కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే సంస్థ సరళంగా నడుస్తుంది…

కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే సంస్థ సరళంగా నడుస్తుంది

మందమర్రి నేటి ధాత్రి

 

ఎండల తీవ్రత దృష్ట్యా కాంట్రాక్టు కార్మికుల పని వేళలు మార్చాలి.

కార్మికులకు ఓఆర్ఎస్, మజ్జిగ ప్యాకెట్లు, తాగేందుకు చల్లటి మంచినీళ్లు అందించాలి.

సివిల్ అధికారులకు సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో వినతి పత్రం.

దూలం శ్రీనివాస్
సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు

మందమర్రి డివిజన్ పరిధిలో పనిచేస్తున్న సివిక్ కాంట్రాక్ట్ కార్మికులకు ఎండల తీవ్రత దృష్ట్యా పని వేళలు మార్చి, కార్మికులు డీహైడ్రేషన్ బారిన పడకుండా ఓ ఆర్ ఎస్, మజ్జిగ ప్యాకెట్లు అలాగే పని ప్రదేశంలో త్రాగడానికి చల్లటి మంచినీళ్లు ఏర్పాటు చేయాలని ఈరోజు మందమర్రి ఏరియాలోని సివిల్ అధికారులకు వినతిపత్రం ఎస్సీకేఎస్ సిఐటియు ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా దూలం శ్రీనివాస్ సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ
సింగరేణి సంస్థ ఆరోగ్యంగా ముందుకు సాగాలంటే కార్మికులు ఆరోగ్యంగా ఉండాలి. రోజు రోజుకు తీవ్రంగా పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా సివిక్ కాంట్రాక్టు కార్మికులు ఎండ తీవ్రతకు డిహైడ్రేషన్ బారిన పడి ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నందువల్ల కార్మికులకు పని వేళలను ఉదయం 6:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు మార్పు చేయాలని అలాగే కార్మికులకు ఓఆర్ఎస్, మజ్జిగ ప్యాకెట్లు, త్రాగడానికి చల్లటి మంచినీటి ఏర్పాటు చేసి కార్మికుల ఆరోగ్యాలను కాపాడాలని సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం సిఐటియుగా విజ్ఞప్తి చేశారు. అధికారులు కార్మికుల ఆరోగ్య దృశ్య వెంటనే స్పందించి పని వేళలు మార్చి, కార్మికులు ఎండ దెబ్బ బారిన పడకుండా ఓఆర్ఎస్, మజ్జిగ ప్యాకెట్లు విరివిరిగా సివిల్, సివిక్ కాంట్రాక్టు కార్మికులకు అందించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు మందమర్రి బ్రాంచ్ కార్యదర్శి అల్లి రాజేందర్, సివిక్, సివిల్ కాంట్రాక్టు కార్మికులకు పాల్గొన్నారు.

ఆఫ్-సైట్ మాక్ డ్రిల్ అవగాహన సదస్సులో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్…

ఆఫ్-సైట్ మాక్ డ్రిల్ అవగాహన సదస్సులో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్

నర్సంపేట,నేటిధాత్రి:

https://youtu.be/NoviIp1TUK4?si=EohsYI-9HsxUTNf_

నర్సంపేట పట్టణంలో మెగా గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ టీఎం అవినాష్, ఓఎం టీమ్ రాజేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆఫ్ సైట్ మాకు డ్రిల్ అవగాహన సదస్సులో ముఖ్యఅతిథిగా నర్సంపేట మున్సిపాలిటీ చైర్ పర్సన్ శ్రీమతి పెండెం శ్రీలక్ష్మీరామానంద్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ మాట్లాడుతూ
మెగా గ్యాస్ వినియోగం పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పరిశ్రమల్లో కర్మాగారంలో పల లేదా గృహ నివాసంలో గ్యాస్ లీకేజీ లాంటి ప్రమాదం లేదా భారీ అగ్నిమాపక ప్రమాదం జరిగినప్పుడు ప్రజలు సమస్యను ఎదుర్కొని ఎలా సురక్షితంగా బయటపడాల్లో ఒక అవగాహన వస్తుందని అన్నారు. ప్రాణ, ఆస్తి నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించేందుకు ఇలాంటి మాక్ డ్రిల్స్ ఎంతో ఉపయోగపడతాయని అని అన్నారు. పోలీస్, ఫైర్ సర్వీస్, వైద్య బృందాలు, మరియు రెవెన్యూ శాఖల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడానికి తోడ్పడుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్,టౌన్ ఎస్సై గూడ అరుణ్ , మున్సిపల్ కౌన్సిలర్లు ఎలకంటి విజయ్ కుమార్, మాదాసి రవి , పొన్నాల మనీషా-ప్రకాష్ , ములుకల వినోద-సాంబయ్య , కొంపల్లి వీణ-విజేందర్ రెడ్డి, వేల్పుల శ్రీలత,ఇస్లావత్ రామ-గోపి నాయక్ , తదితరులు పాల్గొన్నారు.

