద్/ నేటి ధాత్రి
ఫీల్డ్ ట్రైనర్ ప్రవీణ్ కుమార్ పెనుగొండ ఆధ్వర్యంలో ( రేవ) జిల్లా అధ్యక్షులు సంకా బద్రినారాయణ కి సెల్ఫ్ ఎనమరేషన్ చేయనైనది, ప్రతి ఒక్కరు ఈ సెన్సెస్ కార్యక్రమంలో విధిగా పాల్గొనాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన జన గణన కార్యక్రమం లో మొదట సెల్ఫ్ ఎన్యుమరేషన్ విధానాన్ని మొదట ప్రారంభించేందుకు ప్రక్రియ మొదలైందని విద్యావంతులు ఎవరైనా మొబైల్ ఫోన్ ద్వారా తమ కుటుంబ సభ్యుల వివరాలు మరియు నివాసాల వివరాలు పొందుపరచవచ్చని ఈ విధానం వల్ల జన గణన సులభంగా కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయవచ్చని ఫీల్డ్ ట్రైనర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో ఎన్యుమరేటర్ గా బాధ్యతలు చేపట్టి ప్రతి ఇంటింటికి తిరుగుతూ కుటుంబ సభ్యుల వివరాలు నివాసాల వివరాలు సేకరించి జనగణన చేస్తారని అన్నారు. ఈనెల 26న ఈ సెల్ఫ్ ఎన్యుమరేషన్ కార్యక్రమం ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం ముగిసిందని, ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని విద్యావంతులు ఎవరికి వారు వారి కుటుంబాలను నివాస వివరాలను వారే పొందుపరచుకోవచ్చని ఈ విధానాన్ని అందరూ పాటించాలని సూచించారు. ఎన్యుమరేటర్ గా విధులు నిర్వహించే ప్రభుత్వ ఉపాధ్యాయులు మే 11 తేదీన ప్రతి ఇంటికి జన గణన కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.
