కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే సంస్థ సరళంగా నడుస్తుంది…

కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే సంస్థ సరళంగా నడుస్తుంది

మందమర్రి నేటి ధాత్రి

 

ఎండల తీవ్రత దృష్ట్యా కాంట్రాక్టు కార్మికుల పని వేళలు మార్చాలి.

కార్మికులకు ఓఆర్ఎస్, మజ్జిగ ప్యాకెట్లు, తాగేందుకు చల్లటి మంచినీళ్లు అందించాలి.

సివిల్ అధికారులకు సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో వినతి పత్రం.

దూలం శ్రీనివాస్
సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు

మందమర్రి డివిజన్ పరిధిలో పనిచేస్తున్న సివిక్ కాంట్రాక్ట్ కార్మికులకు ఎండల తీవ్రత దృష్ట్యా పని వేళలు మార్చి, కార్మికులు డీహైడ్రేషన్ బారిన పడకుండా ఓ ఆర్ ఎస్, మజ్జిగ ప్యాకెట్లు అలాగే పని ప్రదేశంలో త్రాగడానికి చల్లటి మంచినీళ్లు ఏర్పాటు చేయాలని ఈరోజు మందమర్రి ఏరియాలోని సివిల్ అధికారులకు వినతిపత్రం ఎస్సీకేఎస్ సిఐటియు ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా దూలం శ్రీనివాస్ సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ
సింగరేణి సంస్థ ఆరోగ్యంగా ముందుకు సాగాలంటే కార్మికులు ఆరోగ్యంగా ఉండాలి. రోజు రోజుకు తీవ్రంగా పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా సివిక్ కాంట్రాక్టు కార్మికులు ఎండ తీవ్రతకు డిహైడ్రేషన్ బారిన పడి ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నందువల్ల కార్మికులకు పని వేళలను ఉదయం 6:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు మార్పు చేయాలని అలాగే కార్మికులకు ఓఆర్ఎస్, మజ్జిగ ప్యాకెట్లు, త్రాగడానికి చల్లటి మంచినీటి ఏర్పాటు చేసి కార్మికుల ఆరోగ్యాలను కాపాడాలని సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం సిఐటియుగా విజ్ఞప్తి చేశారు. అధికారులు కార్మికుల ఆరోగ్య దృశ్య వెంటనే స్పందించి పని వేళలు మార్చి, కార్మికులు ఎండ దెబ్బ బారిన పడకుండా ఓఆర్ఎస్, మజ్జిగ ప్యాకెట్లు విరివిరిగా సివిల్, సివిక్ కాంట్రాక్టు కార్మికులకు అందించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు మందమర్రి బ్రాంచ్ కార్యదర్శి అల్లి రాజేందర్, సివిక్, సివిల్ కాంట్రాక్టు కార్మికులకు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version