brs party
తొందర పడితే గెలిచినట్లు కాదు!!
`తిట్లు తింటే చేత కానట్టు కాదు!
`కౌంటర్లు ఆవేశంగా ఇవ్వకుంటే వెనుకబడినట్లు అసలే కాదు.

`ఆవేశ పూరిత మాటలు అన్ని పార్టీలకు అనర్ధమే.
`ప్రత్యర్థుల మాటలే బి ఆర్ ఎస్ కు బలం!
`ప్రజలు ఎంతో గొప్పవాళ్ళు.. వాళ్లకు అన్ని తెలుసు!
`గతంలో ప్రతిపక్షాలు రెచ్చగొట్టే రాజకీయాలు చేసేవి!
`అధికారంలో ఉన్నవాళ్లకు ఓపిక ఉండాలని అనే వారు!
`కాలం మారిన రాజకీయాలు అధికారంలో వున్న వాళ్ళు చేస్తున్నారు.
`బీఆరఎస్ నాయకులకు అహంకారం అని ప్రత్యర్థి పార్టీలు పదే పదే రాజకీయం చేస్తున్నాయి.
`ఆవేశ పూరిత రాజకీయాలు ఎప్పుడూ రాణించవు.
`సానుభూతి రాజకీయాలు ఎప్పుడూ ఓడిపోవు.
`ప్రజల మన్ననలు పొందాలంటే ఓపిక ఎంతో అవసరం.
`ప్రత్యర్థి పార్టీలను తిట్టే కాలం చాలా ముందుంది.
`కేసీఆర్ అంటే తెలంగాణా ప్రజలకు ఒక వర ప్రసాదం.
`కేసీఆర్ పాలన రామ రాజ్య పాలన.
`త్రేతా యుగ పాలనా చదువుకున్నాం.. కేసీఆర్ పాలనా కళ్ళనిండా చూశాం.
`తెలంగాణ లో ఎడారి బతుకు దుర్భర జీవితం గడిపాం.
`అన్నమో రామచంద్రా అని ఆకలి కేకలు అనుభవించాం
`తెలంగాణ తెచ్చిన కెసిఆర్ పాలనలో పరమాన్నం తిన్నాం.
`తెలంగాణ సాధించిన యోధుడుగా అయన పేరు ఎవరూ చేరిపేయలేరు.
`విమర్శలు చేసే వారికి కూడా ఆ విషయం తెలుసు.
`కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని చిన్న పిల్ల వాడికి కూడా తెలుసు.
`తెలంగాణ రాక ముందు తెలంగాణ పరిస్థితులు ఎవ్వరూ మర్చిపోలేదు.
`నరకం లాంటి రోజులను చూసిన తెలంగాణ రైతు ఆ బాధలు మర్చిపోలేడు.
`పాడి కౌశిక్ రెడ్డి కూడా ఆఖరుకు సానుభూతి మీదనే గెలిచాడు.
`ఇప్పుడు ఆవేశ పడితే వచ్చేదేమి లేదు.
`ఇప్పుడు ఎంత ఒదిగి వుంటే బి ఆర్ ఎస్ కు అంత మేలు.
`అవతలి వాళ్లు ఒక్కటంటే పది అనే శక్తి బి ఆర్ ఎస్ కు వుంది.
`బి ఆర్ ఎస్ చెప్పుకోవడానికి ఎంతో వుంది.
`కెసిఆర్ పాలన ఎంత స్వర్ణ యుగమో కొమ్మ, రెమ్మ కూడా చెబుతుంది.
`పల్లె నుంచి మొదలు పట్నం దాకా ప్రతి మట్టి రేణువు చెబుతుంది.
`ప్రత్యర్థి పార్టీల మాటలకు కౌంటర్ ఇవ్వకపోతే వెనుకబడినట్లు కాదు.
`బీఆరఎస్ నాయకులు చెప్పడానికి అనేక సమాధానాలున్నాయి.
`చూపించడానికి అనేక సాక్షాలున్నాయి.
