కొత్తగా ఏర్పడిన కోహిర్ మున్సిపాలిటీతో ప్రజల కష్టాలు తెర్చే అధికారులే లేరు
జహీరాబాద్ నేటి ధాత్రి:
కోహిర్ కొత్తగా మునిసిపాలిటీగా ఏర్పడిన తర్వాత అధిక సమస్యలు ఎదుర్కొంటున్న కోహిర్ ప్రజానీకం సమస్యలు చెప్పుకోవడానికి మున్సిపాలిటీ అధికారులు దిక్కులేరు,, వీధిలైట్లు లేక,,, మురికి నీరు నిండి వివిధ రోగాల బారిని పడుతున్న ప్రజలు,, బర్త్ సర్టిఫికెట్లు,, డెత్ సర్టిఫికెట్లు రాక,, రోడ్లు గుంతల మయమై ప్రజలు ఇబ్బందులు పడుతున్న,, ప్రజల ఇండ్లు రికార్డులో ఒకరి పేరు ఆన్లైన్లో ఇంకొకరి పేరు ఇలా ఎన్నో సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమస్యను చెప్పుకుందాం అని వెళితే అధికారులు దిక్కులేరు టిపిఓ టౌన్ ప్లాన్ ఆఫీసర్ నియమితులై ఎన్నో రోజులు గడుస్తున్న ప్రజలకు అందుబాటులో లేకుండా కనీసం సమస్య తెలపటానికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ప్రతిస్పందన లేకుండా ప్రజల ఫోన్ నెంబర్లను బ్లాక్ లిస్టులో వేస్తూ వాట్సాప్ లో సమస్యల గురించి విన్నవించుకున్న నిమ్మకు నెరెత్తినట్టు ప్రజల కష్టాలను తీర్చడమే లేకుండా ఇంకా ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న ఇలాంటి అధికారుల పైన కోహిర్ మున్సిపల్ కమిషనర్ ,,, జిల్లా కలెక్టర్,, CDMA కమిషనర్ చర్యలు తీసుకొని ఇలాంటి అధికారులను సస్పెండ్ చేసి ప్రజలకు సేవ చేసి అధికారిని నియమించవలసిందిగా ప్రజల విజ్ఞప్తి చేస్తున్నారు.