నేడు కోనాపురం శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం

నేడు కోనాపురం శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం

12వ వార్షిక కళ్యాణ మహోత్సవ జాతర ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన గ్రామ పెద్దలు

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో ఎంతో ప్రాచుర్యం పొందిన కోనాపురం శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుట్టపై నేడు శుక్రవారం 27 న కళ్యాణ మహోత్సవం జరగనుంది. కోనాపురం గ్రామంలోని గుట్టపై స్వయంభుగా వెలసిన శ్రీ బాల ఉగ్ర నరసింహస్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం కళ్యాణ మహోత్సవ జాతర ఉత్సవాలను గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహిస్తున్నారు.ఈ సంవత్సరం కూడా 12వ వార్షిక కళ్యాణ మహోత్సవం సందర్భంగా 27 ఫిబ్రవరి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఈ కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు గ్రామ అర్చకులు కసివొజ్జల శివకృష్ణచార్యులు వెల్లడించారు. గురువారం గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ నాయకులు, గ్రామ యువకుల ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవ జాతర ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు.ఈ జాతర ఉత్సవాల్లో భాగంగా 27 ఫిబ్రవరి శుక్రవారం రోజు రాత్రి 8 గంటలకు స్వామివారి కళ్యాణం, 3 మార్చి మంగళవారం రోజున జాతర (ప్రభ బండ్లు), 7 మార్చి శనివారం రోజున స్వామి వారి రథోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. స్వయంభుగా వెలిసిన శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామి, పాదాలు, పకృతి సాహసిద్ధంగా ఏర్పడిన కోనేరు మరెన్నో ప్రత్యేకలు కలిగిన ఈ దేవాలయాన్ని, జరగబోయే కళ్యాణ మహోత్సవాన్ని మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరై శ్రీ లక్ష్మీనరసింహస్వామి అనుగ్రహం పొందాలని ఆలయ అర్చకులు, గ్రామ పెద్దలు కోరారు.

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజలు

శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలుబీ

వనపర్తి నేటిధాత్రి .

 

 

వనపర్తి జిల్లా కేంద్రంలో శంకర్ గంజ్ లో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు మంగళవారం ఉదయం ఉత్తర ద్వారా దర్శనం భక్తులకు ఆలయ కమిటీ నిర్వాహకులు కల్పించారు .ఈ సందర్భంగా ప్రత్యేక పూజలో ఆలయ కమిటీ నిర్వాహకులు దాచ లక్ష్మీనారాయణ దాచ శివకుమార్ న్యాయవాది దార వెంకటేష్ క్రాంతి ట్రాన్స్పోర్ట్ విజయ్ నూకల రామకృష్ణ లగిశెట్టి శ్రీకాంత్ ఈపూరి వెంకటేష్ గోనూర్ రాజు నుకల నాగరాజు 33 వ వార్డు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ జర్నలిస్ట్ పొలిశెట్టి సురేష్ తిరుమల్ శంకర్ గంజ్ ఆలయ కమిటీ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆలయ పూజారి చల్ల వెంకటేశ్వర్ల శర్మ భక్తులకు అర్చనలు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ శ్రీ లక్ష్మీనరసింహ ఆలయంలో ప్రతినెల స్వాతి నక్షత్రం లో ప్రత్యేక పూజలు పల్లకి సేవ రాత్రి ఉంటుందని వారు పేర్కొన్నారు శంకర్ గంజ్ శ్రీలక్ష్మి నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version