హైదరాబాద్, నేటిధాత్రి:
తిట్టిన వారెప్ప్పుడూ గొప్పవారు కాదు. పడ్డవారెప్ప్పుడూ చెడ్డవారు కాదని సామెత. సమాజంలో ఇద్దరు వ్యక్తులు అనాలోచితంగా, అకారణంగా తిట్టుకుంటారేమో గాని, రాజకీయాల్లో ప్రత్యర్ధి పార్టీలు పనిగట్టుకొని తిట్టుకుంటారు. రెచ్చగొట్టుకుంటారు. ఆవేశ పూరితంగా మాట్లాడుతుంటారు. ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీ వాయిస్ కొంత బలంగా వెళ్తుంది. ఆ పార్టీ మాటలు ప్రజల్లోకి బలంగా వెళ్తాయి. అదే ప్రతిపక్షంలో వున్న పార్టీ మాటలు వక్రీకరణకు గురౌతాయి. గతంలోనూ జరిగింది. ఇప్ప్పుడూ జరుగుతుంది. రేపు కూడా జరుగుతుంది. కాకపోతే ప్రతిపక్షానికి చెందిన బిఆరఎస్ కొంత ఆచి తూచి అడుగులేయాలి. కేంద్ర, రాష్ట్ర పాలక పక్షానికి చెందిన పార్టీలు పనిగట్టుకొని తిడుతున్నాయంటే బిఆరఎస్ బలంగా వున్నట్లే లెక్క. ఆ విషయం బిఆరఎస్ నేతలు కూడా అవగాహన పెంచుకోవాలి. పళ్లున్న చెట్టుకే రాళ్లు పడతాయి. ఈ రెండేళ్ల కాలంలో బిఆరఎస్ అనేక ఓటములను ఎదుర్కొన్నది. ఆఖరుకు సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లోనూ అనుకున్నంత మేర విజయం సాదించలేదు. కాని కేంద్ర,రాష్ట్ర పాలక పక్షాలు మాత్రం బిఆరఎస్ను తిడుతూనే వున్నాయి. కేసిఆర్, కేటిఆర్ టార్గెట్గా రాజకీయాలు చేస్తూనే వున్నాయి. కారణం ప్రజల్లో బిఆరఎస్ బలంగా వుండడమే కారణం. అది బిఆరఎస్ నేతలకు ఇంత వరకు అర్ధం కావడం లేదు. ఒక్కసారి గతంలోకి వెళ్తాం.. బిఆరఎస్ అధికారంలో వున్న సమయంలో సిఎం. రేవంత్రెడ్డిని అనరాని మాటలన్నారు. ఆ సమయానికి అవే పెద్ద మాటలుగా సమాజం అనుకున్నది. ప్రతి సందర్భంలోనూ రేవంత్రెడ్డిని తిడుతూ హీరోను చేసిందే బిఆరఎస్ పార్టీ. రేవంత్రెడ్డి అడుగు తీసి, అడుగు వేయకుండా కట్టడి చేసింది. జనం మధ్యకు వెళ్లకుండా చేసింది. ఆపాలని ఎంతో ప్రతయ్నం చేసింది. సందర్భం దొరికనప్ప్పుడల్లా అరెస్టు చేసింది. ఆ సమయంలో మంత్రిగా వున్న మల్లారెడ్డి సిఎం. రేవంత్రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలు అంతా ఇంతా కాదు. ఏకంగా రేవంత్రెడ్డి కూతరు పెండ్లికి కూడా తానే డబ్బులు ఇచ్చానన్నాడు. ఇలా పదే పదే బిఆరఎస్ నాయకులు తమ నోటికి పనిచెప్పారు. అదే సమయంలో కరీంనగర్ ఎంపి.కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ను కూడా అరెస్టులు చేసింది. ఆయనదీక్ష చేస్తుంటే చిటికీలు పగలగొట్టి మరీ ఆయనను అరెస్టు చేసింది. నిజామాబాద్ ఎంపి. అరవింద్ ఇంటిమీద దాడి బిఆరఎస్ నేతలు దాడి చేశారు. కాని ఆ నాయకులు తిరిగి స్పందించడానికి పెద్దగా వీలు కాలేదు. బిఆరఎస్ తిట్టిన తిట్లు, వేధింపులు ఆ నాయకులకు సానుభూతిగా మారాయి. గత ఎన్నికల్లో బిఆరఎస్ ఓటమికి కారణమయ్యాయి. ఈ విషయం బిఆరఎస్ నాయకులు ఆత్మావలోకనం చేసుకోవాలి. కాకపోతే అప్ప్పుడు బిఆరఎస్ నేతలు ఇష్టానురీతిన మాట్లాడలేదు. కాని ఇప్ప్పుడు అదే కాంగ్రెస్, బిజేపి నాయకులు అదుపు తప్పి మాట్లాడుతున్నారు. సహనం