ఈ రోడ్డు తీరు మారేదెప్పుడు…

ఈ రోడ్డు తీరు మారేదెప్పుడు

పరకాల నేటిధాత్రి
అనునిత్యం వాహనాల రాకపోకలతో రద్దిగా ఉండే పట్టణంలోని జయ థియేటర్ రోడ్డు పరిస్థితి వాహనదారుల,షాపు నిర్వాహకుల తీరు మారడం లేదు,వాహనదారులు షాపుల ముందు మోటారు సైకిల్లను ఇస్టమచ్చినట్టుగా ఇస్టాను సారంగా ఎక్కడ పడితే అక్కడ వాహనాలను నిలుపుతున్నారు,ఇష్టానుసార పార్కింగ్ ల వల్ల ఇతర పనుల నిమిత్తం వెళ్లే పాద చారులకు,వాహనదారులకు తీవ్ర ఇబ్బందికి గురిచేస్తున్నారు.రాజధాని టీ ప్యాలెస్ దగ్గరనుండి మొదలుకొని జయ థియేటర్ వరకు అసలు షాపులకు ఎలాంటి పార్కింగ్ స్థలాలు లేవని,పరిమితిని దాటి రోడ్లమీదనే తమకు నచ్చినట్టుగా,వాహనాలను నిలిపి వస్తువులను పెట్టి వ్యాపారాలను కొనసాగిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.సివిల్ ఆసుపత్రి వెళ్లే ప్రధాన దారి ఇదే అవ్వడం అత్యవసర నిమిత్తం ఆసుపత్రికి వెళ్లే తరుణంలో అంబులెన్సులకు కూడా దారి లేకుండా పోయిన పరిస్థితులెన్నో ఉన్నాయని ఈ విషయంలో స్థానిక అధికారులు స్పందించి ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని వ్యాపారస్థులకు,వాహనదారులకు ట్రాఫిక్ పట్ల అవగాహన కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

కోహీర్ మున్సిపాలిటీలో మార్పేది.!

కోహీర్ మున్సిపాలిటీలో మార్పేది?

◆: కొత్త మున్సిపాలిటీకి కమిషనర్ కరువు

◆: నెల నుంచి ఆగిన ఆన్లైన్ సేవలు

◆: అయోమయంలో పట్టణ ప్రజలు

◆: పట్టించుకొని అధికారులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

కోహీర్,గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా ప్రకటించడంతో తమ సమస్యలు తీరుతాయని సంతోషపడిన పట్టణ ప్రజలకు నిరాశే మిగిలింది. కోహీర్ గ్రామ పంచాయతీలో 21వేలకు పైగా జనాభా ఉండడంతో ఈ సంవత్సరం జనవరి 27న మున్సిపాలిటీగా ప్రకటిం చారు. మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్, ఇతర అధి కారులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని దీంతో తమ సమస్యలు తీరుతాయని అనుకున్న ప్రజలకు ఎదురుచూపులు తప్పడం లేదు. జనవరి 28న ఉమామ హేశ్వర్రావు కోహీర్ పట్టణ తొలి మున్సి పల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరిం చారు. కానీ ఆయన ఫిబ్రవరి 16 వరకు మాత్రమే ఇక్కడ విధులు నిర్వహించా రు. పట్టణ ప్రజల సమస్యల పరిష్కారా నికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయ కపోవడంతో మున్సిపల్ అధికారులు సహితం ఇబ్బందులు పడుతున్నారు. కొత్త మున్సిపాలిటీ అయిన ఐదు నెలల్లో నలుగురు కమిషనర్లు ఇక్కడకు వచ్చి చేసే దేమీలేక తిరిగి వెళ్లారు. ఉమామహేశ్వర్ రావు జనవరి 28 నుంచి ఫిబ్రవరి 16 వరకు కోహీర్ కమిషనర్గా విధులు నిర్వహించారు. తర్వాత వెంకట్రెడ్డి మార్చి 18వ తేదీ వరకు కార్యాలయ విధులకు హాజరయ్యారు. ఆయన బదిలీ కావడంతో మున్సిపల్ కమిషనర్ రమేశ్ కుమార్ బాధ్యతలను చేప ట్టారు. కానీ అతడు కూడా మార్చి 4వ తేదీ వరకు మా త్రమే ఇక్కడ పని చేశారు. తాండూర్ వెళ్లిపోవడంతో కొత్త కమిషనర్ గా ప్రకాశ్ విధుల్లో చేరారు. అతడిని కూడా సీడీ ఎంఏ హైదరాబాద్ హెడ్ ఆఫీస్కు బదిలీ చేస్తున్నట్లు ఉత్త ర్వులు జారీ చేశారు. కొత్త కమిషనర్ వచ్చే వరకు లోనే విధులు నిర్వహించాలని మౌకికంగా సూచించారు. కానీ ఎలాంటి ఆదేశాలు లేకపోవడంతో ఆయన మాత్రం జూన్ 4న దీర్ఘకాలిక సెలవు పెట్టి వెళ్లిపోయారు. దీంతో నెల గడిచినా కొత్త కమిషనరు నియమించలేదు. దీంతో పట్ట ణంలో ఎక్కడ చూసినా సమస్యలు దర్శనమిస్తున్నాయి. సీసీ రోడ్లపై మురుగు, రోడ్ల పక్కన చెత్త కనిపిస్తున్నది.