“శ్రీసిటీకి కొత్త ఎస్ఐ ప్రియాంక”

*శ్రీసిటీ హైటెక్ పి.ఎస్ నూతన ఎస్ఐ గా ప్రియాంక..

శ్రీసిటీ(నేటిధాత్రి)డిసెంబర్ :

 

శ్రీసిటీ హైటెక్ పోలీస్టేషన్ నూతన ఎస్ఐ గా ప్రియాంక సోమవారం భాద్యతలు చేపట్టారు.
తిరుపతి ఎస్.బి నుంచి ఇక్కడ కు ఉన్నతాధికారులు బదిలీ చేయడం జరిగింది.
ఎస్ఐ ప్రియాంక గతంలో నాగలాపురం, నారాయనవనం మండలాల్లో విధులును నిర్వహించిఉన్నారు‌.
అలాగే బుచ్చినాయుడు కండ్రిగ ఎస్.ఐ సుధీర్ కుమార్ రెడ్డిని, చంద్రగిరి పిఎస్ నుండి చిత్ర తరుణ్ ను ఉన్నతాధికారులు ఇక్కడకు బదిలీ చేశారు.
దీంతో శ్రీసిటీ హైటెక్ పోలీస్టేషన్ లో ముగ్గురు ఎస్ఐ లు నూతనంగా విధులును నిర్వర్తించనున్నారు.
ఈ సందర్భంగా ఎస్ఐ ప్రియాంక మాట్లాడుతూ..ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విధి నిర్వహణలో రాజీ లేకుండా కృషిచేస్తామన్నారు.
శ్రీసిటీ పారిశ్రామిక వాడ భద్రతా ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక మైన రీతిలో భద్రత చర్యలను చేపట్టడం జరుగుతుందన్నారు.
శ్రీసిటీ సెజ్ గ్రామీణ ప్రాంత ప్రజలుకు, మహిళా కార్మికులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్నారుఈ ప్రాంతంలో ఏవైనా భద్రతా పరమైన సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు..

కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వినతి…

కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వినతి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ ప్రాంతంలోని పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో మంగళవారం వినతిపత్రం సమర్పించారు. ఏరియా కార్యదర్శి మహిపాల్ మాట్లాడుతూ, పరిశ్రమల్లో కార్మికులు మరణిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ సమస్యలపై తక్షణమే స్పందించి, కార్మికుల భద్రతకు చర్యలు తీసుకోవాలని వినతిలో కోరారు.

కార్మికుల ప్రాణాలు పట్టణి సింగరేణి యాజమాన్యం…

కార్మికుల ప్రాణాలు పట్టణి సింగరేణి యాజమాన్యం,

మందమర్రి నేటిధాత్రి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) మంచిర్యాల జిల్లా కమిటీ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
ప్రమాదల నివారణకు సి అండ్ ఎండీ చైర్మన్,డైరెక్టర్లకు,సేప్టి జీఎం జోక్యం చేసుకోవాలి.

ఓకే కుటుంబం,ఒకే లక్ష్యం,ఓకే గమ్యం అనే నినాదం పేరుకేనా?
అధికారులకు సిపిఎం సూటి ప్రశ్న

సంకే రవి సిపిఎం జిల్లా కార్యదర్శి

గనిప్రమాదాలు,రక్షణ చర్యలు,
పని ఒత్తిడి,వైద్య సౌకర్యాల్లో కొనసాగుతున్న లోపాలపై జిఎం కార్యాలయం వద్ద సీపీఎం నిరసన పర్సనల్ మేనేజర్ గార్క్ వినతి పత్రం.

