Congress Hits Back at BRS CriticismCongress Hits Back at BRS Criticism
ఓర్వలేక బి ఆర్ఎస్ నేతల విమర్శలు ..
! కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము.
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి.
రైతుల ప్రజా ప్రయోజనాలు పెద్ద పీట వేసే ప్రజా ప్రభుత్వం అని రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి నిర్ణయాలు తీసుకుంటుందని కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము విలేకరుల సమావేశంలో తెలిపారు వారు మాట్లాడుతూ వరంగల్ రైతు సభలో టిఆర్ఎస్ నాయకులు సారంగ మాట్లాడుతూ గత ప్రభుత్వం రుణమాఫీఎలా చేశారో అన్నదాతలకు ఇక గుర్తుంది టిఆర్ఎస్ 2014లో అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రం నిధులు బడ్జెట్తో ఉందని అయినప్పటికీ లక్ష వరకు రుణమాఫీ ఒకేసారి చేయలేకపోయారని తెలిపారు రైతులకు రుణమాఫీ కాకపోగా 20.0630 కోట్ల వడ్డీ భారం రైతుల మీద పడింది అయినప్పటికీ రైతులు నమ్మి టిఆర్ఎస్ కు రెండోసారి అధికారం అప్పగిస్తే 2018 2023 వరకు అధికారంలో ఉంది రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేశారని విమర్శించారు 2018లో లక్ష వరకు పంట రుణమాఫీ చేస్తామని చెప్పి దాన్ని దశలవారీగా అమలు చేయడం ద్వారా రూ.8.515 కోట్ల వడ్డీ భారం పడడంతో పాటు రూ.8.379 కోట్లు పూర్తిగా ఎగగోట్టారని విమర్శించారు అంతేకాకుండా రూ .1.419 కోట్ల ఖాతాలు సరిగ్గా లేనందున వెనక్కి వెళ్లిపోయాయని రైతులను మోసం చేశారు అధికారంలోఉన్న పదేళ్లపాటు రైతుల నిర్లక్ష్యం చేసి నా ప్రభుత్వం ఇప్పుడు రైతులపై ప్రేమ నటించడం కపటత్వానికి నిదర్శనమని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు ఇచ్చిన మాట కట్టుబడి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల కోసం రుణమాఫీ చేయాలని కృత నిశ్చయంతో రూ.20.166.89 కోట్ల పంట రుణమాఫీ చేశారని తెలిపారు రుణమాఫీతో 25.35.964 మంది రైతులు లబ్ధి పొందారని తెలిపారు ప్రస్తుత బి ఆర్ఎస్ నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేయడం తప్ప మరి ఏ పని చేయడం లేదని ద్వారా రైతులకు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు తమ ప్రభుత్వం అభినందాల్సింది పోయి విమర్శించడం బి ఆర్ఎస్ నేతల కుటిల బుద్ధికి నిదర్శనం అని కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము దుయ్యబట్టారు ఇష్ట రాజ్యాంగ మాట్లాడితే బి ఆర్ఎస్ నేతలను ప్రజలే మరో మారు తరిమికొడతారని హెచ్చరించారు