మర్చిపోయి మాట్లాడుతున్నారు. ఆ మాటలు ఎప్పటికైనా సరే బిఆరఎస్కు మేలు చేస్తాయి. సానుభూతిని పెంచుతాయి. కాంగ్రెస్, బిజేపి నాయకులు తిడుతుంటే బిఆరఎస్ నాయకులు మౌనంగా వుంటే తప్ప్పుడు సంకేతాలు వెళ్తాయన్న ఆవేశం వద్దు. మాటకు మాట సమాధానం చెప్పడంలో కూడా బిఆరఎస్ నాయకులు ఎంతో విజ్ఞత ప్రదర్శించాల్సి వుంటుంది. కాంగ్రెస్, బిజేపి నాయకులు మాటల దాడి చేస్తుంటే, బిఆరఎస్ పెద్దలు మౌనంగా వుంటూ కార్యకర్తలు ఊరుకోకపోవచ్చు. మాటకు మాట సమాదానం చెప్పాలని కోరుతుండొచ్చు. మనమేం తక్కువ అని పార్టీ పెద్దలను రెచ్చగెట్టే ప్రయత్నాలు కూడా కార్యకర్తలు చేస్తుండొచ్చు. అలా అని ఎక్కడ వెనుకబడిపోతామో అని పార్టీ నాయకులు, పెద్దలు ఆవేశానికి గురికావొద్దు. కేటిఆర్ మీద గతంలో చేసిన ఆరోపణలే ఇప్ప్పుడూ చేస్తున్నారు. కొత్తగా చేస్తున్న ఆరోపణలు ఏమీ లేవు. ప్రజలు ఎంతో విజ్ఞులు. అన్ని విషయలు నిశితంగా గమనిస్తుంటారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వమే తప్ప చేతల ప్రభుత్వం కాదని తేలిపోయింది. ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఉచిత బస్సుతప్ప మరేం రాలేదన్న సంగతి ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారికి తెలియంది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు, నాయకులు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే క్రమంలో ఏదేదో మాట్లాడుతుంటారు. అది నైతికత కాకపోవచ్చు. కాని రాజకీయాల్లో తప్ప్పు కాదు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సహజం. ప్రజల దృష్టి మళ్లించడం అవసరం. మీడియా కవరేజీవుంటుంది. అదికార పక్షం నేతల మాటలు ప్రజల్లోకి తొందరగా వెళ్తాయి. అందువల్ల రెచ్చగొట్టే వ్యాఖ్యలు పాకులుగా ఎవరున్నా చేస్తుంటారు. అయితే ఒక దశ దాటితే మీడియా కూడా ఎటు వైపు నిలవాలో అటే నిలుస్తుంది. ఎన్నికల నాడు జనం ఎటు వైపు నిలస్తున్నారో అటు వైపు వార్తలు వండి వారుస్తుంది. ఇది బిఆరఎస్ నేతలకు తెలియందికాదు. ఈ విషయాలన్నీ కేసిఆర్కు తెలియకుండానే ఆయన మౌనంగా వుంటున్నారా? ఇప్ప్పుడు పార్టీ నాయకులను కూడా ఆయన కట్టడి చేయలేరు. ప్రతిపక్షం అంటేనే చిటికెల పందిరి. నాయకులను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం వుంటుంది. అధికారంలో వున్నప్ప్పుడే కేసిఆర్ లాంటి నాయకుడే ఆవేశానికి పోయి అనర్ధం తెచ్చుకున్నారు. ప్రతిపక్షంలో వున్న నాడు రేవంత్రెడ్డి విసిరిన సవాళును స్వీకరించి మొదటికే మోసం తెచ్చుకున్నారు. ముప్పై మంది ఎమ్మెల్యేలను మార్చకుండా ఎన్నికలకు పోయే దమ్ముందా? అని సిఎం. రేవంత్ రెడ్డి రెచ్చగొట్టారు. ఓ మహిళను అత్యాచారం చేసి, చంపిన మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు , కుమారుడు వనమా రాఘవకు టికెట్ ఇచ్చారు. ఇది ప్రజలు ఆహ్వానిస్తారా? తెలంగాణ రాజీకీయాలను కుదుపు కుదిపన కీచక రాఘవకు టికెట్ ఇస్తే గెలుస్తారని ఇచ్చారా? అంటే