పంచవటి సరస్వతి దేవస్థానంలో వేంకటేశ్వర కళ్యాణ మహోత్సవం

*పంచవటి సరస్వతి దేవస్థానంలో శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం*

*జహీరాబాద్ నేటి ధాత్రి:*

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ న్యాల్కల్ మండలంలోని పంచవటి సరస్వతి దేవస్థానంలో జనవరి 23 నుండి 25, 2026 వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరగనుంది.

జనవరి 24న స్వామివారి కళ్యాణం, 25న రథసప్తమి సందర్భంగా రథోత్సవం నిర్వహిస్తారు. 63 గ్రామాలకు పైగా బోనాల ఊరేగింపు, పల్లకీ సేవ, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శన కృప పొందాలని కోరడం జరిగింది.

మంత్రిగా ప్రమాణం చేసిన అజారుద్దీన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ఫక్రుద్దీన్…

మంత్రిగా ప్రమాణం చేసిన అజారుద్దీన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ఫక్రుద్దీన్

◆:- కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు మొహమ్మద్ ఫక్రుద్దీన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

తెలంగాణ మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణం చేయించారు. సీఎం రేవంత్ రెడ్డి
ఇతర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రికెటర్గా అంతర్జాతీయ గుర్తింపు పొందిన అజారుద్దీన్, 1989లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ బాధ్యతలు చేపట్టారు. రిటైర్మెంట్ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి, 2009లో కాంగ్రెస్ పార్టీ లో చేరి ఎంపీగా గెలుపొందారు. 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా పనిచేశారు. ఈ సందర్భంగా ఝరాసంగం గ్రామ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ యువ నాయకులు మొహమ్మద్ ఫక్రుద్దీన్ శుభాకాంక్షలు తెలియజేశారు,

మంత్రి కొండా సురేఖకు తీర్థప్రసాదాలను అందజేస్తున్న వేముల మహేందర్ గౌడ్…

మంత్రి కొండా సురేఖకు తీర్థప్రసాదాలను అందజేస్తున్న వేముల మహేందర్ గౌడ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

కార్తీక మాసం సందర్భంగా తొలి సోమవారం తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన దేవాలయం శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంను దర్శించుకుని మొక్కులను సమర్పించిన బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ శుక్రవారం అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను శుక్రవారం హన్మకొండలోని రాంనగర్ లో గల మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి తీర్థ ప్రసాదలను అందజేశారు. ఈ సందర్భంగా వేములవాడలో భక్తులకు ఎలాంటి సౌకర్యాలు అందుతున్నాయి. ఎండోమెంట్ అధికారులు భక్తులకు అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పిస్తున్నారా..? లేదా అని మహేందర్ గౌడ్ ను అడిగి తెలుసుకున్నారు. తమరి ఆధీనంలో ఉన్న దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రసిద్ధిగాంచిన దేవాలయాల అభివృద్ధి పనులు చక చకా జరుగుతున్నాయని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయాలకు సంబంధించి ఎక్కువ నిధులను కేటాయించి..ప్రజలకు మెరుగైన వసతులతో పాటు..ప్రజలలో ఆధ్యాత్మికత పెంపొందించే విధంగా..అనేక కార్యక్రమాలు తీసుకుంటున్న సందర్భంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని, శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు మీపై, తెలంగాణ రాష్ట్ర ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు వేముల మహేందర్ గౌడ్ మంత్రి కొండా సురేఖకు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version