నిలిచిన ఆన్లైన్ సేవలు

కోహీర్ పట్టణ మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వ హించిన ప్రకాశ్ జూన్ 4వ తేదీన హైదరాబాద్ కార్యాల యానికి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఒక్క ఆన్లైన్ పని చేయలేని పరిస్థితి ఏర్పడింది. కొత్త కమిషనర్ వస్తేనే అతడి కీ ద్వారానే కంప్యూటరీకరణ ప్రారంభమవుతుంది. కానీ పట్టణ ప్రజలు పత్రాల కోసం నిత్యం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అక్కడ ఉన్న సిబ్బంది కూడా నిస్సా హయ స్థితిలో ఉన్నారు. వారు కేవలం పారిశుధ్యం, ఇంది

విద్యా రంగంలో మార్పు మొదలైంది నారా లోకేశ్.

విద్యా రంగంలో మార్పు మొదలైంది నారా లోకేశ్…

 

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల్లో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అలాంటి సంఘటన తాజాగా చోటు చేసుకుంది. ఈ ఘటనపై విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు.అమరావతి, జూన్ 29: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యారంగంలో మార్పు మొదలైందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. విద్యా వ్యవస్థలో సమూల ప్రక్షాళన కోసం ఏడాది కాలంగా తాను చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. నక్కపల్లి మండలం దేవవరంలో ఒకే రోజు 32 మంది విద్యార్థులు ప్రైవేటు స్కూళ్ల నుంచి ప్రభుత్వ మోడల్ ప్రైమరీ పాఠశాలకు మారడం హర్షణీయమని సంతోషం వ్యక్తం చేశారు. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ కోసం తాను చేస్తున్న కృషిలో భాగస్వాములుగా నిలుస్తున్న అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తలిదండ్రులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు.2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటరు.. కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టాడు. దీంతో చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఆయన కేబినెట్‌లో విద్య శాఖ మంత్రిగా నారా లోకేశ్ బాధ్యతలు చేపట్టారు. ఆ క్రమంలో విద్యా రంగంలో సమూల మార్పులకు ఆయన శ్రీకారం చుట్టారు. గత నెలలో విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదవిన విద్యార్థులు మంచి ర్యాంకులు పొందారు.దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించేందుకు తల్లిదండ్రులు తీవ్ర ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. మరోవైపు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నారు. అదే విధంగా తల్లికి వందనం కింద వారి ఖాతాల్లో రూ.15వేలు సైతం ప్రభుత్వం వేస్తోంది. దీంతో కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని చూసి చిన్నారుల తల్లిదండ్రులు వారిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చుతున్నారు.

బీజేపీ పార్టీ భారత రాజ్యాంగంన్ని మార్చే కుట్ర చేస్తోంది.

బీజేపీ పార్టీ భారత రాజ్యాంగంన్ని మార్చే కుట్ర చేస్తోంది

కుల మత విద్వేషాలు రెచ్చగోడుతుంది

కొత్తగూడ,నేటిధాత్రి:

 

కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు
కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన
జై బాపు జై భీమ్ జై సంవిదన్
అను కార్యక్రమం న్ని కొత్తగూడ మండల కేంద్రం లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో ఘనంగా నిర్వహించారు..మండల కమిటీ నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య విచ్చేసి ముందుగా మండల కేంద్రం లోని బాబా సాహెబ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహని కి పూలమాల వేసారు అనంతరం జెండా ఎగరేశారు కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతూ ఆల్ ఇండియా పార్టీ తీసుకున్న కార్యక్రమం లో భాగంగా ఈరోజు నుంచి దేశ వ్యాప్తంగా జై బాపు జై భీమ్ జై సంవిధన్
కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ పిలుపు నేడు కొత్తగూడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని భారత రాజ్యాంగం నీకి అన్యాయం చేసే కుట్ర బీజేపీ చేస్తుందని రాజ్యాంగం ని నిర్లక్ష్యం చేస్తూ కులాల చిచ్చు మతాలరొచ్చు దేశం లో అలజడులు సృష్టి స్తుంది రాజ్యాంగం కాపాడడం కోసం కాంగ్రెస్ పార్టీ అహర్నిశలు కృషి చేస్తుందని.. జై బాపు జై భీమ్ జై సంవిధన్ అని అన్నారు..ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య, టీపీసీసీ ఆర్గనైజ్ సెక్రటరీ చల్లా నారాయణరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధికార ప్రతినిధి ఇర్ఫా రాజేశ్వర్, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ ప్రెసిడెంట్ సుంకరబోయిన మొగిలి, డిసిసి సభ్యులు వీరనేని వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు బిట్ల శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ కాడబోయిన జంపయ్య, యూత్ మండల అధ్యక్షులు బోయినేని ప్రశాంత్ రెడ్డి, యూత్ జిల్లా జనరల్ సెక్రెటరీ నోముల ప్రశాంత్, ఓబీసీ జిల్లా జనరల్ సెక్రటరీ మల్లెపూ రంజిత్, యూత్ మండల ఉపాధ్యక్షులు చొప్పారి కుమార్, సోషల్ మీడియా మండల కోఆర్డినేటర్ సిరిగిరి సురేష్, వివిధ గ్రామా పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు…

3 నుంచి ఉర్దూ మధ్యమ పాఠశాలల సమయం మార్పు.

జహీరాబాద్: 3 నుంచి ఉర్దూ మధ్యమ పాఠశాలల సమయం మార్పు: డీఈవో

జహీరాబాద్. నేటి ధాత్రి:

రంజాన్ నెల సందర్భంగా ఉర్దూ మాధ్యమ పాఠశాల వేళలో మార్పులు చేసినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు. ఉర్దూ మాధ్యమంలో చదివే విద్యార్థులకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1: 30 వరకు పాఠశాలలు జరుగుతాయని చెప్పారు. ఈ విషయాన్ని ఉపాధ్యాయులు, విద్యార్థులు గమనించాలని పేర్కొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version