సిఎం. రేవంత్ రెడ్డి చేసిన సవాలుకు స్వీకరించి టికెట్ ఇచ్చారు. బోల్తా పడ్డారు. అలా ఆనాడు ప్రజా వ్యతిరేకత వున్న 30 మంది ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇచ్చారు. పార్టీ ఓటమికి కారకులయ్యారు. ఇంకా ఆవేశాన్ని తగ్గించుకోకపోతే ఎలా? కాంగ్రెస్, బిజేపి పార్టీలకు సమాధానమివ్వడానికి బిఆరఎస్ నాయకులకు అనేక సాక్ష్యాలున్నాయి. తెలంగాణ రావడానికి కారణం ఎవరు? అని దేశంలో ఎవరిని అడిగినా కేసిఆర్ పేరు చెబుతారు. అది చరిత్ర. ఎవరు చింపేస్తే చిరిగిపోయే కాగితం కాదు. తెలంగాణ కోసం కొట్లాడిందెవరో, తెచ్చిందెవరో..ఎలా సాధ్యమైందో, దానికి కారణమెవరో అనేది అందరికీ తెలుసు. అలాంటి కేసిఆర్ పదేళ్ల కాలంలో చేసిన ప్రగతి ప్రజలకు కూడా తెలుసు. అయినా కళ్లముందు ఆ పదేళ్ల కాలాన్ని ఆవిష్కరించండి. కొత్త తరానికి చెప్పండి. తెలంగాణ రాకముందు వున్న చీక బతుకులను గురించి నేటి తరానికి వివరించండి. వారి కుటుంబాలలో వున్న పెద్దలను అడిగి తెలుసుకోండని చెప్పండి. తెలంగాణ ఉద్యమ డాక్యుమెంటరీలు తయారు చేయండి. సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయండి. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన అభివృద్దిని చూపించండి. పదేళ్ల కాలంలో నిండిన చెరువులు, ఇప్ప్పుడు ఎండిన చెరువులు ఎలా వున్నాయో చూపించండి. పదేళ్లుగా ఎండిపోని కాకతీయ కాలువలో నీటి చుక్క ఎందుకు లేదని అడగండి? కేసిఆర్ పాలనలో కొనుగోలు జరిగిన తీరు, కల్లాలలకే వచ్చి వడ్లు కొన్న విధానం చూపించండి. ఐకేపి సెంటర్ల ఏర్పాటు ఎవరు చేశారో చెప్పండి. రైతుల పక్షాన పోరాటం చేయండి. ఆరు గ్యారెంటీల మీద ఉద్యమాలు చేయండి. అదికార కాంగ్రెస్ను తిట్డడానికి ఇంకా చాల కాలం వుంది. ఎన్నికల ముందు ఏం తిట్టాలనుకుంటున్నారో అవి అప్ప్పుడు తిట్టండి. జనం వింటారు. కాంగ్రెస్, బిజేపి నాయకులు తిట్టే తిట్ల వల్ల బిఆరఎస్ సానుభూతి సంపాదించుకోవాలి. అంతే కాని తిట్టుకు తిట్టే సమాధానం అంటే, అదికారంలో వున్న వాళ్లు ఒక్క తిట్టుకు పది తిడతారు. అధికారంలో చేతిలో వుండడంతో దాడులు చేస్తారు. కేసులు నమోదు చేస్తారు. గత ఎన్నికల్లో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌషిక్రెడ్డి ఎంచుకున్న సానుభూతి విధానం అప్ప్పుడే మర్చిపోయారా? గెలిచి పాలకపక్షం మీద పోరాటం చేయడం మితి మీరి మాట్లాడడం కాదు. అలాగే బిఆరఎస్ నాయకురాలు పావనీ గౌడ్ కాళేశ్వరం గురించి వీడియోలు చూపిస్తూ రాజకీయం చేసినప్ప్పుడు అందరూ బేష్ అన్నారు. ఇప్ప్పుడు ఆమె కూడా నోటికి పని చెబుతున్నారు. హద్దులు దాటే వ్యాఖ్యలు చేస్తున్నారు. దాంతో బిఆరఎస్కు రావాల్సిన మైలేజీని ఇలాంటి నేతలే చెడగొడుతున్నారు. కరీంనగర్ రాజకీయంలో బిఆరఎస్కు కలిసి వస్తుందనుకున్న సానుభూతిని ఒక్కరోజులోనే రాకుండా చేసుకున్నారు. స్వయంకృతాపరాధంతో మైలేజీ దక్కండా చేసుకుంటున్నారు. ఆవేశం అనార్దాలకు హేతువు. సహనం అన్ని కార్యాలకు మÖలం.