ఎస్ సి సి ఎల్ మందమర్రి,
శ్రీరాంపూర్, బెల్లంపల్లి ఏరియాలల్లో అన్ని విభాగాల్లో పనిచేస్తున్న పర్మనెంట్,
కాంట్రాక్టు కార్మికులు విధుల నిర్వహణలో అనేక ప్రమాదాలు జరిగి మరణించడం, గాయలపాలు కావడం జరుగుతుంది.తమ ఆప్తులను కోల్పోయిన
వారి కుటుంబాలు మానసికక్షోభకు గురై పోతున్నారు.సంస్థను లాభాల బాటలో నడిస్తున్నా కార్మికుల ప్రాణాలను కాపాడడంలో సింగరేణి యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యాన్ని పాటిస్తున్నది.ఉత్పత్తి,లాభలు సాదిసిస్తున్నా కార్మికుల ప్రాణాలను కాపాడం కోసం రక్షణ వ్యవస్థను పటిష్టం చెయ్యడం లేదు,రక్షణ సూత్రాలను యాజమాన్యం పాటించడం లేదు.పని ప్రదేశాల్లో ఎలాంటి ఇబ్బందులున్నాయో కార్మికులు,కార్మిక సంఘాలు చెప్పిన కూడ కనీసం వినడం లేదు,
పట్టించుకోవడం లేదు.
కాల పరిమితి నిండిపోయి,చెడిపోయిన యంత్రాలతో పని చేయిస్తు.
ప్రమాదాలకు కారణం అవుతున్నారు.ప్రమాదంలో గాయపడ్డవారిని గనిలో నుంచి తీసుకురావడం కోసం కనీసం స్త్రేచ్చర్ లేకపోవడం,అంబులెన్స్ లు అందుబాటులో లేకపోవడం,నిపుణులైన వైద్యులు లేకపోవడాన్ని చూస్తుంటే సింగరేణిలో ఆటవీక రాజ్యం కొనసాగుతున్నట్లుగా కనిపిస్తున్నది.పని స్థలాల్లో స్వచ్ఛమైన గాలి అందకపోవడం,రక్షణ చర్యలు చేపట్టకపోవడం,
ఉత్పత్తి,లాభాల కోసం షిప్ట్ ల సంఖ్యను పెంచడం,
నాసి రకమైన రక్షణ పరికరాలతో బలవంతంగా ప్రమాదకరమైన పరిస్థితిల్లో కార్మికులను యంత్రాల్లగా పని చేయించడం జరుగుతుంది.
గడిచిన 2,3 సం.రాల నుంచి నేటి వరకు అనేక ప్రమాదాలు జరిగి పలువురు పర్మనెంట్,కాంట్రాక్టు కార్మికులు
మరణించడం,గాయల పాలుకావడం జరిగింది.
ఇన్ని ప్రమాదాలు జరిగినా బాధ్యులపై చర్యలు లేవు, భవిష్యత్తులో జరగకుండ చెయ్యడం కోసం యాజమాన్యంలో చలనం లేదు.
ఉత్పత్తి,లాభాల కోసం యాజమాన్యం ఎంతైతే శ్రద్ద పెట్టుతున్నదో అంతకంటే ఎక్కువ శ్రద్ద కార్మికుల ప్రాణాలను కాపాడం కోసం తక్షణమే రక్షణ వ్యవస్థను బలోపేతం కోసం తగిన చర్యలు చేపట్టాలి.లేకుంటే
ప్రతి మరణం,ప్రమాదం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో సింగరేణి యాజమాన్యం చేస్తున్న కుట్రలుగా కార్మికులు,ప్రజలు బావించ వల్సిసి వస్తుంది.
సి & ఎండీ చైర్మన్,డైరెక్టర్లకు,
సేఫ్టీ జీఎం,కేంద్ర,
రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి కార్మికుల ప్రాణాలను కాపాడలని డిమాండ్ చేస్తున్నాము.

డిమాండ్స్

1,జరిగిన ప్రమాదాలు,దాని కారణాలు,రక్షణ వ్యవస్థ పని తీరుపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి.
2,తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం తక్షణమే అన్ని పర్మనెంట్,కాంట్రాక్టు యూనియన్లతో,నిపుణులతో,సీనియర్ కార్మికులతో సమావేశాలు ఏర్పాటు చెయ్యాలి.
3,ప్రమాదాలకు బాధ్యులుగా స్థానిక అధికారి,సేఫ్టి అధికారి, ఏరియా జనరల్ మేనేజర్లపై చర్యలు తీసుకోవాలి.
4,డీజీఎంఎస్ తో జరిగే త్రిసభ్య కమిటి సమావేశంలో అన్ని కార్మిక సంఘాలను, కాంట్రాక్టు కార్మిక సంఘాలను పిలవాలి.
5,ప్రతి షిఫ్ట్ లో సెప్టి అధికారులను నియమించాలి.
6,పని ప్రదేశాల్లో పటిష్ఠమైన రక్షణ చర్యలు తీసుకోవాలి.
7,ప్రతి విభాగం వద్ద ప్రాథమిక వైద్యంతో పాటు,అంబులెన్స్ లు,
స్త్రేచ్చర్లు,ఆక్సిజన్,ఫస్ట్ యిజ్ స్టేషన్ ఏర్పాటు చెయ్యాలి
8,బెల్లంపల్లి,రామకృష్ణ పూర్ ఏరియా ఆసుపత్రిలల్లో అన్ని రకాల వైద్య నిపుణులతో పాటు,తగినంత సిబ్బందిని నియమించాలి.
9,ఉత్పత్తి,లాభాలే కాదు కార్మికులు,వారి కుటుంబాలు,ప్రాణాలు,
సంక్షేమం మాదే అనే విధంగా యాజమాన్యం వ్యవరించాలి.
10,ప్రమాదాలు జరిగినప్పుడు అంబులెన్స్ తో పాటు డాక్టర్లను ప్రమాదం జరిగిన ప్రాంతానికి పంపించాలి.
11,కార్మికులకు రక్షణ మరియు సంక్షేమానికి నిధులను పెంచాలి.

ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు

సంకె రవి సీపీఎం జిల్లా కార్యదర్శి

సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు
గోమసా ప్రకాష్,బోడెంకి చందు
జిల్లా కమిటీ సభ్యులు
దూలం శ్రీనివాస్,గుమసా అశోక్,సామల ఉమ రాణి.

నాయకులు దాగం శ్రీకాంత్,
జి.మహేందర్,సిడం సమ్మక్క, బి.రమాదేవి,నిర్మల
,సిడం జంగు బాయి,
కె.రాజేశం, రాజలింగు, పోషం తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version