ఘనంగా ముగిసిన జాతీయ రహదారి మాసోత్సవం

ఘనంగా జాతీయ రహదారి మాసోత్సవం ముగింపు వేడుకలు

జిల్లా రవాణా శాఖ అధికారి మహమ్మద్ సంధాని

భూపాలపల్లి నేటిధాత్రి

మహదేవపూర్ మండలంలోని గ్రీన్ ఉడ్ పాఠశాలలో రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ రహదారి మాసోత్సవం ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎఎస్పీ నరేష్ కుమార్ జిల్లా రవాణా శాఖ అధికారి మహమ్మద్ సంధాని విద్యార్థులను ఉద్దేశించి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచే రోడ్డు భద్రతా నియమాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండటం అత్యంత అవసరమని తెలిపారు. రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తలు పాటించడం, హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం, ట్రాఫిక్ సిగ్నల్స్‌ను కచ్చితంగా పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు.
విద్యార్థులు రోడ్డు భద్రతకు సంబంధించిన అంశాలను కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా తెలియజేసి సమాజంలో అవగాహన పెంచే బాధ్యత తీసుకుని రహదారి ప్రమాదాలు నివారణకు కృషి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాటారం డిఎస్పీ సూర్యనారాయణ, ఐఎంవిఐలు సుందర్ లాల్, శ్రీనివాస్, ఐరాడ్ డిపిఎం లక్ష్మణ్ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించిన అధికారులు…

రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించిన అధికారులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

రోడ్డు భద్రతా మాసంలో భాగంగా, కోహిర్ మండలం దిగ్వాల్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ( జడ్. పి. హెచ్. ఎస్ ) రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రమాద కారణాలు, ముఖ్యమైన రోడ్డు భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియమాలను పాటించడం యొక్క ప్రాముఖ్యతలను జహీరాబాద్ మోటార్ వెకిల్ ఇన్స్పెక్టర్ వెంకటయ్య గారు, డెక్కన్ టోల్ ప్లాజా సేఫ్టీ మేనేజర్ నాగరాజు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు డెక్కన్ టోల్ ప్లాజా సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version