ఓదెలలో రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన

ఓదెల మోడల్ స్కూల్ రోడ్డు భద్రతా అవగాహన : ఎస్సై దీకొండ రమేష్

ఓదెల(పెద్దపల్లి జిల్లా) నేటిధాత్రి

ఓదెల మోడల్ స్కూల్, మోడల్ జూనియర్ కాలేజీల్లో పోత్కపల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో బుధవారం రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై దీకొండ రమేష్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలు, ప్రాణనష్టం, కుటుంబాలపై పడే దుష్పరిణామాలపై విద్యార్థులకు విస్తృతంగా అవగాహన కల్పించారు. మద్యం మత్తులో వాహనం నడపడం చట్ట విరుద్ధమే కాకుండా తమతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా తీవ్రమైన ము స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడకూడదని, మైనర్లు వాహనాలు నడపరాదని, సరైన డ్రైవింగ్ లైసెన్సు ఉన్నవారే వాహనాలు నడపాలని తెలిపారు. రాంగ్ పార్కింగ్, ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ వంటి చర్యలు ప్రాణాలకే ముప్పు తెస్తాయని హెచ్చరించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో రోడ్ సేఫ్టీపై ప్రతిజ్ఞ చేయించగా, నోటీస్ బోర్డుల్లో రోడ్ సేఫ్టీ పోస్టర్లు అతికించారు. అలాగే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మరియు సోషల్ మీడియాలో రోడ్డు భద్రతపై పోస్టర్లు షేర్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

వనపర్తి లో ట్రాఫిక్ సమస్య…

వనపర్తి లో ట్రాఫిక్ సమస్య

వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి పట్టణంలో కమాన్ చౌరస్తా శ్రీ రామ టాకీస్ ఏరియా నవత ట్రాన్స్పోర్ట్ దగ్గర ట్రాఫిక్ సమస్య సమస్య ఏర్పడింది రోడ్లపై భారీ వాహనాలు పార్కింగ్ చేయడం వల్ల పాదాచారులు ద్విచక్ర వాహన ప్రజలు నడిపే ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నట్లు వాహనాలు నడిపే ప్రజలు తెలిపారు ఇంకా కొందరు నడిరోడ్డుపై భారీ వాహనాలు ఆపి వాహ ద్విచక్ర వాహనాల ప్రజలపై నడుచుకుంటూ వెళ్లే ప్రజలపై ఆగ్రహం దాడులకు దాడులకు దిగుతున్నట్లు ప్రజలు తెలిపారు కమన్ చౌరస్తా కొత్త బస్టాండ్ పానగల్ రోడ్డు రామ టాకీస్ ఏరియా లో ఎక్కడపడితే అక్కడ రాంగ్ రూట్లో వాహనాలు ఆపి షాపింగ్ లు చేయడం వల్ల ట్రాఫిక్ పోలీసులకు ట్రాఫిక్ క్లియర్ చేయడంలో తలనొప్పిగా ఏర్పడింది .గతంలో సీ ఐ సూర్య నాయక్ వనపర్తి టౌన్ ఎస్ఐ వెంకటేష్ గౌడ్ రోడ్లపై లారీలు ఇతర వాహనాలు పార్కింగ్ చేయకుండా చర్యలు తీసుకున్నారు వనపర్తి ప్రజలు అప్పట్లో వారికి కృతజ్ఞతలు తెలిపారు . ఉదయం 6 నుండి 10 వరకు లోడింగ్ అన్లోడింగ్ క్లియర్ చేయుటకు లారీ యజమానులతో ట్రాన్స్పోర్ట్ యజమానులతో వర్తక సంఘం అధ్యక్షులతో మాట్లాడి కృషి చేశారు దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర ట్రాఫిక్ సిగ్నల్ పని చేయనందువల్ల ద్విచక్ర వాహనదారులు కార్లు జీపులు స్పీడుగా అడ్డదిడ్డంగా నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు గురి చేస్తున్నారు మున్సిపల్ కమిషనర్ వెంటనే స్పందించి రోడ్డు ప్రమాదాలకు నివారించుటకు దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ రాజీవ్ చౌక్ దగ్గర ట్రాఫిక్ సిగ్నల్ రిపేరు చేయించాలని లేదా కొత్తగా ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు ఏర్పాటు చేయించాలని ప్రజలు కోరుతున్నారు అదేవిధంగా త్రిబుల్ రైడింగ్ యువకులు ఫోన్ మాట్లాడుకుంటూ ద్విచక్ర వాహనాలు కార్లు నడపడం వల్ల రోడ్డుపై నడిచే ప్రజలు వృద్ధులు వికలాంగులు ఇబ్బందులకు గురవుతున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చీర్ల శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే వనపర్తి లో జిల్లాస్థాయి ఉన్నతాధికారులు స్పందించి ట్రాఫిక్ సిగ్నల్స్ అదేవిధంగా కమాన్ చౌరస్తా దివంగత మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాలకృష్ణయ్య విగ్రహం దగ్గర ట్రాఫిక్ కానిస్టేబుల్ ను నియమించాలని ఆయన
కోరారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version